Hardik Pandya: దేశవాళీ పరిమిత ఓవర్ల మ్యాచ్లోనైనా పాండ్య ఆడితే బాగుండేది: ఇర్ఫాన్ పఠాన్
టీమ్ఇండియాలో ఇప్పుడు సెంట్రల్ కాంట్రాక్ట్లపై చర్చ సాగుతోంది. దేశవాళీ క్రికెట్లో ఆడలేదని శ్రేయస్, ఇషాన్పై వేటు వేసిన బీసీసీఐ పాండ్య విషయంలో వెనక్కి తగ్గడంపై పలువురు విమర్శలు చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో (Grade A) హార్దిక్ పాండ్యకు చోటు దక్కింది. గతేడాది వన్డే వరల్డ్ కప్ సందర్భంగా గాయపడిన హార్దిక్.. ఇప్పటివరకు మైదానంలోకి అడుగు పెట్టలేదు. కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్నే ఆడుతున్న పాండ్యను టెస్టులకు ఎంపిక చేసేందుకూ సెలక్టర్లు మొగ్గు చూపడం లేదు. అతడి శరీరం సహకరించదనే ఉద్దేశంతో పక్కన పెట్టేయడం గమనార్హం. తాజాగా ఐపీఎల్ కోసం సన్నద్ధవుతున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఫిట్గా ఉన్నప్పుడు దేశవాళీలో ఆడించాల్సిందని కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి పక్కన పెట్టేసిన క్రమంలో పాండ్య విషయంలో బీసీసీఐ తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఇదే అంశంపై భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇషాన్, శ్రేయస్ కాంట్రాక్ట్ రద్దు కావడంతోపాటు పాండ్య పైనా స్పందించాడు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించని సమయంలో దేశవాళీలోనైనా పరిమిత ఓవర్ల టోర్నీ ఆడితే బాగుంటుందని సూచించాడు.
‘‘శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ ప్రతిభ కలిగిన క్రికెటర్లు. తప్పకుండా పుంజుకొని తిరిగి వస్తారని భావిస్తున్నా. అదే సమయంలో.. హార్దిక్ పాండ్య మాదిరిగా ఎవరైనా రెడ్ బాల్ క్రికెట్ ఆడకుండా ఉండాలని భావిస్తే.. కనీసం వారిని దేశవాళీలోని పరిమిత ఓవర్ల మ్యాచుల్లోనైనా పాల్గొనేలా చేయాలి. ఇదే సూత్రం అందరికీ అమలు చేయకపోతే.. భారత క్రికెట్ అనుకున్న సత్ఫలితాలను సాధించడంలో వెనకబడుతుంది’’ అని ఇర్ఫాన్ పోస్టు పెట్టాడు.
బీసీసీఐ నిర్ణయం సరైందే: సౌరభ్ గంగూలీ
‘‘శ్రేయస్, ఇషాన్ను రంజీ ట్రోఫీలో ఆడాలని బీసీసీఐ సూచించింది. కానీ, వారిద్దరూ అక్కడ ఆడకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. దేశంలో గొప్ప టోర్నీల్లో ఒకటైన రంజీల్లో ఆడటాన్ని తక్కువగా భావించడం సరైంది కాదు. ప్రతిఒక్కరూ ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడాలి. కుర్రాళ్లు ఇలాంటి వైఖరిని ప్రదర్శించడం షాకింగ్ అనిపిస్తోంది. కాంట్రాక్ట్ ప్లేయర్లు బీసీసీఐ సూచనలను పాటించాలి. అత్యవసర, ఇతర కారణాలతో ఉండిపోతే ఏం చేయలేం. కానీ, ఫిట్గా ఉండి మరీ డుమ్మా కొట్టడం బాగోలేదు. అందుకే, ఇషాన్, శ్రేయస్ విషయంలో బీసీసీఐ తీసుకున్న నిర్ణయం సరైందే. తప్పకుండా ఇతర ఆటగాళ్లకు ఇది హెచ్చరికగా ఉంటుంది’’ అని భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
-
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
-
అందుకే ముద్దు సన్నివేశాలకు నో చెబుతాను: మృణాల్ ఠాకూర్
-
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా
-
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం
-
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!