Prithvi Shaw: బెంచ్పై ఉంచితే పరుగులు చేస్తాడా..? పృథ్వీషాకు అవకాశాలు ఇవ్వాలి: మాజీలు
కీలకమైనా ఆటగాడిని పక్కన పెట్టడం ఎందుకో దిల్లీ మేనేజ్మెంట్ చెబితే బాగుంటుందని మాజీ క్రికెటర్లు ప్రశ్నించారు. పృథ్వీషాను ఆడించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత యువ ఆటగాడు పృథ్వీ షాకు అవకాశం ఇవ్వకపోవడంపై మాజీ క్రికెటర్లు అసహనం వ్యక్తం చేశారు. గత సీజన్లో పెద్దగా రాణించనంత మాత్రాన ఆడించకపోవడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. మినీ వేలం సమయంలో దిల్లీ జట్టు పృథ్వీ షాను వదిలేయకుండా అట్టిపెట్టుకుంది. ఈ సీజన్లో ఇంకా ఆడించలేదు. దీనిపై భారత మాజీ క్రికెటర్ వసీమ్ జాఫర్, ఆసీస్ క్రికెట్ దిగ్గజం టామ్ మూడీ దిల్లీ మేనేజ్మెంట్కు కీలక సూచనలు చేశారు. రికీ భుయ్కు బదులు పృథ్వీ షాను తీసుకోవడం ఉత్తమమని వ్యాఖ్యానించారు.
‘‘భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఆటగాడిని డగౌట్కు పరిమితం చేయడం తెలివైన నిర్ణయం కాదు. గత సీజన్లో అతడు రాణించలేదన్నది వాస్తవమే. కానీ, డగౌట్లో కూర్చుంటే పరుగులు చేయడం కుదరదు కదా. అవకాశం ఇచ్చి.. సరిగ్గా ఆడకపోతే అప్పుడు పక్కన పెట్టినా అర్థముంటుంది. దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా ఆడిన రికీ భుయ్ ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాడు. రెండు మ్యాచుల్లో (3, 0) విఫలమయ్యాడు. రంజీ ట్రోఫీలో సాధించిన పరుగులకు.. అంతర్జాతీయ క్రికెట్తోపాటు ఐపీఎల్లో ఆటతీరుకు చాలా వ్యత్యాసం ఉంది. బౌన్సర్కు భుయ్ వికెట్ను సమర్పించాడు’’ అని టామ్ మూడీ వెల్లడించాడు.
ఇప్పటికీ ఆశ్చర్యమే: వసీమ్ జాఫర్
‘‘మినీ వేలం సమయంలో పృథ్వీషాను అట్టిపెట్టుకొని దిల్లీ అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు తొలి రెండు మ్యాచుల్లో ఆడించకుండా పక్కన పెట్టింది. ఎందుకు అతడిని రిజర్వ్ బెంచ్కే పరిమితం చేశారో అర్థం కావడం లేదు. దేశవాళీ క్రికెట్లో ముంబయి తరఫున ఆడాడు. అతడి ఫిట్నెస్ కూడా బాగానే ఉంది. అతడిని శిక్షించాలనుకోవడం మంచిది కాదు. ఇలా చేయడం వల్ల మ్యాచ్లను కూడా ఓడిపోవాల్సి వస్తోంది. టోర్నీలో ముందుకు వెళ్లే మార్గం కనిపించడం లేదు’’ అని వసీమ్ జాఫర్ తెలిపాడు. ఆదివారం చెన్నై జట్టుతో దిల్లీ తలపడనుంది. విశాఖపట్నం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. వైజాగ్ను దిల్లీ రెండో సొంతమైదానంగా ఎంపిక చేసుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇసుక అక్రమ తవ్వకాలు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
-
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్