Delhi vs Chennai: హ్యాట్రిక్పై కన్నేసిన చెన్నైకి ఝలక్.. ఖాతా తెరిచిన దిల్లీ
చెన్నైతో జరిగిన మ్యాచ్లో దిల్లీ జట్టు 20 పరుగుల తేడాతో విజయం సాధించి మెగా టోర్నీలో ఖాతా తెరిచింది.
విశాఖపట్నం: ఐపీఎల్ 2024లో దిల్లీ (Delhi) జట్టు ఎట్టకేలకు ఖాతా తెరిచింది. విశాఖ వేదికగా చెన్నై (Chennai)తో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్లో 191 పరుగులు చేసిన దిల్లీ.. అనంతరం బౌలింగ్లో చెన్నైని 171 పరుగులకే కట్టడి చేసింది. ఆ జట్టులో రహానె (45: 30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్. చివర్లో ధోనీ (37*; 16 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లు) మెరుపులు మెరిపించినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (1), రచిన్ రవీంద్ర (2) ఘోరంగా విఫలమవడం చెన్నైకి ప్రతికూలంగా మారింది. డారిల్ మిచెల్ (34; 26 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్లు) రాణించాడు. శివమ్ దూబె (18), రవీంద్ర జడేజా (21*) పరుగులు చేశారు. దిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్ 3, ఖలీల్ అహ్మద్ 2, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశారు.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఓపెనర్లు వార్నర్ (52: 35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లు), పృథ్వీ షా (43: 27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లు) తొలి వికెట్కు 93 పరుగుల భాగస్వామ్యం అందించారు. స్వల్ప తేడాతో వీరిద్దరూ ఔటైనప్పటికీ.. మార్ష్ (18) సహాయంతో పంత్ (51: 32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధశతకంతో చెలరేగాడు. దీంతో దిల్లీ భారీ స్కోర్ నమోదు చేసింది. చెన్నై బౌలర్లలో పతిరన మూడు వికెట్లు తీయగా, ముస్తాఫిజుర్, జడేజా తలో వికెట్ తీశారు.
మ్యాచ్ విశేషాలు
- ఈ సీజన్లో ధోనీ బ్యాటింగ్కు దిగడం ఇదే తొలిసారి.
- రోడ్డు ప్రమాదంలో గాయపడిన తర్వాత మొదటిసారి ఐపీఎల్ ఆడుతున్న రిషభ్ పంత్ హాఫ్ సెంచరీ చేయడం ఇదే మొదటిసారి.
- ఈ సీజన్లో దిల్లీ ఓపెనర్ పృథ్వీ షాకు ఇది మొదటి మ్యాచ్. ఆడిన ఫస్ట్ మ్యాచ్లోనే ధనాధన్ ఆటతీరుతో అలరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
-
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
-
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
-
రైటర్గా నాని.. జోరందుకున్న ప్రచారం
-
తెదేపా కొనసాగి ఉంటే 2021లోనే పోలవరం పూర్తయ్యేది: సీఎం చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM