Rohit Sharma: నా కెప్టెన్సీ అలానే ఉంటుంది: రోహిత్ శర్మ వెల్లడి
రోహిత్ శర్మ మైదానంలో ఆటగాళ్లతో సరదాగా ఉంటాడు.. కానీ, అతడు తెరవెనక మ్యాచ్ కోసం తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తాడు. ఇక గ్రౌండ్లో సూటిగా సుత్తి లేకుండా వ్యవహరిస్తాడు.
ఇంటర్నెట్డెస్క్: రోహిత్ (Rohit Sharma) బ్యాటింగ్ వలే కెప్టెన్సీ కూడా సుత్తి లేకుండా సూటిగా ఉంటుంది. వన్డే ప్రపంచకప్లో రోహిత్ కెప్టెన్సీ చూసిన క్రీడాపండితులు ఆశ్చర్యపోయారు. ఆ టోర్నీలో జట్టును ఏకంగా 10 మ్యాచ్లు ఓటమెరుగకుండా నడిపించడం సామాన్యమైన విషయం కాదు. తాజాగా రోహిత్ ఓ క్రీడా ఛానెల్తో మాట్లాడుతూ కెప్టెన్సీలో తాను వ్యూహరచన ఎలా చేస్తాడు.. ఆటగాళ్లతో సంబంధాలు వంటి కీలక అంశాలను వెల్లడించారు.
గంటల తరబడి ప్లానింగ్..
‘‘కెప్టెన్గా నేను చాలా వరకు డేటాపై ఆధారపడతాను. దానిని విశ్లేషించే వ్యూహాలను సిద్ధం చేసుకొంటాను. కొత్త ట్రెండ్లను గుర్తించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ క్రమంలో గంటల కొద్దీ సమయం మీటింగ్ రూముల్లో గడుపుతాను. ముఖ్యంగా మ్యాచ్లో ఊహించని పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలనేదానిపై సిద్ధమవుతా. ప్రాథమికంగా జట్టులోని ఆటగాళ్ల కోసం కాదు.. నాకు ఇది ముఖ్యం. ఆ పరిస్థితులపై అవగాహన ఉండటం చాలా కీలకం. ఇక మైదానంలోకి దిగే సమయానికి అన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కోవడానికి రెడీగా ఉంటాను. నా ప్లానింగ్ ఇలానే ఉంటుంది.
కానీ, ఈ విషయాలు మొత్తం చెప్పి జట్టు సభ్యుల మెదళ్లను నింపేయను. ఎవరికి ఏది అవసరమో.. ఎంతవరకు ముఖ్యమో అంతే చెబుతాను. ఇక ప్రత్యర్థులు మమ్మల్ని ఎదుర్కోవడానికి ఎలా సిద్ధమవుతున్నారో తెలుసుకోవాలనుకుంటాను’’ అని రోహిత్ వివరించాడు.
అదే నాకు అసలైన సవాల్..
‘‘కెప్టెన్గా ఆటగాళ్లను సమన్వయం చేసుకోవడం అతిపెద్ద సవాలు. ప్రతి ప్లేయర్ ఆలోచనా తీరు విభిన్నంగా ఉంటుంది. వారి అవసరాలు కూడా వేర్వేరుగా ఉంటాయి. ఆ విషయాలు మొత్తం కెప్టెన్గా నేను తెలుసుకోవాలి.. అవసరాన్ని బట్టి స్పందించాలి. ఇక ప్రతి ఆటగాడికి మిగిలిన వారితో సమప్రాధాన్యం ఇవ్వాలి.. అప్పుడే అతడు జట్టులో భాగంగా ఫీల్ అవుతాడు. ఎవరైనా ఆటగాడు మన దృష్టికి ఓ సమస్యను తీసుకొస్తే.. జాగ్రత్తగా విని మంచి పరిష్కారం సూచించగలగాలి. వీటన్నిటితోపాటు నేను కెప్టెన్గానే కాకుండా.. ఆటగాడిగా కూడా సిద్ధమవ్వాలి.
ఇక టీ20 ఫార్మాట్ వేగంగా మారిపోతోంది. ప్రతి ఒక్క ఆటగాడికి విభిన్నమైన శైలి ఉంటుంది. జాగ్రత్తగా అర్థం చేసుకొని.. దానిని బట్టి వారు ఎలా ఆడాలో నిర్ణయించాలి. ముఖ్యంగా నేను ఏం చెప్పాలనుకున్నా.. సమాచారాన్ని వీలైనంత ఫిల్టర్ చేసి ఎటువంటి సంక్లిష్టతలు లేకుండా వారికి తెలియజేస్తాను’’ అని రోహిత్ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్.. షూటింగ్లో ఫైనల్కు మను బాకర్
పారిస్ ఒలింపిక్స్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్లో మను బాకర్ అదరగొట్టింది. మూడో స్థానంలో నిలిచి ఫైనల్కు అర్హత సాధించింది. -
పారిస్ ఒలింపిక్స్లో.. బిల్ గేట్స్ అల్లుడు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో ఈక్వెస్ట్రియన్ విభాగంలో బిల్గేట్స్ అల్లుడు నాయెల్ నాజర్ పోటీ పడుతున్నాడు. -
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
Paris Olympics 2024: ఒలింపిక్స్ వేడుకలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో జరిగిన పొరపాటుపై నిర్వాహకులు క్షమాపణలు కోరారు. -
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
టెస్టుల్లో సచిన్ తెందూల్కర్ అత్యధిక పరుగుల రికార్డును ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ (Joe Root) బ్రేక్ చేసే అవకాశముందని భారత మాజీ వికెట్కీపర్ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) అభిప్రాయపడ్డాడు. -
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
5 కోట్లు దాటిన రిటర్నులు.. ఒక్క రోజే 28 లక్షలు
-
విస్తారా కీలక నిర్ణయం.. ఆ విమానాల్లో 20 నిమిషాలు ఫ్రీ వైఫై..!
-
‘మహారాజ’ ఆ ట్విస్ట్కు ‘దిమ్మతిరిగి మబ్బులు మెరిసిపోతాయి’..
-
కమల రాక.. తగ్గిన ట్రంప్ ఆధిక్యం!
-
స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్ పేరుతో.. రూ.3.25 కోట్ల మోసం
-
2న ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ సబ్స్క్రిప్షన్.. వారికి ఒకరోజు ముందుగానే