Team India: మరో కోహ్లీ కావాల్సిందే.. లేదంటే తయారు చేయాల్సిందే!
Who is next kohli: టెస్టుల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయడానికి టీమ్ ఇండియా మరో ప్లేయర్ను రెడీ చేయకతప్పదు. ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ ఈ విషయాన్ని మరోసారి గుర్తు చేసింది.
టీమ్ ఇండియా బ్యాటింగ్ లైనప్లో ఓ పేరు ఉంటే... ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుంది. అదే విరాట్ కోహ్లీ. టెస్టుల్లో చాలా ఏళ్లుగా నాలుగో స్థానం(సెకండ్ డౌన్)లో బ్యాటింగ్కి దిగి జట్టును విజయ పథాన నడిపించాడు. అయితే ఆ స్థానంలో నిలకడగా ఆడే మరో ప్లేయర్ దొరకడం లేదు. ఎవరైనా కుదురుకొని కొన్నాళ్లు ఆడినా.. ఆ తర్వాత ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. దీంతో ‘నాలుగులో ఎవరు?’ అనే ప్రశ్న అభిమానుల్ని తొలిచేస్తోంది.
ఇదీ కోహ్లీ అంటే...
145 ఇన్నింగ్స్ల్లో 7303 పరుగులు. అందులో 25 సెంచరీలు, 21 అర్ధసెంచరీలు. టెస్టుల్లో నాలుగో స్థానంలో ఆడి విరాట్ కోహ్లీ (Virat Kohli) సాధించిన గణాంకాలివి. ఆటగాడి నాణ్యతను లెక్కించడానికి, ఆ స్థానం విలువ చెప్పడానికి ఇవి చాలు. చాలా ఏళ్లుగా కోహ్లీ ఇదే స్థానంలో ఆడుతున్నాడు. కానీ, ఇంగ్లాండ్తో టెస్టుకు వ్యక్తిగత కారణాల వల్ల దూరమయ్యాడు. దీంతో ఆ ప్లేస్ని భర్తీ చేయడానికి టీమ్ ఇండియా మూడు ప్రయత్నాలు చేసింది. అందులో ఒకటి తప్ప మిగిలిన రెండూ విఫలమయ్యాయి. దీంతో ‘నాలుగు కోసం మరో కోహ్లీ కావాలి’ అనే పరిస్థితి వచ్చింది.
ముగ్గురు వచ్చారు కానీ..
ఇంగ్లాండ్ టెస్టు సిరీస్లో.. తొలి టెస్టులో నాలుగో స్థానంలో కేఎల్ రాహుల్ (KL Rahul) వచ్చాడు. తొలి ఇన్నింగ్స్లో 86 పరుగులతో రాణించగా.. రెండో ఇన్నింగ్స్లో (22) నిరాశపరిచాడు. గాయం కారణంగా అతడు జట్టుకు దూరమవ్వడంతో ఆ ప్లేస్లో శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) వచ్చాడు. రెండు ఇన్నింగ్స్లో వరుసగా 27, 29 పరుగులతో నిరాశపరిచాడు. ఈ నేపథ్యంలో మూడో టెస్టుకు అయ్యర్ దూరమవుతాడు అనే వార్తలొచ్చాయి. అదే సమయంలో గాయపడటంతో కొత్త కుర్రాడు రజత్ పటీదార్ (Rajat Patidar)ను తీసుకొచ్చారు. మూడు, నాలుగు టెస్టుల్లో రజత్ నంబర్-4గా బ్యాటింగ్కు దిగినా.. ఏమంత ఆకట్టుకోలేకపోయాడు. అతని స్కోర్లు వరుసగా 5, 0, 17, 0. దీంతో ఐదో మ్యాచ్కు కష్టమే. ఇచ్చిన రెండు ఛాన్స్లను చేజార్చుకొని డగౌట్కి పరిమితమయ్యాడు.
ఇలా సెకండ్ డౌన్ కోసం టీమ్ ఇండియా తీసుకొచ్చిన ముగ్గురిలో ఒకరు విఫలమవ్వగా, ఇద్దరు గాయాల కారణంగా దూరమయ్యారు. నాలుగో టెస్టులో మిడిల్ ఆర్డర్ ఫెయిలైంది. వచ్చినవాళ్లు వచ్చినట్లు పెవిలియన్కు వెళ్లిపోయారు. ఆ సమయంలో ధ్రువ్ జురెల్ (90) అడ్డుపడకుంటే.. భారత్ ఇబ్బందిపడేదే. మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో సరైన బ్యాటర్ లేకపోవడమే ఈ పరిస్థితికి కారణం అనేది విశ్లేషకుల మాట. దీంతో ఆఖరి టెస్టులో ఆ ప్లేస్లో ఎవరొస్తారు అనే చర్చ మొదలైంది. డగౌట్లో ఉన్నవాళ్లను చూస్తే దేవదత్ పడిక్కల్ కనిపిస్తున్నాడు. మరోవైపు కేఎల్ రాహుల్ ఆఖరి టెస్టుకు జట్టులోకి వస్తాడు అని కూడా అంటున్నారు. అయితే ఇది తాత్కాలిక ఆలోచన మాత్రమే. పూర్తిస్థాయిలో సెకండ్ డౌన్ బ్యాటర్ అయితే టీమ్ ఇండియాకు అవసరం.
టీమ్ ఏం చేయాలి?
కోహ్లీ ఉండగా... ఆ స్థానంలో వేరే బ్యాటర్ను పంపే పరిస్థితి రాదు. అయితే, 35 ఏళ్లు దాటిన అతడు ఇంకెన్నాళ్లు టెస్టు క్రికెట్ ఆడతాడో చెప్పలేం. ఈ నేపథ్యంలో అర్జెంట్గా మరో విరాట్ అవసరం పడింది. అతడిలా నిలకడగా క్రీజులో గంటల తరబడి ఉండి.. వేల కొద్దీ పరుగులు చేయాలి. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ లాంటివాళ్లు కుదురుకుంటే జట్టుకు పెద్దగా ఇబ్బంది ఉండదు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే టీమ్ మేనేజ్మెంట్ కొత్త కుర్రాడిని వెతకాలి. లేదంటే ఉన్నవాళ్లను ఆ స్థానం కోసం సానపెట్టాలి. ప్రతిభాన్వేషణలో హెడ్ కోచ్ ద్రవిడ్ దిట్ట. మరి ఎవరిని ‘నాలుగు’ కోసం సిద్ధం చేస్తారో చూడాలి.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్