Team India: టీమ్ఇండియాలో చోటే లక్ష్యం.. టీ20 మెగా టోర్నీయే అవకాశం
కొద్దికాలంగా భారత జట్టులో ఆటగాళ్ల మధ్య పోటీ అధికమైంది. అటు సీనియర్లు, ఇటు యువకులతో బలమైన జట్టుగా రూపుదిద్దుకుంది. అదే సమయంలో పలువురు కీలక ఆటగాళ్లు ఫామ్ కోల్పోయి..
కొద్దికాలంగా భారత జట్టులో ఆటగాళ్ల మధ్య పోటీ తీవ్రమైంది. అటు సీనియర్లు, ఇటు జూనియర్లతో బలమైన జట్టుగా రూపుదిద్దుకొంది. అదే సమయంలో పలువురు కీలక ఆటగాళ్లు ఫామ్ కోల్పోయి జట్టులో స్థానాలే కోల్పోయే ప్రమాదంలో పడ్డారు. అలాంటి వారు కొందరు ఇప్పుడు టీ20 మెగా లీగ్లో చెలరేగుతున్నారు. రాబోయే టీ20 ప్రపంచకప్పే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. దీంతో అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నారు. వారెవరో.. ఎలా ఆడుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం..
చాహల్ సూపర్ హిట్: యుజ్వేంద్ర చాహల్ గత రెండేళ్లలో టీమ్ఇండియా తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్లో చాలా తక్కువ మ్యాచ్లే ఆడాడు. వన్డేల్లో 7, టీ20ల్లో 9 మ్యాచ్లే ఆడటంతో జట్టులో సుస్థిర స్థానం కోసం అవస్థలు పడ్డాడు. కానీ, ఇప్పుడు జరుగుతోన్న 15వ సీజన్లో రాజస్థాన్ తరఫునే కాకుండా మొత్తం టోర్నీలోనే లీడింగ్ వికెట్ టేకర్గా కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్ల్లో 7.09 ఎకానమీతో 18 వికెట్లు పడగొట్టాడు. ఇలాగే రాణించి రాబోయే టీ20 ప్రపంచకప్ జట్టులో స్థానం సాధించి మళ్లీ సత్తాచాటాలని చూస్తున్నాడు.
కుల్దీప్ బంపర్ హిట్: టీమ్ఇండియాలో చాహల్ కన్నా గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాడు మణికట్టు స్పిన్ స్పషలిస్టు కుల్దీప్ యాదవ్. గత రెండేళ్లలో అంతర్జాతీయ క్రికెట్లో 5 వన్డేలు, 3 టీ20లే ఆడిన అతడు ఈ టీ20 లీగ్లో గతేడాది ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అంతకుముందు సీజన్లో కేవలం 5 మ్యాచ్లే ఆడాడు. ఈ క్రమంలోనే ఈసారి దిల్లీ తరఫున అత్యధిక వికెట్లు తీస్తున్న బౌలర్గా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు అతడు ఆడిన 7 మ్యాచ్ల్లో 8.47 ఎకానమీతో 14 వికెట్లు తీశాడు. మున్ముందు కూడా ఇలా మెరిసి మళ్లీ టీమ్ఇండియాలో పాగా వేయాలని భావిస్తున్నాడు.
ధావన్ ధానాధన్: ఇక 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత టీమ్ఇండియాలో పూర్తిస్థాయి ఓపెనర్గా చోటు కోల్పోయిన శిఖర్ ధావన్.. గత రెండేళ్లలో 10 వన్డేలు, 10 టీ20లే ఆడాడు. అయితే, ఈ టీ20 లీగ్లో మెరుస్తున్నా.. మునుపటిలా తన స్థానాన్ని పదిలం చేసుకోలేకపోయాడు. ఇప్పుడు పంజాబ్ ఓపెనర్గా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు అతడు ఆడిన 8 మ్యాచ్ల్లో 43.14 సగటుతో మొత్తం 302 పరుగులు చేశాడు. అందులో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. ధావన్ ఇలాగే రెచ్చిపోతే మళ్లీ టీమ్ఇండియాలో మెరిసే అవకాశం ఉంది.
దినేశ్ కార్తీక్ సంచలనం: చాలాకాలంగా ఫామ్ కోల్పోయి.. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత అసలు టీమ్ఇండియాలోనే చోటు కోల్పోయిన ఆటగాడు దినేశ్ కార్తీక్. మరోవైపు ఈ టోర్నీలోనూ గత రెండు సీజన్లలో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. కానీ, ఈసారి బెంగళూరు తరఫున ఫినిషర్గా అదరగొడుతున్నాడు. సంచలన ఇన్నింగ్స్లతో ఆ జట్టుకు పలు విజయాలు అందించాడు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు అతడు ఆడిన 9 మ్యాచ్ల్లో 72 సగటుతో 216 పరుగులు చేశాడు. గత రెండు మ్యాచ్ల్లో విఫలమైనా కార్తీక్ బెంగళూరు ఫినిషర్గా మెరుస్తున్నాడనడంలో సందేహం లేదు. ఇకపై ఆడే మ్యాచ్ల్లోనూ ఆ జట్టును విజయతీరాలకు చేరిస్తే మళ్లీ టీ20 ప్రపంచకప్లో చోటు ఖాయమైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
నటరాజన్ మెరుస్తున్నాడు: హైదరాబాద్ పేసర్ టి.నటరాజన్ కూడా ఈ సీజన్లో బాగా ఆకట్టుకొంటున్నాడు. అతడు 2020లోనే టీమ్ఇండియా తరఫున అరంగేట్రం చేసినా గత రెండేళ్లలో కేవలం 2 వన్డేలు, 4 టీ20లు మాత్రమే ఆడాడు. అయితే, ఈ సీజన్లో తన బౌలింగ్తో ప్రత్యర్థులను బోల్తా కొట్టిస్తూ జట్టు విజయాల్లో పాలుపంచుకుంటున్నాడు. దీంతో అతడు ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్ల్లో 8.41 ఎకానమీతో 15 వికెట్లు తీసి టాప్ బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. నటరాజన్ ఇలాగే రాణిస్తే ప్రపంచకప్ జట్టులో ఉండే ఛాన్సుంది.
ఉమేశ్ యాదవ్ కూడా: సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్ కొంతకాలంగా టీమ్ఇండియాలో ఆడటం లేదు. గత రెండేళ్లలో నాలుగే టెస్టులు ఆడిన అతడు.. వన్డేలు, టీ20లైతే అసలే ఆడలేదు. దీంతో ఈ సీజన్కు ముందు అసలేమాత్రం అంచనాల్లేని బౌలర్గా ఉన్నాడు. కానీ, ఈ టీ20 లీగ్లో కోల్కతా జట్టులో లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు అతడు ఆడిన 8 మ్యాచ్ల్లో 7.43 ఎకానమీతో 11 వికెట్లు తీశాడు. దీంతో ఉమేశ్ ఇలాగే తన బౌలింగ్కు మరింత పదును పెడితే మళ్లీ భారత జట్టులో చేరే వీలుంది.
- ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
గాయం కారణంగా టీమ్కు దూరమైన స్టార్ పేసర్ షమీ.. తిరిగి జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. -
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి