IPL 2024: ధోనీ కొన్ని తప్పులు చేశాడేమో కానీ.. రోహిత్ ఎప్పుడూ చేయలేదు : పార్థివ్ పటేల్
కెప్టెన్సీలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. ఐపీఎల్ చరిత్రలో (IPL) ఇద్దరు మాత్రమే ఐదేసి సార్లు తమ జట్టును ఛాంపియన్గా నిలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ అభిమానులను అలరించేందుకు మరో రెండు రోజుల్లో ఐపీఎల్ 17వ (IPL 2024) సీజన్ సమరం ఆరంభం కానుంది. ఇప్పుడు అందరి దృష్టి చెన్నై సారథి ఎంఎస్ ధోనీ, ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా కాకుండా బ్యాటర్గా ఆడుతున్న రోహిత్ శర్మపైనే ఉంది. వీరిద్దరూ ఆయా జట్లకు అత్యధికంగా ఐదు సార్లు ట్రోఫీలనందించి అత్యుత్తమ సారథులుగా నిలిచారు. వీరి నాయకత్వ లక్షణాలను పోల్చుతూ మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ముంబయిని నడిపించిన రోహిత్ శర్మ ఎప్పుడూ తప్పిదాలు చేయలేదని.. చెన్నై సారథి మహీ మాత్రం కొన్ని సందర్భాల్లో పొరపాట్లు చేశాడని పార్థివ్ వ్యాఖ్యానించాడు. ‘‘జట్టు సభ్యుల విషయానికొస్తే రోహిత్ ఎంతో మద్దతుగా ఉంటాడు. హార్దిక్ పాండ్య, బుమ్రా ముంబయి జట్టులోకి వచ్చిన కొత్తలో పెద్దగా రాణించలేదు. వారిని పక్కనపెట్టాలని జట్టు యాజమాన్యం భావించినా.. వారికి రోహిత్ మద్దతుగా నిలిచాడు. వారి ఆటపై నమ్మకం ఉంచి ప్రోత్సహించాడు. దీంతో వీరిద్దరూ ఆ తర్వాత పుంజుకుని అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి జట్టు విజయాల్లో భాగమయ్యారు.
మైదానంలో ఎంతో ప్రశాంతంగా ఉంటూ రోహిత్ జట్టును నడిపించిన తీరు ఇతరులతో పోల్చలేనిది. దీనికి ఉత్తమ ఉదాహరణ ముంబయి రెండుసార్లు ఐపీఎల్ టైటిల్ను ఒక్క పరుగు తేడాతోనే గెల్చుకుంది. మైదానంలో ప్రశాంతంగా ఉండగలిగే కెప్టెన్ లేకపోతే ఇది సాధ్యం కాదు. ఉత్కంఠభరితంగా సాగే మ్యాచ్ల్లో కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు, పొరపాట్లు జరుగుతుంటాయి. రోహిత్ శర్మ కెప్టెన్సీలోని ముఖ్యమైన లక్షణం ఏంటంటే.. గత పదేళ్లలో అతడు చేసిన తప్పు మీకు గుర్తుకురాదు. ధోనీ కూడా కొన్నిసార్లు పొరపాట్లు చేశాడు. కీలక సమయంలో పవన్ నేగికి ఓవర్ ఇవ్వడం లాంటివి చేశాడు. కానీ.. రోహిత్ అలాంటి బ్లండర్లు చేయలేదు. అయితే, ధోనీ సూచనలు ఇస్తూ ఆటగాళ్లకు మ్యాచ్ను తేలిగ్గా మారుస్తుంటాడు’’ అని పార్థివ్ తెలిపాడు.
రోహిత్.. పరిస్థితికనుగుణంగా నిర్ణయిస్తుంటాడు: జహీర్
‘‘ప్రతీ మ్యాచ్ కోసం కొన్ని ప్రణాళికలతో బరిలోకి దిగుతుంటాం. కానీ, మధ్యలో ఏం జరుగుతుందో తెలియదు. మనం అనుకున్న ఫలితాలు రాకపోవచ్చు. అలాంటప్పుడు అప్పటికప్పుడు ప్రణాళికలు మారుస్తూ ఉండాలి. రోహిత్ శర్మ పరిస్థితికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాడు. మ్యాచ్ను గుప్పిట్లో ఉంచుకోవడానికి చివరివరకూ ప్రయత్నిస్తాడు. అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కెప్టెన్కు కఠినమైన సవాల్. ఇలా ముంబయి జట్టు కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాడు’’ అని భారత మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్