MS Dhoni: ధోనీకి ఆ పరిస్థితి రాదు.. క్రికెటే జీవితం కాదనే విషయం అతడికి తెలుసు: జహీర్
భారత్కు రెండు వరల్డ్ కప్లు, ఛాంపియన్స్ ట్రోఫీ.. చెన్నై సూపర్ కింగ్స్ను ఐపీఎల్లో ఐదుసార్లు విజేతగా నిలిపిన ‘కెప్టెన్’ కూల్ ఎంఎస్ ధోనీ (MS Dhoni). క్రికెట్ పట్ల అభిరుచి ఎంతలా ఉంటుందో.. మిగతా విషయాల్లోనూ పక్కా ప్రణాళికతో ఉండటం విశేషం.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ప్రతీ నిర్ణయం వెనక ఎంతో ఆలోచన ఉంటుంది. ఎప్పుడు తన కెప్టెన్సీని త్యజించాలి.. ఎప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడాలనే విషయాలే దానికి ఉదాహరణ. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో మాత్రమే ధోనీ ఆడుతున్నాడు. గత రెండు సీజన్ల నుంచి ఈసారే చివరిదని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ధోనీ మాత్రం ఆడేస్తూ అవన్నీ పుకార్లేనని నిరూపించాడు. ఇప్పుడు మరోసారి అలాంటి వార్తలే వినిపిస్తున్నా ధోనీ అభిమానులు మాత్రం కొట్టిపడేస్తున్నారు. ఈక్రమంలో భారత మాజీ క్రికెటర్లు జహీర్ ఖాన్, సురేశ్ రైనా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి.
‘‘క్రికెటే సర్వస్వం కాదని ధోనీ చాన్నాళ్ల కిందటే అర్థం చేసుకున్నాడు. ఆటపట్ల అతడికున్న అభిరుచి అద్భుతం. తన జీవితంలో క్రికెట్ను భాగం మాత్రమే చేసుకున్నాడు. ఇదే అంతా అని మాత్రం అనుకోలేదు. ప్రతీ క్రికెటర్కు ఇలాంటి దశ తప్పదు. ఎందుకంటే ఒక్కసారి గేమ్ నుంచి బయటకొచ్చాక.. ఏం చేయాలనే దానికి పెద్దగా ఆప్షన్లు ఉండవు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత కష్టాలు పడిన చాలామంది అథ్లెట్లను చూశా. ఆట కోసం తమ సర్వస్వం ధారపోసినా, రిటైర్మెంట్ తర్వాత ఏం చేయాలో తెలియక ఇబ్బందిపడ్డారు. ధోనీకి మాత్రం ఇలా జరగదు. దానికి కారణం క్రీడేతర అంశాల్లోనూ ఆసక్తి చూపాడు. ఉదాహరణకు బైక్స్ అంటే అతడికి చాలా ఇష్టం. వాటిపై ఎప్పుడూ పరిశోధిస్తూనే ఉంటాడు’’ అని జహీర్ తెలిపాడు.
ధోనీ మరో ఐదేళ్లు ఆడాలి: రైనా
‘‘చెన్నై సూపర్ కింగ్స్ అభిమానుల్లోనే కాకుండా అందరిలోనూ మెదిలే ప్రశ్న ఏంటంటే.. తర్వాత కెప్టెన్ ఎవరు? ఒకవేళ ఎంఎస్ ధోనీ తనంతట తానే కెప్టెన్సీ నుంచి దిగిపోయి డగౌట్లో కూర్చున్నాడనుకుందాం. అతడి స్థానాన్ని భర్తీ చేసేదెవరు? ఈ సీజన్ సీఎస్కేకు అత్యంత కీలకం. ధోనీ కన్ను ఎవరి మీద పడుతుందో చూడాలి. రుతురాజ్ గైక్వాడ్ మంచి ఆప్షన్. ఈ ఏడాది ధోనీకి డిప్యూటీగా వచ్చే వారికే వచ్చే సీజన్లో అవకాశం ఉంటుంది. అయితే, నా వరకైతే ధోనీ మరో ఐదేళ్లపాటు ఆడితే బాగుంటుంది. కనీసం రెండు లేదా మూడేళ్లయినా. ప్రస్తుతం అతడి వయసు 42 ఏళ్లు. ధోనీ ఫిట్నెస్ స్థాయి మనందరికీ తెలుసు’’ అని సీఎస్కే ఒకప్పటి సహచరుడు రైనా వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.