ODI WC 2023: పడితేనే గెలిచేది.. ప్రపంచకప్లో ఫీల్డింగే కీలకం!
క్రికెట్లో ఒక్క క్యాచ్ చేజారినా.. మిస్ ఫీల్డింగ్ అయినా ఫలితమే తారుమారయ్యే ప్రమాదం ఉంది. అలాంటిది వన్డే ప్రపంచకప్లో (ODI World Cup 2023) ఫీల్డింగ్ కీలక పాత్ర పోషించనుంది.
‘క్యాచెస్ విన్ మ్యాచెస్’ అనేది క్రికెట్లో ప్రాచుర్యంలో ఉన్న నానుడి. పెద్ద టోర్నీల్లో ఈ మాట అక్షర సత్యం. ఎందుకంటే కీలక సమయాల్లో క్యాచ్లు నేలపాలు చేసి మ్యాచ్లే పోగొట్టుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రస్తుత ఐసీసీ వన్డే ప్రపంచకప్లోనూ ఫీల్డింగ్ కీలకపాత్ర పోషించనుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాతో పాటు భారత్ కూడా ఫీల్డింగ్లో మెరుగ్గా ఉంది.
జాంటీ రోడ్స్ గుర్తున్నాడా!
1992 వన్డే ప్రపంచకప్ పేరు ఎత్తితే జాంటీ రోడ్సే గుర్తొస్తాడు. ఈ దక్షిణాఫ్రికా స్టార్ వేసిన ముద్ర అలాంటిది. అద్భుత ఫీల్డింగ్ విన్యాసాలతో ‘గాల్లోకి ఎగురుతోంది మనిషా పక్షా’ అన్న అనుమానాన్ని కలిగించిన టాప్ ఫీల్డర్ అతడు. ఈ కప్లోనే పాకిస్థాన్ స్టార్ ఇంజమామూల్ హక్ను రనౌట్ చేసిన తీరు ఎప్పటికీ నిలిచిపోతుంది. అందుకే వాల్ పేపర్లలో అప్పుడు రోడ్స్ గాల్లోకి ఎగిరి ఫుల్ లెంగ్త్ డైవ్ చేసిన ఫొటోనే ప్రపంచకప్కు ప్రచార చిత్రంగా వాడేవాళ్లు. ఆ తర్వాత ఎందరో ఫీల్డర్లు వచ్చినా రోడ్స్ను మించలేకపోయారు. అతడిని ఆదర్శంగా తీసుకుని దక్షిణాఫ్రికాలో చాలామంది మెరుపు ఫీల్డర్లు వచ్చారు. కానీ దురదృష్టం ఏమిటంటే ఆ జట్టు ఇప్పటిదాకా ప్రపంచకప్ను ముద్దాడలేకపోయింది.
మనోళ్లూ తక్కువేం కాదు
గత పదేళ్లలో భారత క్రికెట్ ఫీల్డింగ్ ప్రమాణాలు బాగా పెరిగాయి. ముఖ్యంగా విరాట్ కోహ్లి భారత ఫీల్డర్లకు ఆదర్శంగా మారిపోయాడు. అద్భుతమైన ఫిట్నెస్కు మారుపేరైన విరాట్.. ఎన్నో సంచలన క్యాచ్లు పట్టాడు. మెరుపు విన్యాసాలతో రనౌట్లు చేశాడు. ఇక భారత ఫీల్డింగ్లో ర్యాంకింగ్స్ ఇస్తే మాత్రం రవీంద్ర జడేజాదే అగ్రస్థానం. యువరాజ్సింగ్, సురేశ్ రైనా తర్వాత జట్టులో మెరుపు ఫీల్డర్గా జడేజానే పేరు దక్కించుకున్నాడు. బౌలింగ్, బ్యాటింగ్తో పాటు ఫీల్డింగ్లోనూ సత్తా చాటాల్సిన బాధ్యత ఈ ఆల్రౌండర్పై ఉంది. ముఖ్యంగా ఎంతో కఠినంగా ఉండే యోయో టెస్టులు పెట్టి జట్టులోకి ఆటగాళ్లను ఎంపిక చేస్తున్న నేపథ్యంలో మైదానంలో మన ఫీల్డర్లు చురుగ్గా కదులుతున్నారు. అదిరే క్యాచ్లు పడుతున్నారు. రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ సిరాజ్ లాంటి ఒకటి రెండు వీక్ లింక్లు ఉన్నా.. ఫీల్డింగ్లో భారత్ది మంచి జట్టే. మరి ప్రపంచకప్లో ఈ విభాగంలో మనోళ్లు ఎలా రాణిస్తారో చూడాలి.
వీళ్లను ఓ కంట కనిపెట్టండి
గ్లెన్ మ్యాక్స్వెల్ (ఆస్ట్రేలియా), స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా), డేవిడ్ మిల్లర్ (దక్షిణాఫ్రికా), బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్), గ్లెన్ ఫిలిప్స్ (న్యూజిలాండ్), ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్), జో రూట్ (ఇంగ్లాండ్), శాంట్నర్ (న్యూజిలాండ్), షాదాబ్ఖాన్ (పాకిస్థాన్) మెరుపు ఫీల్డర్ల జాబితాలో ఉన్నారు. బౌండరీ లైన్ దగ్గర మెరుపు వేగంతో ఫీల్డింగ్ చేస్తూ చాలా పరుగులు ఆపుతాడు మ్యాక్స్వెల్. ఇక స్లిప్, కవర్స్లో స్టీవ్ స్మిత్ స్టన్నింగ్ క్యాచ్లతో అదరగొడతాడు. మిల్లర్, స్టోక్స్, ఫిలిప్స్ గ్రౌండ్ ఫీల్డింగ్ చూస్తే కళ్లు చెదరాల్సిందే. ఒంటి చేత్తో వీళ్లు అందుకున్న మెరుపు క్యాచ్లు చాలానే ఉన్నాయి. గత ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా బ్యాటర్ ఫెలుక్వాయో క్యాచ్ను బౌండరీ లైన్ దగ్గర స్టోక్స్ అందుకున్న తీరుకు అభిమానులు ఫిదా అయిపోయారు. ఇక తన బౌలింగ్లోనే బౌల్ట్, శాంట్నర్ కొన్ని అద్భుతమైన క్యాచ్లు పట్టారు. రూట్ కూడా మంచి స్లిప్ ఫీల్డర్. తొలి 15 ఓవర్లలో అతడు కీలకంగా ఉంటాడు. చెత్త ఫీల్డింగ్ అంటే గుర్తొచ్చే జట్టు పాకిస్థాన్. చాలా తేలికైన క్యాచ్లను కూడా నేలపాలు చేస్తుంటుందీ జట్టు. కానీ ఆ జట్టు స్పిన్నర్ షాదాబ్ఖాన్ సహచరులకు భిన్నం. మెరుపు ఫీల్డింగ్ చేయడంతో పాటు కొన్ని స్టన్నింగ్ క్యాచ్లు పడుతుంటాడు.
-ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్