RCBW vs MIW: బెంగళూరు తడబాటు.. ముంబయి లక్ష్యం 132

టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబి 20 ఓవర్లకు 131 పరుగులు చేసింది. 

Updated : 02 Mar 2024 21:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: WPL 2024లో ముంబయితో మ్యాచ్‌లో బెంగళూరు బ్యాటింగ్‌ ముగిసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీని ముంబయి తక్కువ పరుగులకే కట్టడి చేసింది. 14 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయిన బెంగళూరు ఏ దశలోనూ భారీ స్కోరు దిశగా సాగలేదు. వరుసగా వికెట్లు పడుతుండగా ఎలిస్‌ పేర్రి 44* పరుగులు చేసి జట్టుకు గౌరవ ప్రదమైన స్కోరును అందించింది. జార్జియా వేర్‌హామ్ 27 పరుగులతో ఫర్వాలేదనిపించింది. నాట్ స్కివర్, పూజా వస్త్రాకర్ చెరో రెండు.. ఇస్సీ వాంగ్,  సైకా ఇషాక్ ఒక్కో వికెట్‌ తీశారు. మరి 132 పరుగుల లక్ష్యఛేదనలో ముంబయి ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని