IND vs PAK match ODI WC 2023: గంటలోపే టికెట్ల విక్రయం.. ఇలాంటి డ్రామాలు ఆడొద్దంటున్న ఫ్యాన్స్!
దాయాదుల పోరును (IND vs PAK) చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపడం సహజం. వరల్డ్ కప్లో (ODI World Cup 2023) అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్ జరగనుంది. అయితే, టికెట్ల విక్రయాల సందర్భగా ఫ్యాన్స్ నుంచి బీసీసీఐ, ఐసీసీ తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచ కప్లో భారత్ - పాకిస్థాన్ (IND vs PAK) మ్యాచ్ అక్టోబర్ 14న జరగనుంది. ఆ మ్యాచ్కు సంబంధించి కొన్ని టికెట్లను మంగళవారం సాయంత్రం ఆన్లైన్లో ఉంచారు. కేవలం గంట వ్యవధిలోనే సోల్డ్ ఔట్ అని సందేశం కనిపించడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే, కొన్ని టికెట్లను మాత్రమే అందుబాటులో ఉంచామని, సెప్టెంబర్ 3న మరో సేల్ ఉంటుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఇప్పుడు ఎన్ని టికెట్లను అందుబాటులో ఉంచారో బయటకు చెప్పాలని క్రికెట్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. టికెట్ల కోసం ఆన్లైన్ క్యూలోకి వచ్చినప్పటికీ.. టికెట్ జారీకి నాలుగు గంటల నుంచి నాలుగు నెలల అంచనా సమయం ఇవ్వడంతో ట్రోలర్స్ తమ కామెంట్లకు పదునుపెట్టారు.
ఒకసారి భారత్.. మరోసారి పాక్ లేకుండా ఆసియా కప్.. ఎందుకో తెలుసా?
‘‘ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ ఏర్పాటు చేయించిన టికెట్ బుకింగ్ సిస్టమ్ ఇలా ఉంది. దాదాపు రెండు గంటలపాటు వేచి ఉన్నా.. బుక్మై షోలో టికెట్ మాత్రం దొరకలేదు’’
‘‘టికెట్ల లైన్లోకి అనుమతించిన బుక్మైషో.. టికెట్ ఇవ్వడానికి మాత్రం నాలుగు నెలల కంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది. నేను అప్పుడు మ్యాచ్ హైలైట్స్ను చూడాలా..?’’
‘‘ఇదొక స్కాం. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ కోసం ఇంతటి చెత్త టికెట్ బుకింగ్ సిస్టమ్ను ఎంపిక చేశారు. భారత్ మ్యాచ్లకు సంబంధించి ఒక్క టికెట్ కూడా బుక్ చేసుకోలేకపోయా’’
‘‘టికెట్ బుకింగ్లో నాకెదురైన అత్యంత చెత్త అనుభవం ఇదే. ఈ వీడియోను చూస్తే మీకే అర్థమవుతుంది. మీరు టికెట్లను విక్రయించకూడదని నిర్ణయించుకుంటే ఇలాంటి డ్రామాలు చేయకుండా ఉండండి. మా భావోద్వేగాలతో ఆడుకోవడం దారుణం’’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!