Kolkata Knight Riders: ఇటు షారుక్.. అటు గంభీర్
ఐపీఎల్ 17వ సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ (Kolkata Knight Riders)ఛాంపియన్గా నిలిచింది. ఆ జట్టు సక్సెస్ కావడంలో మెంటార్ గంభీర్, యజమాని షారుక్ ఖాన్లు తెర వెనుక కీలకపాత్ర పోషించారు.
ఐపీఎల్ ఫ్రాంఛైజీలు వీళ్లను చూసి నేర్చుకోవాల్సిందెంతో
అభిమానులను ఉర్రూతలూగిస్తూ సాగిన ఇండియన్ ప్రిమియర్ లీగ్ (IPL) 17వ సీజన్ ఏకపక్ష ఫైనల్తో ముగిసింది. సీజన్ అంతటా నిలకడగా ఆడిన కోల్కతా నైట్రైడర్స్ (Kolkata Knight Riders).. దూకుడుకు మారుపేరుగా నిలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ను చిత్తుగా ఓడించి టైటిల్ను ఎగురేసుకుపోయింది. ఐపీఎల్లో ఇంత నిలకడగా ఆడి కప్పు గెలిచిన జట్లు అరుదుగా కనిపిస్తాయి. ఈ విజయంలో ఆటగాళ్లది ఎంత ముఖ్య పాత్రో తెర వెనక వ్యక్తులు కూడా అంతే కీలకం. ప్రధానంగా నైట్రైడర్స్ మెంటార్గా ఈ సీజన్లోనే బాధ్యతలు అందుకున్న గౌతమ్ గంభీర్ (Gautam Gambhir), యజమాని షారుక్ ఖాన్ (Shah Rukh Khan)ల మీద ప్రశంసలు కురుస్తున్నాయి. వాళ్లు తెర వెనక పోషించిన పాత్ర ఆటగాళ్లలో ఒక ప్రేరణ కలిగించిందనడంలో సందేహం లేదు.
టీ20 క్రికెట్లో కోచ్ పాత్ర పరిమితమే. ఇక ఫ్రాంఛైజీ క్రికెట్లో మెంటార్ అంటే నామమాత్రం అనే భావిస్తారు. సచిన్, గంగూలీ, లక్ష్మణ్ లాంటి వాళ్లు ఐపీఎల్లో మెంటార్ పాత్రల్లో ఏదో ఉన్నాం అంటే.. ఉన్నాం అనిపించారు. ఎక్కువగా క్రికెట్ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నట్లు కనిపించలేదు. కానీ గౌతమ్ గంభీర్ మాత్రం అలా కాదు. గత రెండేళ్లు లఖ్నవూ మెంటార్గా మంచి ఫలితాలు రాబట్టిన అతను.. ఈ సీజన్లో తాను ఒకప్పుడు ఆటగాడిగా, కెప్టెన్గా ప్రాతినిధ్యం వహించిన కోల్కతా నైట్రైడర్స్కు మారి అక్కడ బలమైన ముద్రే వేశాడు. ఎప్పుడో 2017లో తాను కెప్టెన్గా ఉండగా స్పిన్నరైన సునీల్ నరైన్ (Sunil Narine)ను ఓపెనర్గా పంపి ప్రయోగం చేసిన గంభీర్.. ఈసారి ఆ ఆలోచనను తిరిగి అమల్లోపెట్టాడు. మొత్తంగా జట్టును సమష్టిగా నడిపించడంలోనూ ముఖ్య పాత్ర పోషించారు. కోల్కతాకు నాణ్యమైన ఆటగాళ్లున్నప్పటికీ సమష్టిగా రాణించకపోవడం, ఒక ప్రణాళిక ప్రకారం ఆడకపోవడం, దేశీయ ఆటగాళ్లు సరైన ప్రదర్శన చేయకపోవడం వల్ల చాలా ఏళ్ల నుంచి కప్పు గెలవలేకపోతోంది. ఈ లోపాలన్నింటినీ గంభీర్ మెంటార్ అయ్యాక అధిగమించింది నైట్రైడర్స్. మిచెల్ స్టార్క్ (Mitchell Starc)ను భారీ రేటు పెట్టి వేలంలో కొనడం దగ్గర్నుంచి గంభీర్ ప్రతీ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాడు. వెంకటేశ్ అయ్యర్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా లాంటి యువ ఆటగాళ్లను ప్రోత్సహించి ఉత్తమ ప్రదర్శన ఇచ్చేలా చేశాడు. ఆటగాళ్లు స్వేచ్ఛగా, సహజశైలిలో ఆడేలా చూడడంలో గంభీర్ది ముఖ్య పాత్ర. ఆటగాళ్లెవ్వరూ ఒత్తిడికి గురికాకుండా చూడడంలోనూ గంభీర్ పాత్ర కీలకమన్నది జట్టు వర్గాల మాట. కోల్కతాకు కోచ్ చంద్రకాంత్ పండిట్ అయినప్పటికీ.. గంభీర్ అన్నీ తానై వ్యవహరించి జట్టు కప్పు గెలవడంలో ముఖ్య పాత్ర పోషించాడు. లఖ్నవూతో ఉండగా గంభీర్ మంచి పనితీరే కనబరిచినా.. నిరుడు బెంగళూరు జట్టుతో వివాదం జరిగినపుడు జట్టులో ఇబ్బందికర వాతావరణం నెలకొంది. అది ఆ జట్టును గంభీర్ విడిచిపెట్టాల్సిన పరిస్థితికి దారితీసింది. అయితే కెప్టెన్గా గంభీర్ చాలా ఏళ్లు నడిపించడంతో పాటు రెండు కప్పులు అందించిన కోల్కతాకు మారడానికి ఇది దోహదపడింది. ఇక్కడికి వచ్చాక తన సొంతింటికి వచ్చిన భావన కలిగింది గౌతీకి. అక్కడ తనకు పూర్తి స్వేచ్ఛ లభించడంతో ఆటగాళ్లలో మంచి సమన్వయంతో పని చేసి ఫలితాలు రాబట్టాడు.
కింగ్ ఖాన్ ఏం చేశాడు?
మెంటార్గా కోల్కతా కోసం గంభీర్ ఏం చేశాడో అందరూ చెబుతున్నారు. మరి యజమానిగా షారుక్ ఖాన్ (Shah Rukh Khan) ఏం చేశాడు అన్నది చర్చనీయాంశం. నిజానికి షారుక్ ఏం చేయకపోవడమే అతడిలోని ఉత్తమ లక్షణం. కొన్ని రోజుల కిందటే హైదరాబాద్ చేతిలో లఖ్నవూ సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) చిత్తుగా ఓడిపోయింది. లఖ్నవూ నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ కేవలం 9.4 ఓవర్లలోనే ఛేదించి పడేసింది. ఆ మ్యాచ్ అయ్యాక ఎల్ఎస్జీ యజమాని సంజీవ్ గోయెంకా.. డగౌట్ దగ్గరే అందరూ చూస్తుండగా, కెమెరాలు ఫోకస్ చేస్తుండగా కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul)తో వాగ్వాదానికి దిగాడు. ఇదేం ఆట అంటూ అతణ్ని నిలదీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ వివాద సమయంలో అందరూ షారుక్ ఖాన్ గురించే మాట్లాడుకున్నారు. అతను ఆటకు సంబంధించిన విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోడు. మైదానానికి వచ్చి ఆటగాళ్లకు ఉత్సాహాన్నిస్తాడు. గెలిస్తే అభినందిస్తాడు. ఓడితే ఓదారుస్తాడు. అంతే తప్ప గెలిచినపుడు అతిగా సంబరాలు చేసుకోవడం, ఓడినపుడు ఆటగాళ్ల మీద అరవడం లాంటివి ఎన్నడూ జరగలేదన్నది జట్టు వర్గాల మాట. తాను అన్నేళ్లపాటు కోల్కతా కెప్టెన్గా ఉన్నప్పటికీ.. షారుక్తో కొన్ని నిమిషాలు కూడా ఆట గురించి మాట్లాడింది లేదని గతంలో గంభీరే స్వయంగా చెప్పాడు. ఇదే విషయమై ఓ యూట్యూబ్ ఛానెల్ చిట్చాట్లో షారుక్ మాట్లాడుతూ.. తనకు ఎవరైనా నటనలో సలహాలు ఇస్తే కోపం వస్తుందని, అలాగే తనకు పెద్దగా అవగాహన లేని క్రికెట్లో ప్రొఫెషనల్ ఆటగాళ్లకు సలహాలు, సూచనలు ఇవ్వకూడదని భావిస్తానని షారుక్ అన్నాడు. తనదెంతో బిజీ షెడ్యూల్ అయినా సరే.. ఆటగాళ్లను ఉత్సాహపరచడానికే షారుక్ తరచుగా స్టేడియాలకు వస్తుంటాడు. ఆట పరంగా ఎక్కువ జోక్యం చేసుకోకుండా ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడే వాతావరణం కల్పించాడు. కాబట్టే కోల్కతా ఉత్తమ ప్రదర్శన చేయడంలో షారుక్ పాత్ర కూడా కీలకం అన్నది విశ్లేషకుల అభిప్రాయం.
- ఈనాడు క్రీడావిభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
-
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం
-
రివ్యూ: ‘రాయన్’.. ధనుష్ 50వ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా?
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి