Delhi vs Gujarat: పోరాడిన గుజరాత్.. ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం
గుజరాత్తో జరిగిన ఉత్కంఠ పోరులో దిల్లీ 4 పరుగుల తేడాతో నెగ్గింది. 225 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 220 పరుగులు చేసింది.
దిల్లీ: ఐపీఎల్ 17వ సీజన్లో దిల్లీకి నాలుగో విజయం. గుజరాత్తో జరిగిన ఉత్కంఠ పోరులో ఆ జట్టు 4 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన దిల్లీ.. 4 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యఛేదనలో గుజరాత్ 8 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (65; 39 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ శతకంతో మెరిశాడు. డేవిడ్ మిల్లర్ (55; 23 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వృద్ధిమాన్ సాహా (39; 25 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. చివర్లో రషీద్ ఖాన్ (21*; 11 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), సాయి కిశోర్ (13; 6 బంతుల్లో 2 సిక్స్లు) పోరాడినా గుజరాత్కు ఓటమి తప్పలేదు. చివరి ఓవర్లో గుజరాత్ విజయానికి 19 పరుగులు అవసరం కాగా.. రషీద్ మొదటి రెండు బంతులను బౌండరీకి పంపాడు. తర్వాతి రెండు బంతులకు పరుగులేమీ రాలేదు. ఐదో బంతికి సిక్స్. చివరి బంతికి విజయ సమీకరణం ఐదు పరుగులు కాగా రషీద్ ఖాన్ సింగిల్ కూడా తీయలేకపోయాడు. దిల్లీ బౌలర్లలో రషిక్ సలామ్ 3, కుల్దీప్ యాదవ్ 2, నోకియా, ముకేశ్ కుమార్, అక్షర్ పటేల్కు ఒక్కో వికెట్ దక్కింది.
చెలరేగిన పంత్, అక్షర్
తొలుత దిల్లీ తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించినా.. రిషభ్ పంత్ (88*; 43 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్లు), అక్షర్ పటేల్ (66; 43 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లు) చెలరేగి ఆడటంతో భారీ స్కోరు చేసింది. ఊపుమీద కనిపించిన ఓపెనర్ జేక్ ఫ్రేజర్ (23; 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లు) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. పృథ్వీ షా (11), షై హోప్ (5) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. దీంతో 44 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో అక్షర్, పంత్ ఇన్నింగ్స్ను గాడిలో పెట్టారు. ఈ జోడీ నాలుగో వికెట్కు 113 పరుగులు జోడించింది. అక్షర్ ఔటైన తర్వాత వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్ (26; 7 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లు) మెరుపులు మెరిపించాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో పంత్ చివరి ఐదు బంతులకు వరుసగా 6, 4, 6, 6, 6 బాదేశాడు. దిల్లీ చివరి రెండు ఓవర్లలో ఏకంగా 53 పరుగులు రాబట్టడం విశేషం. గుజరాత్ బౌలర్లలో సందీప్ వారియర్ 3, నూర్ అహ్మద్ ఒక వికెట్ పడగొట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
ఐపీఎల్ ముగిసిన వారం రోజులకే మరో క్రికెట్ సంగ్రామం ప్రారంభం కానుంది. కానీ, దానిపై ఉగ్రమూకలు కన్నేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలపై ఐసీసీ స్పందించింది. -
కుర్రాళ్లు ఇంకా నేర్చుకోవాలి.. ఒత్తిడిని తట్టుకోవాలి: కేఎల్ రాహుల్
కోల్కతా చేతిలో భారీ ఓటమితో లఖ్నవూ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి పడిపోయింది. మిగిలిన మూడు మ్యాచుల్లోనూ గెలిస్తేనే ఆ జట్టుకు ప్లేఆఫ్స్ బెర్తు ఖాయమవుతుంది. -
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
తన టీ20 కెరీర్లో తొలిసారి ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. ఐపీఎల్ 17వ సీజన్లో పంజాబ్తో జరిగిన మ్యాచ్లో క్రీజ్లోకి వచ్చిన ధోనీ మొదటి బంతికే ఔటయ్యాడు. -
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసిన కోల్కతా ప్లేఆఫ్స్ బెర్తుకు దగ్గరైంది. తన చివరి మూడు మ్యాచుల్లో ఒక్కటి గెలిస్తే నాకౌట్ దశకు చేరుకోవడం ఖాయం. ఇప్పటికే అందరికంటే ముందున్న ఆ జట్టు ఓడినా ఇబ్బంది ఉండకపోవచ్చు. -
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
పంజాబ్ను చిత్తు చేయడంలో చెన్నై ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. -
జ్వరం బారిన ప్లేయర్లు.. ఎవరు ఆడతారో తెలియలేదు: రుతురాజ్
పంజాబ్పై చెన్నై ప్రతీకార విజయం సాధించింది. చెపాక్లో జరిగిన పరాభావానికి ధర్మశాలలో బదులు తీర్చుకుంది. ప్లేఆఫ్స్ రేసులో ముందుకు దూసుకొచ్చింది. -
కోల్కతా నం.1
కోల్కతాది అదే జోరు. ఈ సీజన్లో అదిరే ప్రదర్శనతో దూసుకుపోతున్న నైట్రైడర్స్.. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతే కాక ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. -
చెన్నై చుట్టేసింది
చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్తో మ్యాచ్లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది. -
బజ్రంగ్పై వేటు
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (నాడా) సస్పెండ్ చేసింది. ఇటీవల ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్టు కోసం నమూనా ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. -
జ్యోతికశ్రీ బృందానికి నిరాశ
పారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ రిలే తొలి అంచె టోర్నీలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ బృందానికి నిరాశ ఎదురైంది. -
అక్టోబరు 6న పాక్తో భారత్ ఢీ
బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ గ్రూప్ ‘ఎ’లో పోటీ పడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఓ క్వాలిఫయర్ ఈ గ్రూప్లోని ఇతర జట్లు. -
బంగ్లాకు మరో విజయం
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్లో బంగ్లాదేశ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులే చేసింది. -
అవే సిరాజ్ బలాలు
తనపై తనకి నమ్మకం, వెనుదీయని తత్వం పేసర్ మహ్మద్ సిరాజ్ నిజమైన బలాలని సునీల్ గావస్కర్ అన్నాడు. ‘‘మైదానంలో సిరాజ్ సర్వశక్తులూ ఒడ్డుతాడు. -
పుజారా శతకం
భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకం సాధించాడు. ససెక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా..
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు
-
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు