Dinesh Karthik: ఫినిషర్ మళ్లీ వచ్చాడు.. ఈసారి బెంగళూరును గెలిపించాడు..
ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా పంజాబ్తో జరిగిన మ్యాచ్లో దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) ఫినిషింగ్ టచ్ ఇచ్చి బెంగళూరును గెలిపించాడు.
దినేశ్ కార్తీక్ (Dinesh Karthik).. ఈ పేరు చెప్పగానే నిదహాస్ ట్రోఫీ ఫైనల్ గుర్తుకు వస్తుంది. ఎందుకంటే కెరీర్ మొత్తం అసాధారణ ఇన్నింగ్స్లు ఆడలేకపోయిన కార్తీక్.. బంగ్లాదేశ్తో ఆ ఒక్క ఫైనల్లో అభిమానులకు బాగా నచ్చేశాడు. ఈ మ్యాచ్లో కళ్లు చెదిరే బ్యాటింగ్తో టీమ్ఇండియా (Team India)ను గెలిపించి గుడ్ ఫినిషర్ అనే పేరు కూడా తెచ్చుకున్నాడు. కానీ ఆ తర్వాత కార్తీక్ మళ్లీ పెద్దగా ఆడింది లేదు. భారత్ జట్టులోనూ స్థానం కోల్పోయాడు. జెర్సీ విప్పి కోటు వేసుకుని కామెంటరీ చెప్పాడు. దీంతో కార్తీక్ పని అయిపోయిందని అతడి రెండో ఇన్నింగ్స్ మొదలైంది అనుకున్నారు. కానీ ఐపీఎల్-17లో బెంగళూరు తరఫున పంజాబ్ కింగ్స్పై అతడాడిన ఇన్నింగ్స్ మళ్లీ మునుపటి కార్తీక్ను గుర్తుకు తెచ్చింది. కార్తీక్లో ఫినిషర్ ఇంకా ఉన్నాడని నిరూపించాడు.
అప్పుడలా.. ఇప్పుడిలా
భారత్ తరఫున సుదీర్ఘ కెరీర్ కొనసాగించిన కార్తీక్.. కెరీర్ చరమాంకంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో మెరవడం విశేషమే. ఎందుకంటే వయసు మీద పడిన నేపథ్యంలో ఒకప్పటిలా సౌకర్యంగా ఆడడం డీకేకు కష్టమే. అయినా కూడా 2018లో నిదహాస్ ట్రోఫీ తుది పోరులో బంగ్లాపై 8 బంతుల్లోనే 29 పరుగులతో అజేయంగా నిలిచి ఔరా అనిపించాడు. చాన్నాళ్లు అభిమనుల మైండ్ నుంచి పోలేదు ఆ ఇన్నింగ్స్. ఆ తర్వాత కొన్నాళ్లే జాతీయ జట్టులో కొనసాగిన అతడు ఎవరూ ఊహించనట్లుగా మైక్ పట్టుకుని కామెంటరీ మొదలుపెట్టాడు. దీంతో అతడి కెరీర్ ముగిసినట్లే అనుకున్నారు. ఐపీఎల్ మళ్లీ అతడి ఆశలను నిలబెట్టింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున బరిలో దిగుతూ తానింకా ఉన్నానని చాటుకున్నాడు. ఈ ఏడాది కీపర్గా జట్టులో చోటు దక్కకపోయినా అచ్చమైన బ్యాటర్గా రెండో మ్యాచ్లోనే తన విలువ చాటుకున్నాడు. పంజాబ్తో పోరులో ఆశలు లేని స్థితి నుంచి ఆర్సీబీని గెలిపించాడు. ఒకప్పటి శైలిలో దూకుడైన షాట్లతో పంజాబ్ బౌలర్లను కంగుతినిపించాడు. 10 బంతుల్లోనే 28 పరుగులు సాధించి బెంగళూరుకు తొలి విజయాన్ని అందించాడు. ఏబీ డివిలియర్స్ మాదిరి క్రీజులో గొప్పగా కదులుతూ వికెట్ల వెనుక కొట్టిన షాట్లు అద్భుతం. నిదహాస్ ట్రోఫీ మాదిరిగానే అప్పుడూ అతడి స్కోర్లు కూడా దాదాపు సమానమే. దీంతో అభిమానులు ఆ కార్తీక్ మళ్లీ వచ్చాడంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.
ఇలాగే ఆడితే
ఈసాలా కప్ నమదే.. అని మరోసారి బరిలో దిగిన బెంగళూరుకు ఇప్పుడు కార్తీక్ లాంటి చమక్కులే కావాలి. గతంలో ఫినిషింగ్ లోపించి చాలా మ్యాచ్ల్లో చేజేతులా ఓడిన ఆర్సీబీ ఈసారి మెరుగైన ప్రదర్శన చేయాలంటే కార్తీక్ స్ఫూర్తిని మిగిలిన వాళ్లు అందిపుచ్చుకోవాలి. నిజానికి ఈసారి కార్తీక్పై ఎక్కువ ఒత్తిడి ఉంది. ఎందుకంటే అతడు స్పెషలిస్టు బ్యాటర్గానే బరిలో ఉన్నాడు. అనుజ్ రావత్ వికెట్ల వెనుక ఉండడంతో కార్తీక్కు ఇలా ఛాన్స్ వచ్చింది. అయినా కూడా ఆ అవకాశాన్ని డీకే గొప్పగా ఉపయోగించుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్తో తొలి మ్యాచ్లో అజేయంగా 38 పరుగులు చేసి జట్టు మెరుగైన స్కోరు సాధించడంలో కీలకంగా వ్యవహరించిన కార్తీక్.. రెండో మ్యాచ్లో పంజాబ్పై అదరగొట్టి మున్ముందు మ్యాచ్ల్లోనూ తనపై ఆధారపడొచ్చన సందేశాన్ని పంపాడు. పంజాబ్పై ఆరంభంలో కార్తీక్ ఆట చూస్తే అతడి లయ దెబ్బ తిన్నట్లు స్పష్టంగా కనిపించింది. కానీ కొన్ని బంతుల వ్యవధిలోనే మునుపటి కార్తీక్ను బయటకు తెచ్చాడు. రాబోయే మ్యాచ్ల్లో డీకే ఇంకెలా ఆడతాడో చూడాలి.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
-
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం