IND vs ENG: మా జట్టులో అతడే అశ్విన్.. తొలి సిరీస్ అనే ఒత్తిడే లేదు: ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్
బజ్బాల్ క్రికెట్తో ప్రత్యర్థులను ఆటాడుకుందామని భావించిన ఇంగ్లాండ్కు భారత పర్యటనలో (IND vs ENG) చుక్కెదురైంది. కానీ, ఓ బౌలర్ను అరంగేట్రం చేయించడం మాత్రం తమ జట్టుకు కలిసొస్తుందని మాజీ కెప్టెన్ వ్యాఖ్యానించాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్ - ఇంగ్లాండ్ జట్ల (IND vs ENG) మధ్య నాలుగు టెస్టులు ముగిశాయి. ఇప్పటికే భారత్ 3-1 ఆధిక్యంతో సిరీస్ను కైవసం చేసుకుంది. ఆఖరి మ్యాచ్ ధర్మశాల వేదికగా మార్చి 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్లోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన షోయబ్ బషీర్ కేవలం రెండు మ్యాచుల్లోనే 12 వికెట్లు తీసి అబ్బురపరిచాడు. తొలిసారి భారీ జట్టుపై ఆడుతున్నామనే ఒత్తిడే అతడిలో కనిపించలేదు. ఈ క్రమంలో బషీర్ను ఉద్దేశించి ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తదుపరి రవిచంద్రన్ అశ్విన్గా బషీర్ను అభివర్ణించాడు.
‘‘ఇంగ్లాండ్ జట్టు ఇటీవల వరుసగా ఓటములను చవిచూసింది. కానీ, ఆటగాళ్ల ప్రదర్శనపరంగా అద్భుతంగానే ఉంది. ఈ మెగా సిరీస్లో ఇంగ్లాండ్ తరఫున ప్రపంచస్థాయి స్పిన్నర్ వెలుగులోకి వచ్చాడు. అతడే షోయబ్ బషీర్. అందుకే, మనం సంబరాలు చేసుకోవాలని చెబుతున్నా. కేవలం తన రెండో మ్యాచ్లోనే 8 వికెట్లు తీశాడు. అతడు రవిచంద్రన్ అశ్విన్ కొత్త వెర్షన్. మా సెలక్టర్లు బషీర్ను తీసుకురావడం అభినందనీయం. ఇంగ్లిష్ క్రికెట్కు తప్పకుండా మంచి జరుగుతుంది.
ధర్మశాలలో మా జట్టు విజయం సాధిస్తుందని భావిస్తున్నా. ఐదు టెస్టుల సిరీస్లో మెరుగైన జట్టుతోనే బరిలోకి దిగాం. యాషెస్ సిరీస్తో పోలిస్తే ఇక్కడే అత్యుత్తమ టీమ్ ఆడుతోంది. ఒక్కో సెషన్ ఆడుతూ వెళ్తే ఫలితం అనుకూలంగా రాబట్టే అవకాశం ఉంది. ఈ సిరీస్ను మేం గెలుచుకోలేం.. కనీసం చివరి మ్యాచ్నైనా విజయంతో ముగిస్తాం’’ అని మైకెల్ వాన్ వెల్లడించాడు.
రజత్కు మద్దతు ఇవ్వాలి: ఏబీడీ
ఇంగ్లాండ్తో సిరీస్లో టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన భారత ఆటగాడు రజత్ పటీదార్ ప్రదర్శనలో మాత్రం వెనకబడ్డాడు. అయినా, అతడిని ఐదో టెస్టు కోసం జట్టులోనే కొనసాగిస్తున్నారు. ఇలా చేయడానికి కారణాలను దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ తెలిపాడు. ‘‘రజత్ పటీదార్కు జీవితాంతం గుర్తుండిపోయే సిరీస్ ఇది కాదు. అయితే, జట్టుగా భారత్ విజయాలను నమోదు చేసింది. అయితే, రజత్ యాటిట్యూడ్, డ్రెస్సింగ్ రూమ్లో అతడి ప్రవర్తన నచ్చడంతో మేనేజ్మెంట్ నమ్మకం ఉంచే అవకాశం ఉంది. అతడు ఎక్కువగా పరుగులు చేయకపోయినా జట్టుతోపాటు కొనసాగే ఆస్కారముంది. అతడికి అవకాశాలు ఇస్తూనే ఉండాలి. లేకపోతే ఆత్మవిశ్వాసం దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు’’ అని ఏబీడీ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
166.. 58 బంతుల్లో ఉఫ్
47 నిమిషాలు.. 58 బంతులు.. 167 పరుగులు.. 0 వికెట్లు! బుధవారం ఉప్పల్ స్టేడియంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో సన్రైజర్స్ బ్యాటింగ్ విధ్వంసమిది. ఇన్నింగ్స్ విరామంలో అభిమానులు స్నాక్స్ తెచ్చుకునేలోపే.. టీవీ సెట్ల ముందున్న ప్రేక్షకులు కాస్త బ్రేక్ తీసుకునేలోపే సన్రైజర్స్ లక్ష్య ఛేదన పూర్తయింది. -
ముంబయి తప్ప..
ఐపీఎల్-17 లీగ్ దశలో ఇంకా 13 మ్యాచ్లే మిగిలాయి. కానీ ఇప్పటికీ ఏ జట్టూ అధికారికంగా ప్లేఆఫ్స్ చేరలేదు. లఖ్నవూపై సన్రైజర్స్ విజయంతో ముంబయి అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. -
సంగీతం వింటూ.. సిరీస్లు చూస్తూ
ఒలింపిక్స్ పతకం నెగ్గాలన్నది ప్రతి అథ్లెట్ కల. అందుకోసం ఒక్కో అథ్లెట్ ఒక్కోలా సాగుతారు. తీవ్రమైన సాధన చేస్తూనే మెదడును ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం ఇతర వ్యాపకాల్లోనూ మునిగిపోతారు. -
మూడేళ్లలో తొలిసారి..
ఒలింపిక్, ప్రపంచ ఛాంపియన్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మూడేళ్లలో తొలిసారి స్వదేశంలో పోటీపడనున్నాడు. భువనేశ్వర్లో ఈ నెల 12 నుంచి 15 వరకు జరిగే జాతీయ ఫెడరేషన్ కప్లో అతడు ఆడనున్నాడు. -
ఓడలో ఫ్రాన్స్కు ఒలింపిక్ జ్యోతి
1896లో తొలిసారి ఉపయోగించిన మూడు వరుసల తెరచాపలతో కూడిన పురాతన ఓడ.. మధ్యధరా సముద్రంలో 12 రోజుల పాటు ప్రయాణం.. చివరగా గమ్యాన్ని చేరుకుని ఫ్రాన్స్లో ఒలింపిక్ జ్యోతి వెలుగులు నింపింది. -
నా రికార్డులను జైస్వాల్ బద్దలు కొడతాడు
టీమ్ఇండియా యువ ఓపెనర్, ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహించే యశస్వి జైస్వాల్కు గొప్ప భవిష్యత్తు ఉందని వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ బ్రయాన్ లారా కొనియాడాడు. -
శాంసన్.. మాస్టర్ బ్లాస్టర్!
ఈ ఐపీఎల్లో భీకర ఫామ్తో సాగిపోతున్న రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్పై ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతణ్ని మాస్టర్బ్లాస్టర్గా అభివర్ణించాడు. -
అమన్పై ఆశలు
ప్రపంచ రెజ్లింగ్ క్వాలిఫయర్స్ గురువారం ఆరంభం కానున్నాయి. పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల కోసం ఇదే చివరి అర్హత ఈవెంట్. భారత ఫ్రీస్టైల్ రెజ్లర్లలో అమన్ శెరావత్, దీపక్ పునియాలపై పెద్ద ఆశలే ఉన్నాయి. -
ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
సొంత గడ్డపై హైదరాబాద్ ఎప్పటికీ మరిచిపోలేని అద్భుతమైన విజయాన్ని అందుకుంది. లఖ్నవూను 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి ప్లే ఆఫ్స్కు మరింత చేరువైంది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ పలు రికార్డులు నమోదు చేసింది. -
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్
ఒకే ఒక్క క్యాచ్ రాజస్థాన్ను ఓటమి వైపు నడిపించగా.. గెలుస్తామనే ఆశలు లేని సమయంలో దిల్లీకి ఊపిరి పోసింది. దీంతో ఆ జట్టు విజయం సాధించి ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది. -
నా ‘400’ రికార్డును కొట్టే సత్తా ఈ భారత కుర్రాడి సొంతం: బ్రియాన్ లారా
టీమ్ఇండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్పై బ్రియాన్ లారా అభినందనల వర్షం కురిపించాడు. భవిష్యత్తులో ఎన్నో రికార్డులను కొల్లగొడతాడని పేర్కొన్నాడు.