Rohit Sharma: రోహిత్ నాయకత్వం అద్భుతం.. ధోనీ తర్వాత అతడే: భారత మాజీ క్రికెటర్
ఎంఎస్ ధోనీ నాయకత్వ లక్షణాలు అందిపుచ్చుకోవడం చాలా కష్టం. కానీ, రోహిత్ శర్మ ఆ దిశగా నడుస్తున్నట్లు మాజీ క్రికెటర్ రైనా వ్యాఖ్యానించాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) నాయకత్వ లక్షణాలు అద్భుతంగా ఉన్నాయని మాజీ క్రికెటర్ సురేశ్ రైనా (Suresh Raina) అభినందించాడు. తాజాగా ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమ్ఇండియా (IND vs ENG) కైవసం చేసుకోవడంలో హిట్మ్యాన్ సారథ్యం ప్రధాన కారణమని రైనా వ్యాఖ్యానించాడు. ఎక్కువ మంది యువకులు ఉన్నా సరే ఎలాంటి ఒత్తిడికి గురి కాలేదని పేర్కొన్నాడు. ఈ టెస్టు సిరీస్లోనే నలుగురు భారత ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయడం గమనార్హం. తొలుత 0-1 తో వెనుకబడినా అనంతరం పుంజుకుని సిరీస్ను సొంతం చేసుకోవడం గొప్ప విషయమని రైనా తెలిపాడు.
‘‘రోహిత్ కెప్టెన్సీ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. అతడి నాయకత్వం అద్భుత స్థాయిలో ఉంది. తప్పకుండా ధోనీ తర్వాత అత్యుత్తమ కెప్టెన్ రోహిత్ అనడంలో సందేహం లేదు. యువ క్రికెటర్లకు అవకాశాలు కల్పించడంలో ధోనీ మాదిరిగానే రోహిత్ ముందుంటాడు. ‘కెప్టెన్ కూల్’ నాయకత్వంలో నేను చాలా ఏళ్లు క్రికెట్ ఆడా. అలాగే సౌరభ్ గంగూలీ కూడా కుర్రాళ్లకు స్వేచ్ఛ ఇచ్చేవాడు. అతడి తర్వాత ధోనీ జట్టును ముందుండి నడిపించాడు. ఇప్పుడు రోహిత్ సరైన దిశలోనే ఉన్నాడు. పక్కా ప్లానింగ్తో వ్యూహాలను పన్నుతున్నాడు. గత కొన్నేళ్లుగా ఇలా ఆటగాళ్లను రొటేట్ చేసిన పద్ధతిని చూడలేదు. గతంలో ఫాస్ట్ బౌలర్లు తరచూ గాయాలబారిన పడేవారు. ఇప్పుడు ఇంజూరి మేనేజ్మెంట్తో ఆ ప్రమాదం తగ్గింది’’ అని రైనా వ్యాఖ్యానించాడు.
అప్పుడే చెప్పాడు.. మెర్సిడెజ్ కొంటానని..: రోహిత్ చిన్ననాటి కోచ్
ఆర్థిక కష్టాలను ఎదుర్కొని మరీ గొప్ప క్రికెటర్గా మారిన రోహిత్ శర్మ గురించి చిన్ననాటి కోచ్ దినేశ్ లాడ్ ఓ ఆసక్తికర విషయం చెప్పారు. మెర్సిడెజ్ కార్ను కొనడం కల అని.. తప్పకుండా భవిష్యత్తులో నెరవేర్చుకుంటానని రోహిత్ చెప్పాడట. ‘‘నేను, రోహిత్ ఓసారి దారిలో వెళ్తూ మెర్సిడెజ్ కారును చూశాం. అప్పుడు రోహిత్ స్పందిస్తూ ‘‘సర్, ఏదొక రోజు అలాంటి కారును కొంటా’ అని అన్నాడు. అప్పుడు అతడు ముంబయి తరఫున అండర్ -19 జట్టుకు ఎంపికయ్యాడు. అప్పటికి పెద్ద టోర్నీల్లో ఆడలేదు. ఇది సాధ్యమేనా? అని అనిపించినా.. రోహిత్ ఆత్మవిశ్వాసంతో ఆ మాట అన్నాడు’’ అని దినేశ్ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..