RCB: ఇకపై ప్రతీ మ్యాచ్ మాకు సెమీఫైనల్ లాంటిది: ఆర్సీబీ హెడ్ కోచ్
ఇకపై తాము ఆడే ప్రతీ మ్యాచ్ సెమీఫైనల్ లాంటిదేనని ఆర్సీబీ (RCB) హెడ్ కోచ్ ఆండ్లీ ప్లవర్ అన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్లో ఆర్సీబీ (RCB) ఓటముల పరంపర కొనసాగుతోంది. సోమవారం హైదరాబాద్తో జరిగిన భారీ స్కోర్ల మ్యాచ్లో 25 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. బెంగళూరుకు ఇది వరుసగా ఐదో పరాజయం. ఇప్పటివరకు ఏడు మ్యాచ్లు ఆడి ఒకే విజయం సాధించిన ఆ జట్టు.. ప్లే ఆఫ్స్కు రావాలంటే మిగిలిన ఏడు మ్యాచ్ల్లోనూ గెలవాల్సిన పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా జరగడం కష్టమే అని చెప్పొచ్చు. కానీ, టీ20 మ్యాచ్ల్లో ఎప్పుడూ, ఏదైనా జరగొచ్చు. ఈనేపథ్యంలో హైదరాబాద్తో మ్యాచ్లో ఓటమి అనంతరం ఆర్సీబీ హెడ్ కోచ్ ఆండీ ప్లవర్ (Andy Flower) మాట్లాడాడు.
‘‘ఇది స్పష్టంగా మాకు నాకౌట్ స్టేజ్. ప్రతీ మ్యాచ్ ఇప్పుడు మాకు సెమీఫైనల్ లాంటిది. కానీ, ఇప్పుడు మేం బలంగా తిరిగి రావడంపై దృష్టిపెట్టాం. హైదరాబాద్తో జరిగిన మ్యాచ్ మాకు నిజంగా చాలా కఠినమైనది. వారు గొప్పగా ఆడి భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. బహుశా అదే మా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. మిడిలార్డర్లో మా జట్టు బ్యాట్తో పోరాడినందుకు నేను నిజంగా గర్వపడుతున్నాను. మేం మ్యాచ్లో ఓడిపోయాం. కానీ, మా జట్టు పోరాడిన తీరు నిజంగా గర్వంగా ఉంది’’ అని ఆండీ ప్లవర్ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోల్కతా కుమ్మేసింది
కోల్కతా అదరగొట్టింది. ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ దిల్లీ క్యాపిటల్స్ను చిత్తుగా ఓడించింది. వరుణ్, అరోరా, హర్షిత్ సూపర్ బౌలింగ్తో దిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన నైట్రైడర్స్.. సాల్ట్ జోరుతో స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. -
ఎవరా 15..!
టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్నా భారత జట్టుపై ఇంకా స్పష్టత లేదు. చాలా స్థానాలకు ఆటగాళ్ల మధ్య పోటీ ఉండడంతో ఎన్నో ఊహాగానాలు. ఈ అనిశ్చితికి తెరపడడానికి ఎంతో సమయం లేదు. -
క్వార్టర్స్లో భారత్
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇప్పటికే భారత అమ్మాయిలు క్వార్టర్స్ఫైనల్స్లో ప్రవేశించగా.. తాజాగా థామస్ కప్లో పురుషుల జట్టు కూడా తుది ఎనిమిదిలో చోటు దక్కించుకుంది. -
పారిస్కు ఏడుగురు షట్లర్లు
పారిస్ ఒలింపిక్స్లో భారత్ నుంచి ఏడుగురు షట్లర్లు పోటీపడబోతున్నారు. ఒలింపిక్ క్రీడల అర్హత ర్యాంకింగ్ ప్రకారం పి.వి.సింధు (మహిళల సింగిల్స్), హెచ్ఎస్.ప్రణయ్, లక్ష్యసేన్ (పురుషుల సింగిల్స్), సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి (పురుషుల డబుల్స్), అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో (మహిళల డబుల్స్) ఈ మెగా ఈవెంట్ బరిలో నిలిచారు. -
జ్యోతి @ 2
ఆర్చరీ ప్రపంచకప్లో మూడు పసిడి పతకాలతో సత్తా చాటిన తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ.. కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. -
టీ20 ప్రపంచకప్కు కివీస్ జట్టిదే
కేన్ విలియమ్సన్ నాలుగోసారి టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్కు నాయకత్వం వహించనున్నాడు. వేలి గాయం నుంచి కోలుకుంటున్న ఓపెనర్ డెవోన్ కాన్వేకు కూడా 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కింది. -
ఛాంపియన్స్ ట్రోఫీకి మూడు వేదికలు
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ఇండియా పాకిస్థాన్కు వెళ్తుందో లేదో తెలియదు.. అసలు ఆ టోర్నీ పాకిస్థాన్లోనే జరుగుతుందో లేదో తెలియదు కానీ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం ఆ టోర్నీ కోసం ఏర్పాట్లు చేసుకుంటుంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!