ODI WC 2023: స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్ నుంచి వరల్డ్ కప్ నెట్ బౌలర్గా..!
వరల్డ్ కప్లో టైటిల్ ఫేవరెట్లకు షాక్ ఇచ్చే సత్తా నెదర్లాండ్స్కూ ఉంది. భారత్కు చేరుకున్న ఆ జట్టు తమ సాధన కోసం నలుగురిని నెట్ బౌలర్లుగా ఎంపిక చేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: మరో రెండు వారాల్లో భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) సమరం ప్రారంభం కానుంది. నెదర్లాండ్స్ క్రికెట్ జట్టు ఇప్పటికే ఇక్కడకు చేరుకుని సాధనను ముమ్మరం చేసింది. అందుకోసం భారత్కు చెందిన నలుగురిని నెట్ బౌలర్లుగా నెదర్లాండ్స్ జట్టు ఎంపిక చేసుకుంది. వీరిలో చెన్నైకి చెందిన లోకేశ్ కుమార్ ఉన్నాడు. ఇందులో ప్రత్యేకత ఏమంటే..? అతడు స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్ కావడం గమనార్హం.
నెట్ బౌలర్ల కోసం భారత్వ్యాప్తంగా నెదర్లాండ్స్ జట్టు వెతుకులాట నిర్వహించింది. దానికోసం భారీగా ప్రకటన ఇచ్చింది. దేశం నలుమూలల నుంచి దాదాపు 10 వేల మంది తమ బౌలింగ్ వీడియోలను పంపించారు. అన్నీ పరిశీలించిన నెదర్లాండ్స్ మేనేజ్మెంట్ నలుగురిని సెలెక్ట్ చేసుకుంది. తమ నెట్ బౌలర్లను పరిచయం చేస్తూ నెదర్లాండ్స్ టీమ్ ట్విటర్ వేదికగా (ప్రస్తుతం ఎక్స్) వీడియోను షేర్ చేసింది. అందులో చెన్నైకి చెందిన లోకేశ్ కుమార్ స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే క్రికెటర్గా రాణిస్తున్నాడని ఓ జాతీయ వెబ్సైట్ కథనం వెల్లడించింది. నెదర్లాండ్స్ జట్టుకు నెట్బౌలర్గా ఎంపిక కావడంపై లోకేశ్ కుమార్ ఆనందం వ్యక్తం చేశాడు.
‘‘చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం. దాదాపు నాలుగేళ్లపాటు డివిజన్-5 విభాగంలో ఆడాను. ఆ తర్వాత ఇండియన్ ఆయిల్ జట్టుకు డివిజన్-4 క్రికెట్లోకి రిజిస్టర్ చేసుకున్నా. ఇప్పుడు నెదర్లాండ్స్ జట్టుకు వరల్డ్ కప్ సందర్భంగా నెట్బౌలర్గా ఎంపిక కావడం మాటల్లో వర్ణించలేనంత ఆనందంగా ఉంది. నా ప్రతిభను గుర్తించినందుకు ధన్యవాదాలు’’ అని లోకేశ్ వ్యాఖ్యానించాడు. నెదర్లాండ్స్ అక్టోబర్ 6 నుంచి పాకిస్థాన్తో తొలి మ్యాచ్తో వన్డే ప్రపంచకప్ సమరం ప్రారంభించనుంది. అయితే, అంతకుముందు భారత్తో (అక్టోబర్ 3న) వార్మప్ మ్యాచ్లో తలపడనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శాంసన్ మెరిసినా.. మురిసింది దిల్లీనే
27 బంతుల్లో 60 పరుగులు చేయాలి. తక్కువేమీ కాదు. కానీ కెప్టెన్ సంజు శాంసన్ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతుండడంతో రాజస్థాన్ రాయల్స్ రేసులోనే ఉంది. 222 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. అప్పుడు ఒత్తిడంతా దిల్లీపైనే. -
ఐపీఎల్.. మళ్లీ భారమేనా?
ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్లో తీరిక లేకుండా మ్యాచ్లు ఆడడం.. ఆ వెంటనే టీ20 ప్రపంచకప్ వేటకు వెళ్లడం.. అలసటకు గురైన ఆటగాళ్లు అక్కడ అంతంతమాత్రంగా ఆడడం.. టీమ్ఇండియా పోరాటం మధ్యలోనే ముగిసిపోవడం.. గత కొన్ని పర్యాయాల నుంచి ఇదే వరస! -
నేడు ఫ్రాన్స్ చేరనున్న ఒలింపిక్ జ్యోతి
ఒలింపిక్ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే జ్యోతి రిలే.. ఆతిథ్య దేశం ఫ్రాన్స్లో అడుగుపెట్టనుంది. బుధవారం మార్సె దక్షిణ సముద్ర తీర ప్రాంతానికి చేరుకోనుంది. ఏప్రిల్ 16న గ్రీస్లోని ప్రాచీన ఒలింపియాలో మొదలైన ఈ రిలే.. సముద్ర మార్గం గుండా ఏథెన్స్ను దాటి మార్సెకి చేరువైంది. -
వారిద్దరి విషయంలో ద్రవిడ్కు ప్రణాళికలు ఉండాలి
భారత కెప్టెన్ రోహిత్శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి విషయంలో టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్కు స్పష్టమైన ప్రణాళికలు ఉండాలని దిగ్గజ క్రికెటర్ బ్రయాన్ లారా అభిప్రాయపడ్డాడు. -
భారత్కు ఏడు స్వర్ణాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు మరో ఏడు పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. పోటీల చివరిరోజు ప్రీతి (54 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ఆకాశ్ గోర్కా (60 కేజీలు), పూనమ్ (57 కేజీలు), ప్రాచి (63 కేజీలు), ముస్కాన్ (75 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు) ఫైనల్లో విజయాలు అందుకున్నారు. -
బంగ్లాదే సిరీస్
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్ను బంగ్లాదేశ్ మరో రెండు మ్యాచ్లు ఉండగానే సొంతం చేసుకుంది. మంగళవారం మూడో టీ20లో 9 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. -
కేకేఆర్ ఆటగాళ్ల ఇక్కట్లు
ప్రతికూల వాతావరణం కారణంగా కోల్కతా నైట్రైడర్స్ ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. లఖ్నవూ నుంచి కోల్కతా వెళ్లాల్సిన క్రికెటర్ల ప్రత్యేక విమానాన్ని పదే పదే మళ్లించడంతో వారు ఒక రాత్రి వారణాసిలో గడపాల్సి వచ్చింది. -
ఒత్తిడిలోనూ రోహిత్ మంచి నిర్ణయాలు
ఒత్తిడి సమయాల్లోనూ కెప్టెన్ రోహిత్ శర్మ మంచి నిర్ణయాలు తీసుకుంటాడని భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. టీ20 ప్రపంచకప్లో భారత్కు రోహిత్ కీలకమవుతాడని తెలిపాడు. -
సమవుజ్జీల సమరం
11 మ్యాచ్లు.. 6 విజయాలు.. 5 ఓటములు.. 12 పాయింట్లు. ఇప్పటి వరకు ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ జట్ల ప్రదర్శన ఇది. స్వల్ప నెట్ రన్రేటు తేడాతో పాయింట్ల పట్టికలో నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్న సమవుజ్జీలు మరో పోరుకు సిద్ధమయ్యాయి.