IPL 2024: హోస్ట్ టీమే విన్నర్.. ‘ఫస్ట్’ బెస్ట్ వీరే!
ఐపీఎల్ 17వ సీజన్లో మ్యాచ్లు రసవత్తరంగా సాగుతున్నాయి. ఐదు మ్యాచుల్లో నాలుగు చివరి ఓవర్ వరకూ వెళ్లాయి..
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్లో అన్ని జట్లూ తమ తొలి మ్యాచ్ను ఆడేశాయి. ఇప్పటివరకు అతిథ్యం ఇచ్చిన టీమ్లే గెలిచాయి. కొత్త కెప్టెన్లు ఆకట్టుకోగా.. అంచనాలు పెద్దగా లేని బ్యాటర్లు భారీ హిట్టింగ్తో అలరించారు. తామేం తక్కువ కాదంటూ బౌలర్లూ నిరూపించారు. ఇలా ఫస్ట్ మ్యాచుల్లో బెస్ట్గా నిలిచిన ప్లేయర్లపై ఓ లుక్ వేద్దాం.
- ముస్తఫిజర్ రహ్మాన్: డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై విజయంతో బోణీ కొట్టింది. బెంగళూరుపై ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరును కట్టడి చేయడంలో చెన్నై బౌలర్ ముస్తఫిజర్ రహ్మాన్ కీలక పాత్ర పోషించాడు. నాలుగు ఓవర్లలో కేవలం 29 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో తన అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు. ధోనీ నుంచి బాధ్యతలు చేపట్టిన రుతురాజ్ కెప్టెన్గా తన ప్రతిభ కనబరిచాడు.
- సామ్ కరన్ దూకుడు: గత మినీ వేలం ముందు వరకు లీగ్ చరిత్రలో అత్యధిక ధర సొంతం చేసుకున్న ఆటగాడిగా సామ్ కరన్ పేరిట రికార్డు ఉండేది. కానీ, గత సీజన్లో అనుకున్నంత మేర రాణించలేకపోయాడు. ఈసారి మాత్రం మొదటి మ్యాచ్లోనే తన విశ్వరూపం చూపించాడు. దిల్లీతో మ్యాచ్లో క్లిష్టసమయంలో కీలకమైన ఇన్నింగ్స్తో పంజాబ్ను గెలిపించాడు. 47 బంతుల్లో 63 పరుగులు చేశాడు. దాదాపు 15 నెలల తర్వాత మైదానంలోకి దిగిన దిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ భారీగా పరుగులు చేయకపోయినా.. క్రీజ్లో మాత్రం కంఫర్ట్గా ఆడాడు.
- రస్సెల్ హిట్టింగ్.. క్లాసెన్ క్లాస్: ఈ సీజన్లో తొలిసారి ఓ జట్టు 200+ స్కోరును దాటింది. అలానే ఛేదనలోనూ ప్రత్యర్థి దీటుగా బదులిచ్చింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన కోల్కతా-హైదరాబాద్ మ్యాచ్లో ఈ ఘనత నమోదు కావడం విశేషం. గత రెండు సీజన్లలో పెద్దగా ఆకట్టుకోని ఆండ్రి రస్సెల్ ఈసారి మొదటి మ్యాచ్లో బీభత్సం సృష్టించాడు. కేవలం 25 బంతుల్లోనే 64 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో కోల్కతా 208/7 స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో హెన్రిచ్ క్లాసెన్ (29 బంతుల్లో 63) దెబ్బకు విజయానికి చేరువగా వచ్చింది. చివరికి 204/7 స్కోరు చేసి హైదరాబాద్ 4 పరుగుల తేడాతో ఓడిపోయింది.
- సంజూ శాంసన్ కెప్టెన్ ఇన్నింగ్స్: ఐదు మ్యాచుల్లో నాలుగు చివరి ఓవర్ వరకూ వెళ్లగా.. రాజస్థాన్ - లఖ్నవూ మ్యాచ్ మాత్రం మలుపులేమీ లేకుండానే ముగిసింది. అయితే, రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ (82*) భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. కొన్ని సీజన్లుగా ఆటతో కాకుండా తన ప్రవర్తనతో నెట్టింట వైరల్గా మారిన రియాన్ పరాగ్(43) మంచి ఆటతీరు ప్రదర్శించాడు. లఖ్నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్ (58), వైస్ కెప్టెన్ (64*) అర్ధశతకాలు చేసినా తమ జట్టును గెలిపించుకోలేకపోయారు. టీ20 ప్రపంచ కప్ నేపథ్యంలో సంజూ, కేఎల్ ఇన్నింగ్స్లు, ప్రదర్శన కీలకం.
- గుజరాత్ అదుర్స్: బ్యాటింగ్కు కష్టమైన అహ్మదాబాద్ పిచ్పై ముంబయి ఒక దశలో విజయం దిశగా సాగింది. కానీ, గుజరాత్ బౌలర్ల అద్భుత ప్రతిభతో ముంబయి ఓటమిపాలైంది. హార్దిక్ పాండ్య కెప్టెన్సీతోపాటు బౌలింగ్లో విఫలమయ్యాడు. కొత్తగా సారథ్య బాధ్యతలు చేపట్టిన గిల్ జట్టును నడిపించడంలో సక్సెస్ కావడం విశేషం. కీలక సమయంలో మోహిత్ శర్మ (2/32), ఉమేశ్ యాదవ్ (2/31), ఒమర్జాయ్ (2/27) రాణించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా సాయి సుదర్శన్ (45) చక్కని ఆటతీరు ప్రదర్శించాడు. ముంబయి మాజీ కెప్టెన్ రోహిత్ (43) కూడా రాణించాడు. బుమ్రా (3/14) పదునైన బౌలింగ్ చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
ఐపీఎల్-17లో దిల్లీ ఐదో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ముంబయితో జరిగిన మ్యాచ్లో 10 పరుగుల తేడాతో గెలుపొందింది. -
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
టీ20 ప్రపంచ కప్ జట్టులో స్థానం కోసం తీవ్ర పోటీ ఉంది. సీనియర్లతోపాటు యువ క్రికెటర్లు బరిలో నిలిచారు. -
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
భారత ఆర్చరీ బృందం అద్భుత ప్రదర్శన చేసింది. ఆర్చరీ వరల్డ్ కప్లో మూడు కేటగిరీల్లో స్వర్ణాలను గెలుచుకుంది. -
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
డ్రగ్ తయారీ మాఫియా గుట్టురట్టు.. 300 కేజీలు స్వాధీనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..