Hanuma Vihari: ఒంటిచేత్తో ఆడాడు.. హనుమ విహారి వాదనను నమ్ముతా: చోప్రా
భారత్ తరఫున కీలక సమయాల్లో రాణించిన హనుమ విహారి (Hanuma Vihari) విషయంలో ఇలా జరగడం బాధాకరమని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా వ్యాఖ్యానించాడు.
ఇంటర్నెట్ డెస్క్: తెలుగు రాష్ట్రాలతో పాటు క్రికెట్ వర్గాలను విస్మయానికి గురి చేస్తోన్న అంశం హనుమ విహారి కెప్టెన్సీ తొలగింపు. రంజీ ట్రోఫీలో ఆంధ్రా జట్టుకు సారథిగా ఉన్నప్పుడు తోటి సహచరుడిని అసభ్య పదజాలంతో మందలించాడనే ఆరోపణలతో ఏకంగా కెప్టెన్సీ నుంచి తప్పించడం గమనార్హం. అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమారుడిని అనడమే దీనికి కారణమని క్రికెట్, రాజకీయ ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే హనుమ విహారి ఇకపై ఆంధ్రా జట్టుకు ఆడేది లేదని తేల్చి చెప్పాడు. ఈ వివాదంపై భారత మాజీ క్రికెటర్, విశ్లేషకుడు ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానల్లో స్పందించాడు.
‘‘ఇదంతా బురద చల్లే ప్రయత్నంగా కనిపిస్తోంది. ఇరువైపులా ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. సోదరభావంతో ప్లేయర్లకు ఒక విషయం చెబుతున్నా. సహచరులపై ఎప్పుడూ నమ్మకం ఉంచాలి. హనుమ విహారి సాధారణ ఆటగాడిగానే కాకుండా గతంలో ఆంధ్రా కోసం, టీమ్ఇండియా కోసం ఒంటి చేత్తో మ్యాచ్లు ఆడిన టాలెంటెడ్ క్రికెటర్. అతడి కెరీర్ అద్భుతంగా ఉంది. రంజీ ట్రోఫీలో ఆంధ్రా జట్టును సెమీస్కు క్వాలిఫై చేయడంలో కీలకపాత్ర పోషించాడు. సిడ్నీ టెస్టులో గాయమైనా సరే క్రీజ్లో పాతుకుపోయిన తీరు చూసిన తర్వాత అతడిపై గౌరవభావం పెరిగింది. అందుకే, నేను హనుమ విహారి వైపు వాదనను నమ్ముతున్నా’’ అని ఆకాశ్ చోప్రా వెల్లడించాడు.
ఇదీ హనుమ విహారి పోస్టు..
‘‘బెంగాల్తో జరిగిన మొదటి మ్యాచ్ సందర్భంగా 17వ ఆటగాణ్ని గేమ్ విషయంలో కోప్పడ్డాను. ఆ విషయం అతని తండ్రికి చెప్పాడు. రాజకీయ నాయకుడైన ఆయన నాపై చర్య తీసుకోవాలని ఏసీఏని కోరారు. ఆ మ్యాచ్లో బెంగాల్ భారీ లక్ష్యాన్ని నిలిపినా.. మేం పోరాడి గెలిచాం. గత సీజన్లో ఫైనల్కు చేరిన బెంగాల్ను మేం మొదటి మ్యాచ్లోనే ఓడించినా నన్ను కెప్టెన్సీకి రాజీనామా చేయాల్సిందిగా ఏసీఏ ఆదేశించింది. నా తప్పేమీ లేకపోయినా నన్ను కెప్టెన్సీ నుంచి తీసేశారు. ఆ క్రికెటర్ను నేను వ్యక్తిగతంగా ఏమీ అనలేదు’ అని ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో విహారి తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ