Gujarat vs Delhi: గుజరాత్ను వణికించిన దిల్లీ
దిల్లీ అదరగొట్టింది. ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా గుజరాత్తో జరిగిన మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
అహ్మదాబాద్: దిల్లీ అదరగొట్టింది. ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా గుజరాత్తో జరిగిన మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత దిల్లీ బౌలర్లు చెలరేగడంతో 17.3 ఓవర్లలో గుజరాత్ 89 పరుగులకే కుప్పకూలింది. రషీద్ ఖాన్ (31) టాప్ స్కోరర్. 90 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పంత్ సేన 8.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. జేక్ ఫ్రేజర్ (20; 10 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లు), షై హోప్ (19; 10 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్లు), అభిషేక్ పొరెల్ (15; 7 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), రిషభ్ పంత్ (16*; 11 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) దూకుడుగా ఆడారు. గుజరాత్ బౌలర్లలో సందీప్ వారియర్ 2, స్పెన్సర్ జాన్సన్, రషీద్ ఖాన్ ఒక్కో వికెట్ తీశారు.
లక్ష్యఛేదనకు దిగిన దిల్లీ.. జేక్ ఫ్రేజర్ దూకుడుగా ఆడటంతో 1.5 ఓవర్లకే 25 పరుగులు చేసింది. స్పెన్సర్ జాన్సన్ వేసిన రెండో ఓవర్లో చివరి బంతికి ఫ్రేజర్ అభినవ్కు క్యాచ్ ఇచ్చాడు. సందీప్ వేసిన తర్వాతి ఓవర్లో పృథ్వీ షా (7) వెనుదిరిగాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన అభిషేక్ పొరెల్, షై హోప్ కూడా ధాటిగా ఆడారు. సందీప్ వేసిన ఐదో ఓవర్లో హోప్ తొలి మూడు బంతులకు వరుసగా 4, 6, 6 బాదేశాడు. ఇదే ఓవర్లో అభిషేక్ ఓ సిక్సర్ బాది క్లీన్బౌల్డ్ అయ్యాడు. హోప్ను రషీద్ ఖాన్ వెనక్కి పంపాడు. అప్పటికే దిల్లీ లక్ష్యానికి చేరువగా పంత్, సుమిత్ (9) లాంఛనాన్ని పూర్తి చేశారు.
హడలెత్తించిన దిల్లీ బౌలర్లు
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్.. దిల్లీ బౌలర్ల ధాటికి కుదేలైంది. ముకేశ్ కుమార్ (3/14), ఇషాంత్ శర్మ (2/8), ట్రిస్టన్ స్టబ్స్ (2/11) గుజరాత్ పతనాన్ని శాసించారు. దిల్లీ బౌలర్ల ధాటికి రషీద్ ఖాన్తోపాటు సాయి సుదర్శన్ (12), రాహుల్ తెవాటియా (10) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. మిగతా వారంతా సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో శుభ్మన్ గిల్ (8)ని ఇషాంత్ శర్మ ఔట్ చేయడంతో గుజరాత్ వికెట్ల పతనం మొదలైంది. ముకేశ్ కుమార్ వేసిన నాలుగో ఓవర్ ఐదో బంతిని వృద్ధిమాన్ సాహా (2) వికెట్ల మీదికి ఆడుకున్నాడు. ఇషాంత్ వేసిన ఐదో ఓవర్ ఆరంభంలో సుదర్శన్ రనౌట్ కాగా.. అదే ఓవర్లో చివరి బంతికి డేవిడ్ మిల్లర్ (2) వెనుదిరిగాడు. రిషభ్ పంత్ అద్భుతంగా డైవ్ చేస్తూ క్యాచ్ అందుకోవడంతో మిల్లర్ ఔటయ్యాడు.
వరుసగా వికెట్లు పడటంతో గుజరాత్ స్కోరు వేగం నెమ్మదించింది. ఈ క్రమంలో పంత్ స్టబ్స్ చేతికి బంతి ఇచ్చి ఫలితం రాబట్టాడు. అతడు వేసిన తొమ్మిదో ఓవర్లో అభినవ్ మనోహర్ (8), షారూఖ్ ఖాన్ (0)ను పంత్ మెరుపు వేగంతో స్టంపింగ్ చేశాడు. రాహుల్ తెవాటియాను అక్షర్ పటేల్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 14 బంతులు ఆడిన మోహిత్ శర్మ (2)ను ఖలీల్ వెనక్కి పంపాడు. ఒంటరి పోరాటం చేస్తున్న రషీద్ను, నూర్ అహ్మద్ (1)ను ముకేశ్ ఒకే ఓవర్లో ఔట్ చేయడంతో గుజరాత్ ఆలౌటైంది.
- ఐపీఎల్ చరిత్రలో గుజరాత్కిదే అత్యల్ప స్కోరు. ఈ సీజన్లో ఒక జట్టు చేసిన అత్యల్ప స్కోరు కూడా ఇదే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్