Hardik Pandya: దేశవాళీ పరిమిత ఓవర్ల మ్యాచ్లోనైనా పాండ్య ఆడితే బాగుండేది: ఇర్ఫాన్ పఠాన్
టీమ్ఇండియాలో ఇప్పుడు సెంట్రల్ కాంట్రాక్ట్లపై చర్చ సాగుతోంది. దేశవాళీ క్రికెట్లో ఆడలేదని శ్రేయస్, ఇషాన్పై వేటు వేసిన బీసీసీఐ పాండ్య విషయంలో వెనక్కి తగ్గడంపై పలువురు విమర్శలు చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో (Grade A) హార్దిక్ పాండ్యకు చోటు దక్కింది. గతేడాది వన్డే వరల్డ్ కప్ సందర్భంగా గాయపడిన హార్దిక్.. ఇప్పటివరకు మైదానంలోకి అడుగు పెట్టలేదు. కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్నే ఆడుతున్న పాండ్యను టెస్టులకు ఎంపిక చేసేందుకూ సెలక్టర్లు మొగ్గు చూపడం లేదు. అతడి శరీరం సహకరించదనే ఉద్దేశంతో పక్కన పెట్టేయడం గమనార్హం. తాజాగా ఐపీఎల్ కోసం సన్నద్ధవుతున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఫిట్గా ఉన్నప్పుడు దేశవాళీలో ఆడించాల్సిందని కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి పక్కన పెట్టేసిన క్రమంలో పాండ్య విషయంలో బీసీసీఐ తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఇదే అంశంపై భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇషాన్, శ్రేయస్ కాంట్రాక్ట్ రద్దు కావడంతోపాటు పాండ్య పైనా స్పందించాడు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించని సమయంలో దేశవాళీలోనైనా పరిమిత ఓవర్ల టోర్నీ ఆడితే బాగుంటుందని సూచించాడు.
‘‘శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ ప్రతిభ కలిగిన క్రికెటర్లు. తప్పకుండా పుంజుకొని తిరిగి వస్తారని భావిస్తున్నా. అదే సమయంలో.. హార్దిక్ పాండ్య మాదిరిగా ఎవరైనా రెడ్ బాల్ క్రికెట్ ఆడకుండా ఉండాలని భావిస్తే.. కనీసం వారిని దేశవాళీలోని పరిమిత ఓవర్ల మ్యాచుల్లోనైనా పాల్గొనేలా చేయాలి. ఇదే సూత్రం అందరికీ అమలు చేయకపోతే.. భారత క్రికెట్ అనుకున్న సత్ఫలితాలను సాధించడంలో వెనకబడుతుంది’’ అని ఇర్ఫాన్ పోస్టు పెట్టాడు.
బీసీసీఐ నిర్ణయం సరైందే: సౌరభ్ గంగూలీ
‘‘శ్రేయస్, ఇషాన్ను రంజీ ట్రోఫీలో ఆడాలని బీసీసీఐ సూచించింది. కానీ, వారిద్దరూ అక్కడ ఆడకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. దేశంలో గొప్ప టోర్నీల్లో ఒకటైన రంజీల్లో ఆడటాన్ని తక్కువగా భావించడం సరైంది కాదు. ప్రతిఒక్కరూ ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడాలి. కుర్రాళ్లు ఇలాంటి వైఖరిని ప్రదర్శించడం షాకింగ్ అనిపిస్తోంది. కాంట్రాక్ట్ ప్లేయర్లు బీసీసీఐ సూచనలను పాటించాలి. అత్యవసర, ఇతర కారణాలతో ఉండిపోతే ఏం చేయలేం. కానీ, ఫిట్గా ఉండి మరీ డుమ్మా కొట్టడం బాగోలేదు. అందుకే, ఇషాన్, శ్రేయస్ విషయంలో బీసీసీఐ తీసుకున్న నిర్ణయం సరైందే. తప్పకుండా ఇతర ఆటగాళ్లకు ఇది హెచ్చరికగా ఉంటుంది’’ అని భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి