Neeraj Chopra - Nadeem: భారత్- పాక్ స్టార్లు.. ఆటలో కుస్తీ.. బయట దోస్తీ
దాయాదుల మధ్య పోరంటే అది ఏ క్రీడైనాసరే ఆసక్తికరంగానే ఉంటుంది. అది క్రికెట్ అయినా.. జావెలిన్ త్రో అయినా సరే. తాజాగా ప్రపంచ అథ్లెట్లిక్స్లో స్వర్ణ, రజత పతకాలను భారత్, పాకిస్థాన్ అథ్లెట్లు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
నీరజ్, నదీమ్ మధ్య స్నేహం
ఏ క్రీడలోనైనా.. వేదిక ఎక్కడైనా.. భారత్, పాకిస్థాన్ (IND vs PAK) మధ్య పోటీ అంటే అమితమైన ఆసక్తి ఉంటుంది. ఈ దాయాది దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఆటల్లో ఇలాంటి వాతావరణం ఏర్పడింది. కేవలం క్రికెట్ అనే కాదు.. ఏ క్రీడలోనైనా ఈ చిరకాల ప్రత్యర్థులు తలపడుతుంటే ప్రపంచం మొత్తం చూస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడు జావెలిన్ త్రోలోనూ ఇలాంటి పోటీనే ఏర్పడుతోంది. భారత స్టార్ నీరజ్ చోప్రాకు, పాకిస్థాన్ సంచలనం అర్షద్ నదీమ్ సవాలు విసురుతున్నాడు. తాజాగా ప్రపంచ ఛాంపియన్షిప్స్లో నీరజ్ పసిడి గెలవగా.. నదీమ్ రజతం ముద్దాడాడు. అయితే తమ శత్రుత్వం పోటీ వరకు మాత్రమే అంటూ.. నీరజ్, నదీమ్ బయట స్నేహితులుగా ఉండడం విశేషం.
అప్పటి నుంచి
జావెలిన్ త్రోలో నీరజ్, నదీమ్ మధ్య పోటీ ఇప్పటిది కాదు. 2016 దక్షిణాసియా క్రీడల నుంచి ఇది మొదలైంది. అప్పుడు జావెలిన్ త్రోలో నీరజ్ (82.23మీ) స్వర్ణం, నదీమ్ (78.33మీ) కాంస్యం గెలిచారు. అదే ఏడాది ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో నీరజ్ (77.60మీ) రజతం గెలిస్తే, నదీమ్ (73.40మీ) కాంస్యం సాధించాడు. 2018 ఆసియా క్రీడల్లో నీరజ్ (88.06మీ), నదీమ్ (80.75మీ) వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. ఇక 2020 టోక్యో ఒలింపిక్స్ (2021)లోనూ ఈ ఇద్దరి పోరు ఆసక్తి రేపింది. నీరజ్ (87.58మీ) స్వర్ణంతో చరిత్ర సృష్టించగా.. నదీమ్ (84.62మీ) మాత్రం అయిదో స్థానంతో సంతృప్తి చెందాడు. నిరుడు ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో నీరజ్ రజతం గెలవగా.. నదీమ్ అయిదో స్థానానికే పరిమితమయ్యాడు. కానీ 2022 కామన్వెల్త్ క్రీడల్లో మాత్రం నదీమ్ ఏకంగా 90.18 మీటర్ల దూరం ఈటెను విసిరి క్రీడల రికార్డుతో పాటు పసిడి పట్టేశాడు. గాయం కారణంగా నీరజ్ ఈ క్రీడలకు దూరమయ్యాడు. కానీ 90 మీటర్ల దూరాన్ని చేరుకునేందుకు నీరజ్ ప్రయత్నిస్తున్న సమయంలోనే నదీమ్ ఆ మార్కు చేరుకోవడం గమనార్హం. ఇప్పుడు మోచేతి, మోకాలి గాయాల నుంచి కోలుకుని ప్రపంచ ఛాంపియన్షిప్స్లో పసిడి కోసం నీరజ్కు గట్టిపోటీనిచ్చిన నదీమ్.. చివరకు రజతం అందుకున్నాడు.
మిత్రులుగా
నీరజ్, నదీమ్ మధ్య ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం ఉంది. నీరజ్, తాను కలిసి ఇప్పుడు ప్రపంచ జావెలిన్ త్రోలో ఆధిపత్యం చలాయిస్తున్నామని నదీమ్ చెప్పడం అందుకు నిదర్శనం. ఒకప్పుడు ఐరోపా అథ్లెట్ల హవా కొనసాగిన జావెలిన్ త్రోలో ఇప్పుడు నీరజ్తో కలిసి పెత్తనం ప్రదర్శిస్తున్నందుకు ఆనందంగా ఉందని అతనన్నాడు. ఇక నదీమ్ పట్ల కూడా నీరజ్ ఎప్పుడూ గౌరవభావంతోనే మెలిగాడు. ప్రపంచ ఛాంపియన్షిప్స్లో పోటీల అనంతరం ఫొటో కోసం అక్కడ లేని నదీమ్ను పిలిచిన నీరజ్ అందరి హృదయాలను గెలిచాడు. వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్ స్వర్ణం కోసం కూడా ఈ ఇద్దరి మధ్యనే ప్రధాన పోటీ ఉండనుంది.
ఆటలో శిఖరాలకు
అథ్లెటిక్స్లో ప్రపంచ ఛాంపియన్.. అదంతా ఒకప్పుడు భారత్కు కలగా ఉండేది. కానీ ఇప్పుడు నీరజ్ రూపంలో వెలుగు వచ్చింది. చీకటి మార్గంలో ధైర్యంగా అడుగులు వేస్తూ.. అథ్లెటిక్స్లో ఒలింపిక్స్, ప్రపంచ ఛాంపియన్షిప్స్ పతకాలు సాధించడం ఇంత సులువా అని చాటుతూ.. నీరజ్ చోప్రా చరిత్ర సృష్టిస్తున్నాడు. తాజాగా ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణంతో ఆ ఘనత సాధించిన తొలి భారత అథ్లెట్గా నిలిచాడు. అయితే మనకు నీరజ్ లాగే.. పాకిస్థాన్కు అర్షద్ నదీమ్. ప్రపంచ ఛాంపియన్షిప్స్లో అతను పాకిస్థాన్కు మొట్టమొదటి పతకం అందించాడు. మొదట నదీమ్ క్రికెటర్గా ఎదగాలనుకున్నాడు. కానీ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు, సోదరుల సలహాతో జావెలిన్ చేతబట్టి అంచెలంచెలుగా ఎదిగాడు.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన