IPL 2024: భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
ఐపీఎల్లో చెన్నై జట్టును తక్కువ చేయడం సరికాదని భారత మాజీ క్రికెటర్ శివరామకృష్ణన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ముంబయితో మ్యాచ్ సందర్భంగా చెన్నై బౌలింగ్ యూనిట్పై క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే (Harsha Bhogle) చేసిన కామెంట్లు ఓ భారత మాజీ క్రికెటర్కు ఆగ్రహాన్ని తెప్పించాయి. తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ ట్వీట్లు చేశాడు. అయితే, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వాటిని డిలీట్ చేయడం గమనార్హం. ఇంతకీ అసలేం జరిగిందంటే?
వాంఖడే మైదానం వేదికగా గత ఆదివారం ముంబయి-చెన్నై జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే 206/4 స్కోరు చేసింది. చివరి ఓవర్లో ధోనీ హ్యాట్రిక్ సిక్స్లతో విరుచుకుపడటంతో ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆ సమయంలో కామెంట్రీ చేస్తున్న హర్షా.. ‘‘206 స్కోరు మంచిదే. కానీ, మంచు ప్రభావం ఎక్కువగా ఉండే ఇలాంటి పిచ్పై అదనంగా మరో 20 పరుగులు చేస్తే బాగుండేది. ఆ జట్టులో బౌలింగ్ ఆప్షన్లు కూడా మరీ ఎక్కువగా లేవు’’ అని పేర్కొన్నాడు. అతడి కామెంట్లపై భారత మాజీ క్రికెటర్ శివరామకృష్ణన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘మీలాంటి వారు చెన్నై ఆటగాళ్లను తక్కువ చేయడానికి ఇష్టపడుతుంటారు. ఇలాంటివి నాతో చేయండి. అంతేకానీ సీఎస్కేతో వద్దు’’ అని ఘాటుగా పోస్టు పెట్టాడు.
(సోర్స్: ఎక్స్)
అంతటితో ఆగని ఆయన మరో పోస్టులో భోగ్లేను ఉద్దేశించి ‘‘భారత క్రికెట్కు నువ్వేం చేశావు? నీ భాగస్వామ్యం ఏంటి? ఇవన్నీ ఆలోచిస్తుంటే ఆశ్చర్యకరంగా ఉంటుంది’’ అని కామెంట్ చేశాడు. అయితే, ఆ తర్వాత వాటిని శివరామకృష్ణన్ డిలీట్ చేశాడు. అప్పటికే అభిమానులు స్క్రీన్ షాట్లను తీయడంతో వైరల్గా మారాయి. ఆ మ్యాచ్లో చివరికి ముంబయి 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. చెన్నై బౌలర్లు రాణించడంతో 186/6 స్కోరుకే ముంబయి పరిమితమైంది. పతిరన (4/28) అద్భుత బౌలింగ్తో అదరగొట్టాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్