Team India: ఇప్పుడు కెప్టెన్ ఎవరో తెలుసు.. ఐపీఎల్ ఊసే ఇక్కడ ఉండదు: మాజీలు
రెండోసారి టైటిల్ను నెగ్గాలనే లక్ష్యంతో టీమ్ఇండియా టీ20 ప్రపంచ కప్ బరిలోకి దిగింది. జూన్ 5న తొలి మ్యాచ్లో ఆడనుంది.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) సంగ్రామం మొదలైంది. భారత్ తన తొలి మ్యాచ్ను ఐర్లాండ్తో జూన్ 5న తలపడనుంది. తాజాగా బంగ్లాదేశ్తో జరిగిన వార్మప్ మ్యాచ్లో టీమ్ఇండియా (Team India) ఘన విజయం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య మధ్య సుహృద్భావ వాతావరణం ఉంది. ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్లో చోటు చేసుకున్న పరిస్థితులు ఇక్కడ కనిపించలేదని మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, మ్యాథ్యూ హేడెన్ వెల్లడించారు. ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇలాంటి విషయంలో స్ట్రిక్ట్గా ఉంటాడని.. జాతీయ జట్టు కోసం ఆడేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోరాడేలా ఉద్భోద చేసి ఉండొచ్చని వారు అభిప్రాయపడ్డారు. అసలు ఐపీఎల్ ఊసే వారి మధ్య చర్చకు వచ్చి ఉండదని స్పష్టం చేశారు.
వరల్డ్ కప్పైనే దృష్టంతా..: ఇర్ఫాన్
‘‘నాకు తెలిసి ఒక్కసారి కూడా ఐపీఎల్లో ఏం జరిగిందనే చర్చ ఆటగాళ్ల మధ్య వచ్చి ఉండదు. ఒక్కరు కూడా మాట్లాడి ఉండరు. కోచ్ రాహుల్ ద్రవిడ్ ఫోకస్ అంతా ప్రపంచ కప్పైనే. అది హార్దిక్ అయినా ఇతర ఆటగాడు ఎవరైనా సరే పొట్టికప్ గెలవడంపైనే ఉండాలి. మా దగ్గర సెలబ్రిటీ కల్చర్ బాగా పెరిగిపోయింది. కొన్నిసార్లు ఇదే చేటు చేస్తుందేమోనని ఆందోళన ఉంది. ఆస్ట్రేలియన్లతో పోలిస్తే మా భావోద్వేగాలు, నిబద్ధత, మైండ్సెట్ అంతా విభిన్నం’’ అని పఠాన్ వ్యాఖ్యానించాడు.
ఇక్కడ లీడర్ అతడే: హేడెన్
‘‘వరల్డ్ కప్ కోసం భారత జట్టు ఇక్కడికి వచ్చింది. టీమ్కు నాయకుడు ఎవరు అనేది అందరికీ తెలుసు. ఇక దానిపై మాట్లాడాల్సిన అవసరమే లేదు. కెప్టెన్ రోహిత్ నాయకత్వంలో భారత్ బరిలోకి దిగింది. మరొకరు (పాండ్య) వైస్ కెప్టెన్గా ఉన్నాడు. వీరిద్దరూ జట్టును ముందుండి నడిపించాలి. ఐపీఎల్ విషయం గురించి చర్చ అనేది జరగదని ఇర్ఫాన్ చెప్పిన మాటలు నచ్చాయి. అసలు వాటి గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు’’ అని హేడెన్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం