IND vs ENG: కుల్దీప్ విషయంలో రోహిత్ అయోమయానికి గురయ్యాడు: మాజీ క్రికెటర్లు
రాంచీ వేదికగా నాలుగో టెస్టులో (IND vs ENG) రెండో రోజు ఇంగ్లాండ్ ఆధిపత్యం ప్రదర్శించింది. మొదటి రోజు ఆటలోనూ జో రూట్ సెంచరీ చేసి ఆ జట్టును కాపాడాడు. అయితే, బౌలర్లను వినియోగించుకోవడంలో రోహిత్ ఇబ్బంది పడ్డాడని భారత మాజీ క్రికెటర్లు వ్యాఖ్యానించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్తో జరిగిన నాలుగో టెస్టులో (IND vs ENG) భారత కెప్టెన్ రోహిత్ శర్మ బౌలర్ల విషయంలో తీవ్ర గందరగోళానికి గురైనట్లు మాజీ క్రికెటర్లు ఆర్పీ సింగ్, ఆకాశ్ చోప్రా వ్యాఖ్యానించారు. లెప్ట్ ఆర్మ్ బౌలర్ కుల్దీప్ యాదవ్తో ఎక్కువ ఓవర్లు వేయించకపోవడం సరైన నిర్ణయం కాదన్నారు. తొలి రోజు ఆటలో కుల్దీప్ కేవలం 10 ఓవర్లు మాత్రమే విసిరాడు. దాదాపు సగం ఓవర్ల తర్వాతనే బౌలింగ్కు తీసుకురావడం గమనార్హం. వికెట్ తీయనప్పటికీ.. కట్టుదిట్టంగా బౌలింగ్ వేసి పరుగులు నియంత్రించాడు. రెండో రోజూ కేవలం మరో 2 ఓవర్లే ఇవ్వడం గమనార్హం. తన 12 ఓవర్ల కోటాలో కుల్దీప్ కేవలం 22 పరుగులే ఇచ్చాడు.
‘‘భారత బౌలర్లు చాలా శ్రమించారు. రవీంద్ర జడేజా, అశ్విన్, సిరాజ్, ఆకాశ్ అద్భుతంగా బౌలింగ్ వేశారు. తొలి స్పెల్ కంటే రెండో స్పెల్లో సిరాజ్ చక్కగా బంతులను విసిరాడు. ఇక్కడ నాకొచ్చే ఏకైక అనుమానం కుల్దీప్ను ఎందుకు పెద్దగా వాడుకోలేదు? జడ్డూ, అశ్విన్తో చాలా ఓవర్లు వేయించిన కెప్టెన్.. కుల్దీప్కు తక్కువ ఇచ్చాడు. ముగ్గురు స్పిన్నర్లు ఉండి.. ఇద్దరు వికెట్లు తీస్తూ ఉంటే మూడో బౌలర్ను పక్కన పెట్టాల్సిన పరిస్థితి తప్పదు’’ అని ఆర్పీ సింగ్ తెలిపాడు.
కుల్దీప్ను తేవడంలో ఆలస్యమైంది: చోప్రా
‘‘జట్టులో ఐదుగురు బౌలర్లు ఉన్నప్పుడు ఎవరిని ఎప్పుడు బౌలింగ్కు తీసుకురావాలన్న కన్ఫ్యూజ్ ఉంటుంది. మీరు బఫెట్కు వెళ్లినప్పుడు చాలా రకాలు పదార్థాలు ఉంటాయి. ఏది వేసుకోవాలనే విషయంలో గందరగోళం తప్పదు. కుల్దీప్ను చాలా ఆలస్యంగా బౌలింగ్కు తీసుకొచ్చారు. ఇంకాస్త ముందుగా తెచ్చి ఉంటే బాగుండేది’’ అని ఆకాశ్ చోప్రా వ్యాఖ్యానించాడు.
కోహ్లీ లేని లోటు కనిపించింది: మంజ్రేకర్
‘‘ఐదు టెస్టుల సిరీస్లో విరాట్ కోహ్లీ లేకపోవడం భారత్కు ఇబ్బందే. అతడి దూకుడైన ఆటతీరు ప్రత్యర్థులను ఆత్మరక్షణలో పడేసేలా ఉంటుంది. ఫీల్డింగ్ సమయంలో ఆటగాళ్లు కాస్త డల్గా అనిపించినప్పుడు.. కోహ్లీ వారిలో ఎనర్జీ తీసుకురాగలడు. ఇప్పుడు మైదానంలో ఉన్నవారెవరూ అలా చేయలేరు. మ్యాచ్ను చూసేందుకు వచ్చే ప్రేక్షకులను కూడా విరాట్ తన విన్యాసాలతో ఆకట్టుకుంటాడు’’ అని మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ తెలిపాడు. విరాట్ కోహ్లీ - అనుష్క శర్మ దంపతులకు ఫిబ్రవరి 15న రెండో బిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. అకాయ్గా అతడిని కోహ్లీ పరిచయం చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం