ODI WORLD CUP: అప్పుడు తండ్రి.. ఇప్పుడు తనయుడు
తండ్రి క్రికెటర్ అయితే.. తనయడూ ఇదే మార్గంలో ఉండటం ఆశ్చర్యం కాదు కానీ.. వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీలో అప్పుడు తండ్రి, ఇప్పుడు కొడుకు ఆడటం మాత్రం ప్రత్యేకమైందే. ఇలాంటి ఘనతను నెదర్లాండ్స్కు చెందిన ఆటగాళ్లు సొంతం చేసుకున్నారు.
ప్రపంచకప్లో బాస్ డి లీడ్ మెరుపులు
1996 వన్డే ప్రపంచకప్ నాటి మాట. ఉపఖండంలో జరిగిన ఈ మెగా టోర్నీలో పాల్గొనడానికి తొలిసారి భారత్కు వచ్చింది నెదర్లాండ్స్ జట్టు. ఆడిన అయిదు మ్యాచ్ల్లోనూ చిత్తుగా ఓడిపోయింది. కానీ పెద్ద జట్లతో ఆడిన అనుభవాన్ని మాత్రం సంపాదించింది. ఈ జట్టులో ఉన్న టిమ్ డి లీడ్కు ఈ టోర్నీ ఓ మధుర స్మృతిగా మిగిలిపోయింది.
27 ఏళ్లు గడిపోయాయి. మళ్లీ భారత్లో ప్రపంచకప్ వచ్చింది. సుదీర్ఘ విరామం తర్వాత నెదర్లాండ్స్ భారత్లో అడుగుపెట్టింది. ఈసారి మరో డి లీడ్ వచ్చి పాకిస్థాన్తో తొలి మ్యాచ్లోనే సత్తా చాటాడు. అతడెవరో కాదు 1996 ప్రపంచకప్లో డచ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన టిమ్ డి లీడ్ తనయుడు బాస్ డి లీడ్. హైదరాబాద్లో పాక్తో మ్యాచ్లో బౌలింగ్లో రాణించిన ఈ కుర్రాడు.. బ్యాటింగ్లోనూ టాప్ స్కోరర్గా నిలిచాడు. జట్టు విజయం కోసం తుద వరకు పోరాడాడు. తండ్రి బాటలో నడిచిన తనయుడిగా నిలిచాడు.
భారత్పై అదరగొట్టి..
1996 ప్రపంచకప్తోనే టిమ్ డి లీడ్ ఆగిపోలేదు. 2003, 2007 ప్రపంచకప్పుల్లోనూ నెదర్లాండ్స్కు ప్రాతినిథ్యం వహించాడు. ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో జరిగిన 2003 ప్రపంచకప్లో అతడు తన ముద్ర వేశాడు. భారత్తో జరిగిన పోరులో టిమ్ డి లీడ్ 35 పరుగులకే 4 వికెట్లు తీసి సత్తా చాటాడు. అంతేకాదు సచిన్ తెందుల్కర్, ద్రవిడ్ వికెట్లు పడగొట్టి ఈ మ్యాచ్ను చిరస్మరణీయం చేసుకున్నాడు. బలమైన భారత్ 204 పరుగులకే పరిమితమైందంటే టిమ్ డి లీడే కారణం. ఆ మ్యాచ్లో భారత్ ఎలాగోలా గట్టెక్కినా టిమ్కే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ప్రస్తుతం టిమ్ డి లీడ్ కోచింగ్ ఇస్తున్నాడు. క్రీడా పరికరాల షాప్ నడుపుతున్నాడు.
తొలి మ్యాచ్లోనే..
ఇన్నేళ్లకు మళ్లీ అతడి తనయుడి రూపంలో ఆ ఇంట్లో నుంచి మరో ఆటగాడు ప్రపంచకప్ ఆడాడు. పాక్తో మ్యాచ్లో కప్ అరంగేట్రంలోనే బాస్ డి లీడ్ అదరగొట్టాడు. అప్పుడు తండ్రి మాదిరిగానే తాను కూడా 4 వికెట్లు పడగొట్టాడు. ఇంకో విశేషం ఏమిటంటే బ్యాటింగ్లోనూ రాణించి అర్ధసెంచరీ చేశాడు. ప్రపంచకప్ ఆరంభానికి ముందు నుంచే బాస్ డి లీడ్ మంచి ఫామ్లో ఉన్నాడు. కప్ క్వాలిఫయర్స్లో స్కాట్లాండ్పై 92 బంతుల్లోనే 123 పరుగులు చేయడమే కాదు 52 పరుగులకే 5 వికెట్లు పడగొట్టి ఒంటిచేత్తో డచ్ జట్టుకు విజయాన్ని అందించాడు. రాబోయే ప్రపంచకప్ మ్యాచ్ల్లోనూ అతడు కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి.
చరిత్రలో ఏడోసారి
ప్రపంచకప్లో తండ్రి, తనయుడు ఒక జట్టుకు ప్రాతినిధ్యం వహించడం చాలా అరుదు. అందుకే ఇన్నేళ్ల కప్ చరిత్రలో కేవలం ఏడు సందర్భాల్లోనే ఈ ఘటన చోటు చేసుకుంది. డాన్-డెరిక్ ప్రింగిల్, లాన్స్, క్రిస్ కెయిన్స్, క్రిస్, స్టువర్ట్ బ్రాడ్, జెఫ్ మార్ష్, షాన్ మార్ష్, మిచెల్ మార్ష్, రాడ్, టామ్ లేథమ్, కెవిన్, సామ్ కరన్.. ఇప్పుడు ఈ జాబితాలో టిమ్ డి లీడ్-బాస్ డి లీడ్ కూడా చేరారు.
-ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు