Dinesh Karthik: ఫినిషర్ డీకే వీడ్కోలు.. కెరీర్లో అదొక్కటే లోటు!
భారత క్రికెట్లో చాలామంది క్రికెటర్లు ఉన్నారు. కానీ, ఎవరి నోటనైనా ఒక పేరు వచ్చిందంటే వెంటనే గుర్తుకురావాలి. అలాంటి జాబితాలోని క్రికెటర్ దినేశ్ కార్తిక్.
నిదహాస్ ట్రోఫీ 2018.. ఈ పేరు వినగానే ఠక్కున గుర్తుకొచ్చేది దినేశ్ కార్తిక్ (Dinesh Karthik). ఫైనల్ పోరులో బంగ్లాదేశ్పై కేవలం 8 బంతుల్లోనే 29 పరుగులతో అజేయంగా నిలిచి భారత్కు కప్ అందించాడు. అప్పటినుంచే ‘ఫినిషర్’గా అవతారం ఎత్తిన డీకే డెత్ ఓవర్లలో శివాలెత్తిపోయేవాడు. ఇప్పటికే టీమ్ఇండియాకు ఎంపిక కాని అతడు.. ఐపీఎల్కు వీడ్కోలు పలుకుతూ ‘ఫినిషర్’ పాత్రకు గుడ్బై చెప్పేశాడు.
ఈ సీజన్లోనూ..
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్తో దినేశ్ కార్తిక్ కూడా మెగా టోర్నీకి ముగింపు పలికేశాడు. ఈ సీజన్లో డీకే 15 మ్యాచుల్లో 326 పరుగులు చేశాడు. టీమ్ఇండియా తరఫున ఈసారి ప్రపంచ కప్లో చోటు దక్కించుకోవడంలో కుర్రాళ్లకు బలమైన పోటీదారుగా నిలిచిన డీకే.. వయసురీత్యా అవకాశం మాత్రం అందుకోలేకపోయాడు. ఇప్పుడు అదే కారణంతో ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. 38 ఏళ్ల కార్తిక్ ఇప్పటివరకు భారత్ తరఫున 26 టెస్టులు, 94 వన్డేలు, 60 టీ20లు ఆడాడు.
ధోనీ ప్రాభవం ముందు..
అంతర్జాతీయ క్రికెట్లోకి డీకే అడుగుపెట్టి దాదాపు 20 ఏళ్లు అయింది. అయినా, తక్కువ మ్యాచుల్లోనే చోటు దక్కడానికి కారణం ఎంఎస్ ధోనీ అని చెప్పొచ్చు. వయసురీత్యా ధోనీ కంటే డీకే నాలుగేళ్లు చిన్న. కానీ టెస్టులు, వన్డేల్లో ఎంఎస్డీ కంటే దినేశ్ కార్తిక్ ముందే జాతీయజట్టులోకి వచ్చాడు. కానీ, టీ20ల్లో ఇద్దరూ ఒకేసారి అరంగేట్రం చేశారు. ధోనీ బ్యాటింగ్, కీపింగ్ విభాగాల్లో అద్భుత నైపుణ్యం ప్రదర్శించడంతోపాటు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టడంతో జట్టులో ‘రెండో’ వికెట్ కీపర్ అవసరం లేకుండా పోయింది.
ధోనీ గైర్హాజరీలో డీకేకు అవకాశాలు దక్కేవి. ధోనీ కెరీర్, ఫేమ్ పీక్ స్టేజ్కు వెళ్లడంతో డీకే ఎక్కువగా ఐపీఎల్లోనే ఆడాల్సివచ్చింది. జాతీయ జట్టు తరఫున వచ్చిన అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోవడంలో కార్తిక్ సఫలీకృతం కాలేదు. కొన్నిసార్లు మాత్రమే జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్లు ఆడాడు. టీ20 ప్రపంచకప్ 2022లో కీలకంగా మారతాడని భావించినా.. ఘోరంగా విఫలమై అభిమానులను నిరాశపరిచాడు.
అదొక్కటే బాధ..
ఐపీఎల్లో ఆరు జట్లకు ప్రాతినిధ్యం వహించిన దినేశ్ కార్తిక్ 257 మ్యాచులు ఆడి 4,842 పరుగులు సాధించాడు. పంజాబ్, ముంబయి, ఆర్సీబీ, గుజరాత్ లయన్స్, కోల్కతా, దిల్లీ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. తన సొంత రాష్ట్రానికి చెందిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున మ్యాచ్ ఆడలేకపోవడం బాధపెట్టే అంశమని గతంలో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించాడు. సీఎస్కే యాజమాన్యం వేలంలో తీసుకోవాలని చూసినా.. అప్పుడు అందుబాటులో లేకుండా పోయినట్లు గుర్తు చేసుకున్నాడు. ప్రతీ సీజన్లోనూ మెరుగైన ప్రదర్శన చేస్తూ వచ్చిన డీకే ఈసారి మాత్రం ప్రదర్శనను పతాకస్థాయికి తీసుకెళ్లాడు. తన జట్టు ఫైనల్కు చేరుకోవడంలో విఫలం కావడంతో నిరాశగా వీడ్కోలు పలికేశాడు.
మైదానంలో లేకపోయినా..
దినేశ్ కార్తిక్ను ఆటగాడిగా కాకుండా వ్యాఖ్యాతగా ఇప్పటికే అప్పుడప్పుడూ చూస్తూనే ఉన్నాం. ఐపీఎల్ మినహా.. భారత జట్టు ఆడే మ్యాచులకు కామెంట్రీ చేస్తున్నాడు. ఇకనుంచి మెగా లీగ్లోనూ అతడి మాటను వినే అవకాశం ఉంది. అయితే, దీనికోసం వచ్చే సీజన్ వరకా? లేకపోతే క్వాలిఫయర్ 2 నుంచే అతడు కామెంట్రీ బాధ్యతలు తీసుకుంటాడా? అనేది తెలియడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మొదట ఆ ఐదుగురిని తప్పించండి! సీనియర్ ఆటగాళ్లపై తీవ్రంగా మండిపడ్డ పాక్ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ 2024లో పాకిస్థాన్ లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టనుంది. దీంతో పాక్ జట్టుపై సొంత దేశం ఆటగాళ్ల నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
‘కోహ్లీ అలా చేస్తే రిషభ్ పంత్ సంతోషిస్తాడు’
టీ20 ప్రపంచ కప్ 2024లో ఓపెనర్గా దిగి విఫలమవుతున్న విరాట్ కోహ్లీ తిరిగి మూడో స్థానంలో ఆడి పరుగులు రాబడితే రిషభ్ పంత్ సంతోషిస్తాడని భారత మాజీ పేసర్ శ్రీశాంత్ పేర్కొన్నాడు. -
ఒక్క పరుగుతో ఓటమి.. నేపాల్ ఆశలను కూల్చేసిన సఫారీలు
T20 Worldcup 2024: టీ20 ప్రపంచకప్ నుంచి నేపాల్ నిష్క్రమించింది. నరాలు తెగే ఉత్కంఠ పోరులో కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఆ జట్టు ఓటమిపాలైంది. -
కోహ్లి జోరు అందుకునేనా..
ఐర్లాండ్ను చిత్తుచేసి.. పాకిస్థాన్ ముప్పును దాటి.. అమెరికాపై ఆధిపత్యంతో టీ20 ప్రపంచకప్లో సూపర్-8 చేరిన టీమ్ఇండియా.. మరో మ్యాచ్కు సిద్ధమైంది. తన చివరి గ్రూప్ మ్యాచ్లో శనివారం కెనడాతో తలపడనుంది. -
పాకిస్థాన్, న్యూజిలాండ్ ఔట్
ఆరంభం నుంచి సంచలనాలకు వేదికగా మారిన 2024 టీ20 ప్రపంచకప్లో 24 గంటల వ్యవధిలో రెండు పెద్ద జట్లకు పెద్ద షాక్ తగిలింది. పాకిస్థాన్, న్యూజిలాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. -
అఫ్గాన్ అదరహో..
ఐసీసీ టోర్నీల్లో స్థిరంగా రాణిస్తూ నాకౌట్ చేరే రికార్డున్న న్యూజిలాండ్కు షాక్. టీ20 ప్రపంచకప్లో ఆ జట్టు తొలి రౌండ్ కూడా దాటకుండానే ఇంటిముఖం పట్టింది. -
ఇంగ్లాండ్ చేతిలో ఒమన్ చిత్తు
టీ20 ప్రపంచకప్లో ఇంగ్లాండ్ ఎట్టకేలకు గెలుపు రుచిచూసింది. గ్రూపు-బి పోరులో ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో ఒమన్ను చిత్తుచేసింది. -
మ్యాచ్ పూర్తవగానే సాఫ్ట్వేర్ పని..
భారత సంతతికి చెందిన సౌరభ్ నేత్రావల్కర్ ఇప్పుడు అమెరికా జట్టులో ప్రధాన పేసర్. పాకిస్థాన్పై సూపర్ ఓవర్లో యుఎస్ సంచలన విజయం సాధించడంలో అతనే కీలకం. -
ప్రణయ్ పరాజయం
ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో భారత ఆటగాళ్లు హెచ్.ఎస్.ప్రణయ్, సమీర్వర్మల పోరాటం ముగిసింది. -
సెమీస్లో నగాల్
భారత స్టార్ ఆటగాడు సుమిత్ నగాల్ పెరుగియా టెన్నిస్ ఛాలెంజర్ టోర్నీలో సెమీఫైనల్కు దూసుకెళ్లాడు. -
మేం అలా ఎప్పటికీ చేయం
టీ20 ప్రపంచకప్ నుంచి ఇంగ్లాండ్ను బయటకు పంపేలా తాము నెట్రన్రేట్ను తారుమారు చేయాలనుకుంటే క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని ఆస్ట్రేలియా పేసర్ కమిన్స్ అభిప్రాయపడ్డాడు. -
సూపర్-8కు అమెరికా.. వర్షంతో పాకిస్థాన్ ఆశలు గల్లంతు
ఇంకో మ్యాచ్ మిగిలిఉండగానే టీ20 ప్రపంచకప్ సూపర్-8 రేసు నుంచి పాకిస్థాన్ నిష్క్రమించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పుణె కారు ప్రమాదం.. మైనర్కు బెయిల్ మంజూరులో లోపాలు!
-
తెలంగాణ వైద్యారోగ్యశాఖలో వివిధ పోస్టుల భర్తీకి నిర్ణయం
-
మొదట ఆ ఐదుగురిని తప్పించండి! సీనియర్ ఆటగాళ్లపై తీవ్రంగా మండిపడ్డ పాక్ క్రికెటర్
-
స్టైలిష్ తాప్సీ.. హాట్ దక్ష.. క్యూట్ అదితి
-
వాణిజ్య రహస్యాలు బయటపెట్టారని ఆరోపణ ... టీసీఎస్కు ₹1,600 కోట్లు జరిమానా
-
కళ్లల్లో కారం కొట్టి.. కర్రలతో దాడి చేసి.. ప్రొఫెసర్పై విద్యార్థుల దుశ్చర్య