Team India: ఈ సారైనా చేజిక్కేనా.. టీమ్ఇండియాకు అందని ద్రాక్షగా డబ్ల్యూటీసీ టైటిల్!
ద్వైపాక్షిక సిరీస్ల్లో సత్తాచాటుతున్న టీమ్ఇండియాను.. ప్రతిష్ఠాత్మకమైన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) టైటిల్ మాత్రం ఊరిస్తూనే ఉంది.
ఇంటా, బయట టెస్టుల్లో నిలకడగా విజయాలు.. బలమైన జట్లపై ఆధిపత్యం. తిరుగులేని ఆటతీరుతో.. అద్భుతమైన ప్రదర్శనతో.. సుదీర్ఘ ఫార్మాట్లో టీమ్ఇండియా పెత్తనం చలాయిస్తోంది. తాజాగా బజ్బాల్తో భయపెట్టే పటిష్ఠమైన ఇంగ్లాండ్ను భారత జట్టు సొంతగడ్డపై అయిదు టెస్టుల సిరీస్లో 4-1తో చిత్తుచేసింది. ద్వైపాక్షిక సిరీస్ల్లో సత్తాచాటుతున్న టీమ్ఇండియాను.. ప్రతిష్ఠాత్మకమైన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) టైటిల్ మాత్రం ఊరిస్తూనే ఉంది. ఇప్పుడు మరోసారి డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకున్న రోహిత్ సేన.. వరుసగా మూడో ఫైనల్ చేరే దారిలో సాగుతోంది.
ఇంగ్లాండ్ను చిత్తుచేసి
అయిదు టెస్టుల సిరీస్లో ఇంగ్లాండ్ను 4-1 తేడాతో చిత్తుచేయడం టీమ్ఇండియాకు కలిసొచ్చింది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం చేరడమే కాదు.. మిగతా జట్లతో పోలిస్తే తుదిపోరు చేరేందుకు అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. డబ్ల్యూటీసీ 2023- 25 చక్రంలో ద్వైపాక్షిక సిరీస్లు అన్నీ ముగిసే సరికి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు.. టైటిల్ కోసం తలపడతాయి. ప్రస్తుతం ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో 9 మ్యాచ్లాడిన భారత్ 6 విజయాలు, ఓ డ్రా నమోదు చేసింది. రెండు మ్యాచ్ల్లో ఓడింది. దీంతో మొత్తం 74 పాయింట్లు, 68.51 పాయింట్ల శాతంతో ఉంది. రెండో స్థానంలో న్యూజిలాండ్ (5 మ్యాచ్ల్లో 3 విజయాలు, రెండు ఓటములతో 60 పాయింట్ల శాతం) ఉంది. మూడో స్థానంలో ఆస్ట్రేలియా (11 మ్యాచ్ల్లో 7 విజయాలు, మూడు ఓటములు, ఓ డ్రాతో 59.09 పాయింట్ల శాతం) కొనసాగుతోంది. కివీస్, ఆసీస్తో పోల్చి చూస్తే పాయింట్ల అంతరం పరంగా టీమ్ఇండియా మెరుగ్గా ఉంది.
ఆ సవాలు దాటితే
ఈ సైకిల్లో భారత్ ఇప్పటికే వెస్టిండీస్ (2 టెస్టులు), దక్షిణాఫ్రికా (2), ఇంగ్లాండ్ (5)తో సిరీస్లు ఆడింది. ఇంకా బంగ్లాదేశ్ (2), న్యూజిలాండ్ (3), ఆస్ట్రేలియా (5)తో సిరీస్లు ఆడాల్సి ఉంది. బంగ్లాదేశ్, న్యూజిలాండ్తో సిరీస్లు భారత్ సొంతగడ్డపై ఆడబోతోంది కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదనే చెప్పాలి. ఈ రెండు సిరీస్లనూ టీమ్ఇండియా క్లీన్స్వీప్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటనలోనే భారత్కు కఠిన సవాలు ఎదురయ్యే అవకాశం ఉంది. వరుసగా రెండు సార్లు ఆస్ట్రేలియాలో భారత్ టెస్టు సిరీస్లు గెలిచిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సారి ఎలాగైనా భారత్ను ఓడించాలనే కసితో ఆసీస్ ఉంది. పైగా కమిన్స్ సారథ్యంలో ఆ జట్టు పటిష్ఠంగా మారింది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా ఆసీస్ పరీక్షను దాటితే కచ్చితంగా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుతుంది. ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో జట్లు సాధించే ఒక్కో విజయానికి 12 పాయింట్లు, డ్రాకు 4 పాయింట్లు, టై అయితే 6 పాయింట్లు దక్కుతాయి. మ్యాచ్లో స్లో ఓవర్రేట్ కారణంగా పాయింట్లలో కోత కూడా ఉంటుంది. దక్షిణాఫ్రికాతో సిరీస్లో ఓ మ్యాచ్లో స్లో ఓవర్రేట్ కారణంగా భారత్కు 2 పాయింట్ల కోత పడింది.
జోరు కొనసాగిస్తే
ప్రస్తుతం భారత జట్టు బలంగా ఉంది. ఇంగ్లాండ్తో సిరీస్కు కోహ్లి, షమి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ లాంటి కీలక ఆటగాళ్లు దూరమైనా యువ క్రికెటర్లు సత్తాచాటడం శుభపరిణామం. యువ ఆటగాళ్లు జోరుమీద ఉండటం టీమ్ఇండియాకు కలిసొచ్చే అంశం. ముఖ్యంగా సంచలన ఓపెనర్ యశస్వి జైస్వాల్.. 16 ఇన్నింగ్స్ల్లో 68.53 సగటుతో 1,028 పరుగులతో ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. బౌలింగ్లో అశ్విన్ (15 ఇన్నింగ్స్ల్లో 42 వికెట్లు) భారత్ తరపున టాప్ బౌలర్గా ఉన్నాడు. బుమ్రా 6 మ్యాచ్ల్లోనే 31 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్తో సిరీస్లో రోహిత్, శుభ్మన్ కూడా రెండేసి శతకాలతో ఫామ్ చాటారు. ఈ ఆటగాళ్లు ఇదే జోరు కొనసాగిస్తే 2025 జూన్లో లార్డ్స్లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ కచ్చితంగా తలపడుతుంది. 2021, 2023 ఫైనల్లో భారత్ వరుసగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతిలో ఓడిన సంగతి తెలిసిందే. కానీ ఈ సారి మన జట్టు దూకుడు చూస్తుంటే డబ్ల్యూటీసీ టైటిల్ చేజిక్కించుకునేలా కనిపిస్తోంది.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
తాజా వార్తలు (Latest News)
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్