MS Dhoni - Rohit: ఆ విషయంలో ఎంఎస్ ధోనీ - రోహిత్ శర్మ ఒకటే: కైఫ్
టీ20 ప్రపంచ కప్ కోసం ఇప్పటికే టీమ్ఇండియా అమెరికాకు చేరిన సంగతి తెలిసిందే. వార్మప్ మ్యాచ్లో అదరగొట్టిన భారత్.. అసలైన పోరుకు సిద్ధమవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: టెక్నాలజీని, గేమ్ను అర్థం చేసుకోవడంలో ఎంఎస్ ధోనీకి (MS Dhoni) తిరుగులేదని భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ వ్యాఖ్యానించాడు. అతడి బాటలోనే ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ముందుకుసాగుతున్నాడని కైఫ్ పేర్కొన్నాడు. వీరిద్దరూ సాంకేతిక అంశాలను క్రికెట్లో వాడుకోవడంలో ముందున్నారని తెలిపాడు. ధోనీ మిగతా వారందరికీ మినహాయింపు, రోహిత్ కూడా ఇందులో మాస్టర్స్ చేసినట్లు అనిపిస్తోందని చెప్పాడు.
‘‘మ్యాచ్లో టెక్నాలజీ, కామన్సెన్స్ను బ్యాలెన్స్ చేయడాన్ని ధోనీ, రోహిత్ సాధించారు. గేమ్లో ఎప్పుడు ఏం జరుగుతుందో కంప్యూటర్ కూడా అంచనా వేయలేదు. ఆటగాళ్లు, సిబ్బంది ఎన్నిసార్లు చర్చించినా వేస్టే. ఆ మ్యాచ్ రోజు తీవ్ర ఒత్తిడిలోనూ ఇంగిత జ్ఞానాన్ని ప్రదర్శించడం అత్యంత కీలకం. మానసికంగా మనం ఎంత బలంగా ఉన్నామనేది తెలియజేస్తుంది. ఇందులో ధోనీని మించిన ఉదాహరణ మరెవరూ ఉండరు. నాయకుడిగా ధోనీ ఆలోచనలు విభిన్నంగా ఉంటాయి. చివరి ఓవర్ సమయంలో బౌలర్ చాలా ఒత్తిడిలో ఉంటాడు. అయితే, ధోనీ చూసే విధానం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఒకవేళ బౌలర్ సిక్స్ ఇచ్చినా.. మరొక బంతి వరకూ వెయిట్ చేయ్ అని చెబుతాడు. ఇలా అందరూ చెప్పలేరు. ఆటగాళ్లకు ఇలాంటి స్వేచ్ఛ ఇస్తే వారి మైండ్సెట్ కూడా మారిపోతుంది. మరింత మెరుగైన ప్రదర్శన చేసేందుకు అవకాశం ఉంటుంది’’ అని కైఫ్ వెల్లడించాడు.
ఆటగాళ్లపై ఎలాంటి ఆంక్షలు లేవు!
భారత్ ఆడే క్రికెట్ మ్యాచ్లకు ఉగ్ర ముప్పు ఉందనే వార్తల నేపథ్యంలో ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆటగాళ్లు కూడా న్యూయార్క్ వీధుల్లో తిరుగుతున్న ఫొటోలు వైరల్గా మారాయి. ప్లేయర్లపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. బంగ్లాదేశ్తో వార్మప్ మ్యాచ్ అనంతరం క్రికెటర్లు సరదాగా గడిపారు. జూన్ 5న ఐర్లాండ్తో టీమ్ఇడియా తొలి మ్యాచ్ ఆడనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ