Delhi vs Gujarat: పోరాడిన గుజరాత్.. ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం
గుజరాత్తో జరిగిన ఉత్కంఠ పోరులో దిల్లీ 4 పరుగుల తేడాతో నెగ్గింది. 225 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 220 పరుగులు చేసింది.
దిల్లీ: ఐపీఎల్ 17వ సీజన్లో దిల్లీకి నాలుగో విజయం. గుజరాత్తో జరిగిన ఉత్కంఠ పోరులో ఆ జట్టు 4 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన దిల్లీ.. 4 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యఛేదనలో గుజరాత్ 8 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (65; 39 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ శతకంతో మెరిశాడు. డేవిడ్ మిల్లర్ (55; 23 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వృద్ధిమాన్ సాహా (39; 25 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. చివర్లో రషీద్ ఖాన్ (21*; 11 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), సాయి కిశోర్ (13; 6 బంతుల్లో 2 సిక్స్లు) పోరాడినా గుజరాత్కు ఓటమి తప్పలేదు. చివరి ఓవర్లో గుజరాత్ విజయానికి 19 పరుగులు అవసరం కాగా.. రషీద్ మొదటి రెండు బంతులను బౌండరీకి పంపాడు. తర్వాతి రెండు బంతులకు పరుగులేమీ రాలేదు. ఐదో బంతికి సిక్స్. చివరి బంతికి విజయ సమీకరణం ఐదు పరుగులు కాగా రషీద్ ఖాన్ సింగిల్ కూడా తీయలేకపోయాడు. దిల్లీ బౌలర్లలో రషిక్ సలామ్ 3, కుల్దీప్ యాదవ్ 2, నోకియా, ముకేశ్ కుమార్, అక్షర్ పటేల్కు ఒక్కో వికెట్ దక్కింది.
చెలరేగిన పంత్, అక్షర్
తొలుత దిల్లీ తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించినా.. రిషభ్ పంత్ (88*; 43 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్లు), అక్షర్ పటేల్ (66; 43 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లు) చెలరేగి ఆడటంతో భారీ స్కోరు చేసింది. ఊపుమీద కనిపించిన ఓపెనర్ జేక్ ఫ్రేజర్ (23; 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లు) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. పృథ్వీ షా (11), షై హోప్ (5) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. దీంతో 44 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో అక్షర్, పంత్ ఇన్నింగ్స్ను గాడిలో పెట్టారు. ఈ జోడీ నాలుగో వికెట్కు 113 పరుగులు జోడించింది. అక్షర్ ఔటైన తర్వాత వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్ (26; 7 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లు) మెరుపులు మెరిపించాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో పంత్ చివరి ఐదు బంతులకు వరుసగా 6, 4, 6, 6, 6 బాదేశాడు. దిల్లీ చివరి రెండు ఓవర్లలో ఏకంగా 53 పరుగులు రాబట్టడం విశేషం. గుజరాత్ బౌలర్లలో సందీప్ వారియర్ 3, నూర్ అహ్మద్ ఒక వికెట్ పడగొట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం