Dinesh Karthik: ఫినిషర్ మళ్లీ వచ్చాడు.. ఈసారి బెంగళూరును గెలిపించాడు..
ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా పంజాబ్తో జరిగిన మ్యాచ్లో దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) ఫినిషింగ్ టచ్ ఇచ్చి బెంగళూరును గెలిపించాడు.
దినేశ్ కార్తీక్ (Dinesh Karthik).. ఈ పేరు చెప్పగానే నిదహాస్ ట్రోఫీ ఫైనల్ గుర్తుకు వస్తుంది. ఎందుకంటే కెరీర్ మొత్తం అసాధారణ ఇన్నింగ్స్లు ఆడలేకపోయిన కార్తీక్.. బంగ్లాదేశ్తో ఆ ఒక్క ఫైనల్లో అభిమానులకు బాగా నచ్చేశాడు. ఈ మ్యాచ్లో కళ్లు చెదిరే బ్యాటింగ్తో టీమ్ఇండియా (Team India)ను గెలిపించి గుడ్ ఫినిషర్ అనే పేరు కూడా తెచ్చుకున్నాడు. కానీ ఆ తర్వాత కార్తీక్ మళ్లీ పెద్దగా ఆడింది లేదు. భారత్ జట్టులోనూ స్థానం కోల్పోయాడు. జెర్సీ విప్పి కోటు వేసుకుని కామెంటరీ చెప్పాడు. దీంతో కార్తీక్ పని అయిపోయిందని అతడి రెండో ఇన్నింగ్స్ మొదలైంది అనుకున్నారు. కానీ ఐపీఎల్-17లో బెంగళూరు తరఫున పంజాబ్ కింగ్స్పై అతడాడిన ఇన్నింగ్స్ మళ్లీ మునుపటి కార్తీక్ను గుర్తుకు తెచ్చింది. కార్తీక్లో ఫినిషర్ ఇంకా ఉన్నాడని నిరూపించాడు.
అప్పుడలా.. ఇప్పుడిలా
భారత్ తరఫున సుదీర్ఘ కెరీర్ కొనసాగించిన కార్తీక్.. కెరీర్ చరమాంకంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో మెరవడం విశేషమే. ఎందుకంటే వయసు మీద పడిన నేపథ్యంలో ఒకప్పటిలా సౌకర్యంగా ఆడడం డీకేకు కష్టమే. అయినా కూడా 2018లో నిదహాస్ ట్రోఫీ తుది పోరులో బంగ్లాపై 8 బంతుల్లోనే 29 పరుగులతో అజేయంగా నిలిచి ఔరా అనిపించాడు. చాన్నాళ్లు అభిమనుల మైండ్ నుంచి పోలేదు ఆ ఇన్నింగ్స్. ఆ తర్వాత కొన్నాళ్లే జాతీయ జట్టులో కొనసాగిన అతడు ఎవరూ ఊహించనట్లుగా మైక్ పట్టుకుని కామెంటరీ మొదలుపెట్టాడు. దీంతో అతడి కెరీర్ ముగిసినట్లే అనుకున్నారు. ఐపీఎల్ మళ్లీ అతడి ఆశలను నిలబెట్టింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున బరిలో దిగుతూ తానింకా ఉన్నానని చాటుకున్నాడు. ఈ ఏడాది కీపర్గా జట్టులో చోటు దక్కకపోయినా అచ్చమైన బ్యాటర్గా రెండో మ్యాచ్లోనే తన విలువ చాటుకున్నాడు. పంజాబ్తో పోరులో ఆశలు లేని స్థితి నుంచి ఆర్సీబీని గెలిపించాడు. ఒకప్పటి శైలిలో దూకుడైన షాట్లతో పంజాబ్ బౌలర్లను కంగుతినిపించాడు. 10 బంతుల్లోనే 28 పరుగులు సాధించి బెంగళూరుకు తొలి విజయాన్ని అందించాడు. ఏబీ డివిలియర్స్ మాదిరి క్రీజులో గొప్పగా కదులుతూ వికెట్ల వెనుక కొట్టిన షాట్లు అద్భుతం. నిదహాస్ ట్రోఫీ మాదిరిగానే అప్పుడూ అతడి స్కోర్లు కూడా దాదాపు సమానమే. దీంతో అభిమానులు ఆ కార్తీక్ మళ్లీ వచ్చాడంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.
ఇలాగే ఆడితే
ఈసాలా కప్ నమదే.. అని మరోసారి బరిలో దిగిన బెంగళూరుకు ఇప్పుడు కార్తీక్ లాంటి చమక్కులే కావాలి. గతంలో ఫినిషింగ్ లోపించి చాలా మ్యాచ్ల్లో చేజేతులా ఓడిన ఆర్సీబీ ఈసారి మెరుగైన ప్రదర్శన చేయాలంటే కార్తీక్ స్ఫూర్తిని మిగిలిన వాళ్లు అందిపుచ్చుకోవాలి. నిజానికి ఈసారి కార్తీక్పై ఎక్కువ ఒత్తిడి ఉంది. ఎందుకంటే అతడు స్పెషలిస్టు బ్యాటర్గానే బరిలో ఉన్నాడు. అనుజ్ రావత్ వికెట్ల వెనుక ఉండడంతో కార్తీక్కు ఇలా ఛాన్స్ వచ్చింది. అయినా కూడా ఆ అవకాశాన్ని డీకే గొప్పగా ఉపయోగించుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్తో తొలి మ్యాచ్లో అజేయంగా 38 పరుగులు చేసి జట్టు మెరుగైన స్కోరు సాధించడంలో కీలకంగా వ్యవహరించిన కార్తీక్.. రెండో మ్యాచ్లో పంజాబ్పై అదరగొట్టి మున్ముందు మ్యాచ్ల్లోనూ తనపై ఆధారపడొచ్చన సందేశాన్ని పంపాడు. పంజాబ్పై ఆరంభంలో కార్తీక్ ఆట చూస్తే అతడి లయ దెబ్బ తిన్నట్లు స్పష్టంగా కనిపించింది. కానీ కొన్ని బంతుల వ్యవధిలోనే మునుపటి కార్తీక్ను బయటకు తెచ్చాడు. రాబోయే మ్యాచ్ల్లో డీకే ఇంకెలా ఆడతాడో చూడాలి.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
భారత ఆర్చరీ బృందం అద్భుత ప్రదర్శన చేసింది. ఆర్చరీ వరల్డ్ కప్లో మూడు కేటగిరీల్లో స్వర్ణాలను గెలుచుకుంది. -
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
రోడ్డుపై పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: అమెరికా కారు ప్రమాదంలో 3 భారతీయులు దుర్మరణం
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM