Esha Singh: ఈ టీనేజర్.. దూసుకెళ్లే ఓ బుల్లెట్.. షూటింగ్ సంచలనం ఇషా సింగ్
పద్దెనిమిది ఏళ్లకే ఆసియా గేమ్స్కు దూసుకెళ్లిన ఇషా సింగ్ (Esha Singh).. హైదరాబాదీ షూటర్ కావడం విశేషం. సరదాగా ప్రారంభించిన క్రీడలోనే ఛాంపియన్గా ఆసియా క్రీడల్లో పాల్గొనే స్థాయికి చేరుకొంది.
ఆగిపోవడం.. అలసిపోవడం.. ఆ అమ్మాయికి తెలీదు. నిరాశతో కుంగిపోవడం.. ఓటమి బాధలో మునిగిపోవడం ఆమెకు అలవాటు లేదు. తుపాకీ చేతపట్టగానే.. ఆమెకు కనిపించేది లక్ష్యమే. వినిపించేది తాను పేల్చే తూటాల శబ్దమే. గమ్యాన్ని చేరే ఆ గురితో కరతాళ ధ్వనులు.. చివరగా మెడలో వాలే పతకాలు. ఇలా పిస్టల్తో టీనేజీలోనే సంచలనాలు సృష్టించడం ఆమెకు తుపాకీతో పెట్టిన విద్య. ఆమెనే.. ఇషా సింగ్ (Esha Singh). ఇటీవల షూటింగ్ ప్రపంచ ఛాంపియన్షిప్స్లో మిక్స్డ్, టీమ్ స్వర్ణాలతో చరిత్ర సృష్టించిన ఈ హైదరాబాదీ 18 ఏళ్ల టీనేజర్ ఇక ఒలింపిక్స్ పతకంపై కన్నేసింది. ముందుగా ఈ ఏడాది ఆసియా క్రీడల్లో సత్తాచాటడమే తన లక్ష్యమంటోంది.
సరదాగా మొదలై..
షూటింగ్లో ఇషా ప్రయాణం అనుకోకుండానే మొదలైంది. చిన్నతనంలో ఆమె గో కార్టింగ్, బ్యాడ్మింటన్, టెన్నిస్, స్కేటింగ్లోనూ ఓ చేయి వేసింది. ఒకసారి గచ్చిబౌలి స్టేడియం వెళ్లినప్పుడు అక్కడి షూటింగ్ రేంజ్లో తుపాకీ పేల్చిన చప్పుడు ఆమెను ఆకర్షించింది. అప్పుడే తుపాకీతో ప్రేమలో పడింది. ఒకసారి వాళ్ల నాన్న స్నేహితుడు ఒకాయన తన చేతికి తుపాకీ ఇచ్చి.. లక్ష్యానికి గురిపెట్టమని చెప్పడంతో ఇషా షూటింగ్ కెరీర్కు అడుగు పడింది. తొమ్మిదేళ్ల వయసులో శిక్షణ మొదలెట్టిన ఆమె.. ఒలింపిక్ కాంస్య విజేత గగన్ నారంగ్ దగ్గర మెళకువలు ఒంటబట్టించుకుంది. 2018లో 13 ఏళ్లకే 10మీ. ఎయిర్ పిస్టల్ జాతీయ ఛాంపియన్గా నిలిచి.. ఆ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్సు షూటర్గా రికార్డు నమోదు చేసింది. యూత్, జూనియర్ విభాగాల్లోనూ స్వర్ణాలు సాధించింది. 2019 జూనియర్ ప్రపంచకప్లో రజతం గెలిచింది.
నమ్మకంతో ముందుకు
2019లో కొన్ని టోర్నీల్లో ఇషా రాణించలేకపోయింది. కానీ ఏ మాత్రం నిరాశకు లోను కాకుండా... ఓటములే ఉత్తమ పాఠాలు నేర్పుతాయని ముందుకు సాగుతోంది. కరోనా సమయంలోనూ ఇంట్లోనే షూటింగ్ రేంజ్ ఏర్పాటు చేసుకుని ప్రాక్టీస్ కొనసాగించింది. ఓటమి ఎదురైందని ఆగిపోతే.. సమస్యలను చూసి బెదిరిపోతే.. ఛాంపియన్గా నిలవలేమని నమ్మింది. తిరిగి పతకాల వేటలో సాగింది. 2022 జూనియర్ షూటింగ్ ప్రపంచ ఛాంపియన్షిప్స్లో 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత స్వర్ణంతో చరిత్ర సృష్టించింది. ఈ విభాగంలో ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన మొట్టమొదటి భారత షూటర్ ఆమెనే. అదే పోటీల్లో 10మీ. పిస్టల్ టీమ్, మిక్స్డ్ విభాగాల్లోనూ బంగారు పతకాలు సొంతం చేసుకుంది. ఇప్పుడు సీనియర్ ప్రపంచ ఛాంపియన్షిప్స్లోనూ 25మీ. టీమ్, 10మీ. మిక్స్డ్ టీమ్ స్వర్ణాలతో రికార్డులు తిరగరాసింది. 2020లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఇషా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం అందుకుంది.
నాన్నే స్ఫూర్తి..
షూటింగ్లో ఇంత దూరం రావడానికి ఇషాకు నాన్న సచిన్ సింగ్ స్ఫూర్తి. ఆయన ఒకప్పుడు కార్టింగ్, ర్యాలీ రేసర్. ఎల్లప్పుడూ ఇషా వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తాడు. అమ్మ శ్రీలత కూడా ఇషాకు అండగా నిలుస్తోంది. పరాజయాలు పలకరించినా కుంగిపోకుండా ఉండాలని, ఆటలో గెలుపోటములు సహజమని ఆమెకు చెబుతోంది. ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీల్లో ఇషా ప్రదర్శన మెచ్చి తెలంగాణ ప్రభుత్వం రూ.2 కోట్లు నగదు ప్రోత్సాహకంగా అందించింది. టోక్యో ఒలింపిక్స్ కోర్ టీమ్కు ఎంపికైనప్పటికీ టాప్-2లో చోటు దక్కకపోవడంతో ఆమె ఆ క్రీడల్లో పాల్గొనలేకపోయింది. కానీ వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్కు మాత్రం అర్హత సాధించడమే కాదు.. పతకం కూడా గెలుస్తానని ఆత్మవిశ్వాసంతో చెబుతోంది. అంతకంటే ముందు వచ్చే నెలలో చైనాలో ఆరంభమయ్యే ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించడమే లక్ష్యంగా సాగుతోంది. ఖాళీగా ఉన్నప్పుడు రెస్టారెంట్లకు వెళ్లి భోజనం ఆస్వాదించడం, సినిమాలు చూడడం ఇషాకు ఇష్టం. అల్లుఅర్జున్కు ఆమె అభిమాని. ఇంకా బొమ్మలు గీయడాన్ని కూడా ఎంతో ప్రేమిస్తోంది. షూటింగ్ కాకుండా ఆమెకిష్టమైన వ్యాపకం అదే. సాహస క్రీడలపైనా ఆసక్తితో ఉన్న ఇషాకు.. గో కార్టింగ్లో తండ్రితో పోటీపడాలన్నది ఆశ.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
తాజా వార్తలు (Latest News)
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన