IPL 2024: హోస్ట్ టీమే విన్నర్.. ‘ఫస్ట్’ బెస్ట్ వీరే!
ఐపీఎల్ 17వ సీజన్లో మ్యాచ్లు రసవత్తరంగా సాగుతున్నాయి. ఐదు మ్యాచుల్లో నాలుగు చివరి ఓవర్ వరకూ వెళ్లాయి..
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్లో అన్ని జట్లూ తమ తొలి మ్యాచ్ను ఆడేశాయి. ఇప్పటివరకు అతిథ్యం ఇచ్చిన టీమ్లే గెలిచాయి. కొత్త కెప్టెన్లు ఆకట్టుకోగా.. అంచనాలు పెద్దగా లేని బ్యాటర్లు భారీ హిట్టింగ్తో అలరించారు. తామేం తక్కువ కాదంటూ బౌలర్లూ నిరూపించారు. ఇలా ఫస్ట్ మ్యాచుల్లో బెస్ట్గా నిలిచిన ప్లేయర్లపై ఓ లుక్ వేద్దాం.
- ముస్తఫిజర్ రహ్మాన్: డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై విజయంతో బోణీ కొట్టింది. బెంగళూరుపై ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరును కట్టడి చేయడంలో చెన్నై బౌలర్ ముస్తఫిజర్ రహ్మాన్ కీలక పాత్ర పోషించాడు. నాలుగు ఓవర్లలో కేవలం 29 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో తన అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు. ధోనీ నుంచి బాధ్యతలు చేపట్టిన రుతురాజ్ కెప్టెన్గా తన ప్రతిభ కనబరిచాడు.
- సామ్ కరన్ దూకుడు: గత మినీ వేలం ముందు వరకు లీగ్ చరిత్రలో అత్యధిక ధర సొంతం చేసుకున్న ఆటగాడిగా సామ్ కరన్ పేరిట రికార్డు ఉండేది. కానీ, గత సీజన్లో అనుకున్నంత మేర రాణించలేకపోయాడు. ఈసారి మాత్రం మొదటి మ్యాచ్లోనే తన విశ్వరూపం చూపించాడు. దిల్లీతో మ్యాచ్లో క్లిష్టసమయంలో కీలకమైన ఇన్నింగ్స్తో పంజాబ్ను గెలిపించాడు. 47 బంతుల్లో 63 పరుగులు చేశాడు. దాదాపు 15 నెలల తర్వాత మైదానంలోకి దిగిన దిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ భారీగా పరుగులు చేయకపోయినా.. క్రీజ్లో మాత్రం కంఫర్ట్గా ఆడాడు.
- రస్సెల్ హిట్టింగ్.. క్లాసెన్ క్లాస్: ఈ సీజన్లో తొలిసారి ఓ జట్టు 200+ స్కోరును దాటింది. అలానే ఛేదనలోనూ ప్రత్యర్థి దీటుగా బదులిచ్చింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన కోల్కతా-హైదరాబాద్ మ్యాచ్లో ఈ ఘనత నమోదు కావడం విశేషం. గత రెండు సీజన్లలో పెద్దగా ఆకట్టుకోని ఆండ్రి రస్సెల్ ఈసారి మొదటి మ్యాచ్లో బీభత్సం సృష్టించాడు. కేవలం 25 బంతుల్లోనే 64 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో కోల్కతా 208/7 స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో హెన్రిచ్ క్లాసెన్ (29 బంతుల్లో 63) దెబ్బకు విజయానికి చేరువగా వచ్చింది. చివరికి 204/7 స్కోరు చేసి హైదరాబాద్ 4 పరుగుల తేడాతో ఓడిపోయింది.
- సంజూ శాంసన్ కెప్టెన్ ఇన్నింగ్స్: ఐదు మ్యాచుల్లో నాలుగు చివరి ఓవర్ వరకూ వెళ్లగా.. రాజస్థాన్ - లఖ్నవూ మ్యాచ్ మాత్రం మలుపులేమీ లేకుండానే ముగిసింది. అయితే, రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ (82*) భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. కొన్ని సీజన్లుగా ఆటతో కాకుండా తన ప్రవర్తనతో నెట్టింట వైరల్గా మారిన రియాన్ పరాగ్(43) మంచి ఆటతీరు ప్రదర్శించాడు. లఖ్నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్ (58), వైస్ కెప్టెన్ (64*) అర్ధశతకాలు చేసినా తమ జట్టును గెలిపించుకోలేకపోయారు. టీ20 ప్రపంచ కప్ నేపథ్యంలో సంజూ, కేఎల్ ఇన్నింగ్స్లు, ప్రదర్శన కీలకం.
- గుజరాత్ అదుర్స్: బ్యాటింగ్కు కష్టమైన అహ్మదాబాద్ పిచ్పై ముంబయి ఒక దశలో విజయం దిశగా సాగింది. కానీ, గుజరాత్ బౌలర్ల అద్భుత ప్రతిభతో ముంబయి ఓటమిపాలైంది. హార్దిక్ పాండ్య కెప్టెన్సీతోపాటు బౌలింగ్లో విఫలమయ్యాడు. కొత్తగా సారథ్య బాధ్యతలు చేపట్టిన గిల్ జట్టును నడిపించడంలో సక్సెస్ కావడం విశేషం. కీలక సమయంలో మోహిత్ శర్మ (2/32), ఉమేశ్ యాదవ్ (2/31), ఒమర్జాయ్ (2/27) రాణించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా సాయి సుదర్శన్ (45) చక్కని ఆటతీరు ప్రదర్శించాడు. ముంబయి మాజీ కెప్టెన్ రోహిత్ (43) కూడా రాణించాడు. బుమ్రా (3/14) పదునైన బౌలింగ్ చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
-
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం