IND vs ENG: ఎలా ఫీల్ అవుతున్నానో చెప్పలేనన్న అశ్విన్.. ఎక్కడా వెనకడుగు వేయలేదు: యశస్వి జైస్వాల్
ఇంగ్లాండ్తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్లో టీమ్ఇండియా ఇన్నింగ్స్, 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కుల్దీప్ యాదవ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా, యశస్వి జైస్వాల్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా ఎంపికయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్తో జరిగిన ఐదో (ఆఖరి) టెస్టు మ్యాచ్లో టీమ్ఇండియా (Team India) ఇన్నింగ్స్, 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్ను రోహిత్ సేన 4-1 తేడాతో కైవసం చేసుకుంది. భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin)కు ఇది కెరీర్లో వందో టెస్టు కాగా.. మ్యాచ్లో 9 వికెట్లు పడగొట్టి చిరస్మరణీయం చేసుకున్నాడు. రెండు ఇన్నింగ్స్లో కలిపి 7 వికెట్లు పడగొట్టడమే కాకుండా తొలి ఇన్నింగ్స్లో 30 పరుగులు చేసిన కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు. సిరీస్లో అదరగొట్టిన యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు దక్కించుకున్నాడు. మ్యాచ్ అనంతరం వీరు మాట్లాడారు.
‘‘నా వందో టెస్టులో విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. నేను ఎలా ఫీల్ అవుతున్నానో ఇప్పుడు చెప్పలేను. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఎంతోమంది శుభాకాంక్షలు తెలియజేశారు. వారందరికీ కృతజ్ఞతలు. సిరీస్ ఆసాంతం బంతి వేగం, బౌలింగ్ యాక్షన్లో మార్పులు చేసుకున్నా. భారతదేశం భిన్నమైనది. ప్రతీ మైదానం ఏదో ఒక సవాలు విసురుతుంది. పిచ్ స్పిన్కు అనుకూలించినందుకు హ్యాపీగా ఉంది. ఈ మ్యాచ్, రాంచీలో రెండో ఇన్నింగ్స్లో ప్రదర్శన సంతృప్తినిచ్చింది. నేను ప్రయోగాలు చేస్తుంటా. వాటి గురించి వచ్చే మంచి ఫీడ్బ్యాక్ని స్వీకరిస్తా. ప్రయత్నిస్తే తప్ప నేర్చుకోలేను. ఏదైనా ప్రయత్నించగలనని నాకు నమ్మకం ఉంటే, వెనక్కి తగ్గను. కొత్త ప్రయోగాలు చేయడం, నిరంతరం నేర్చుకోవడం నాకు ఎంతో ఉపయోగపడింది. కొత్త బంతితో ఈ రోజు నాకు కొంత బౌన్స్ లభించింది. తొలి ఇన్నింగ్స్లో కుల్దీప్ యాదవ్ దానిని సద్వినియోగం చేసుకోగలిగాడు. కుల్దీప్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అతని చేతుల్లోంచి బంతి వస్తున్న తీరు నమ్మశక్యంగా లేదు’’- అశ్విన్
‘‘నేను ఇప్పటివరకు ఆడిన సిరీస్ల్లో నా అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన ఇదే. గత కొన్నాళ్లుగా నేను కష్టపడిన దానికి ప్రతిఫలం దక్కుతోంది. రాంచీ టెస్టులో బాగా బౌలింగ్ చేశాను. అక్కడ బౌలింగ్ చేసిన తీరు అద్భుతంగా ఉంది. రాంచీలో స్టోక్స్, జాక్ క్రాలీలను ఔట్ చేయడం ఆనందాన్నిచ్చింది. గుడ్ లెంగ్త్లో బౌలింగ్ చేయడంపై ఫోకస్ పెడతాను. ఈ ఫార్మాట్లో స్పిన్నర్కు ఇది చాలా ముఖ్యం. బ్యాటర్ ఏమి చేయడానికి ప్రయత్నిస్తున్నాడనే దాని గురించి ఎక్కువగా ఆలోచించను. నా రిథమ్ నాకు బాగా నచ్చింది. బ్యాటింగ్లో నా వంతు పాత్ర పోషించినందుకు సంతోషంగా ఉంది. ఈ క్రెడిట్ బ్యాటింగ్ కోచ్కి దక్కుతుంది’’- కుల్దీప్ యాదవ్
‘‘సిరీస్ను నిజంగా ఆస్వాదించాను. సిరీస్ అంతటా నేను ఆడిన తీరుతో సంతోషంగా ఉన్నాను. నేను ఒక బౌలర్ను లక్ష్యంగా చేసుకోవాలని భావిస్తే అతడి బౌలింగ్లో బాదడం మొదలెడతా. అదే ప్లాన్ అమలుచేశా. ఎక్కడా వెనకడుగు వేయలేదు. ప్రతీ మ్యాచ్లో ఒకేలా ఆడకుండా ఒక్కో మ్యాచ్లో ఆ సమయానికి తగినట్టుగా ఆడేందుకు ప్రయత్నిస్తా. జట్టు గెలవడానికి నేను ఎలాంటి పాత్ర పోషించాలనే దాని గురించి ఎల్లప్పుడూ ఆలోచిస్తా’’- యశస్వి జైస్వాల్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
తక్కువ స్ట్రైక్ రేట్ విషయంలో విరాట్ కోహ్లీపై వస్తున్న విమర్శలను కోల్కతా మెంటార్ గౌతమ్ గంభీర్ కొట్టిపారేశాడు. -
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. సుదీర్ఘంగా ఐపీఎల్లో కొనసాగుతున్న అతడిని చూసేందుకు అభిమానులు భారీగా స్టేడియాలకు తరలి వస్తున్న సంగతి తెలిసిందే. -
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) కోసం జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్టర్లు సిద్ధమవుతున్నారు. మే 1లోపు స్క్వాడ్ను వెల్లడించాల్సి ఉంది. -
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
ప్లేఆఫ్స్కు చేరువైన తొలి జట్టుగా రాజస్థాన్ నిలవనుంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అందరికంటే ముందుంది. తాజాగా లఖ్నవూపై విజయభేరి మోగించింది. -
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
ఆర్చరీ ప్రపంచ కప్లో టీమ్ఇండియా హవా కొనసాగుతోంది. ఐదు స్వర్ణాలను గెలిచి అదరగొట్టేసింది. రికర్వ్ విభాగంలోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. -
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్
దిల్లీ భారీ స్కోరు చేసి విజయం సాధించడంలో ఆస్ట్రేలియా కుర్రాడు జేక్ ఫ్రేజర్ కీలక పాత్ర పోషించాడు. దూకుడైన ఆటతీరుతో ముంబయి బౌలర్లను వణికించాడు. -
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
దిల్లీ చేతిలో ఓటమితో ముంబయి ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు రిషభ్ పంత్ సేన ఛాన్స్లు మెరుగయ్యాయి. -
రాయల్స్.. రయ్మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్ప్రి సిరీస్లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.