Kohli vs Gambhir: కోహ్లీతో వివాదం.. తొలిసారి స్పందించిన గంభీర్
విరాట్ కోహ్లీతో ఇటీవల ఐపీఎల్లో చోటుచేసుకున్న వివాదంపై గౌతం గంభీర్(Gautam Gambhir) ఎట్టకేలకు స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల ముగిసిన ఐపీఎల్ 16 (IPL 16)వ సీజన్లో లఖ్నవూ (LSG) మెంటార్ గౌతం గంభీర్(Gautam Gambhir), బెంగళూరు(RCB) స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohli) మధ్య తీవ్ర వివాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ వివాదంపై గంభీర్ ఎట్టకేలకు మౌనం వీడాడు. ఆ రోజు చోటుచేసుకున్న ఘటనపై స్పందించాడు.
‘ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ లేదా ఇతర ఏ ఆటగాడితోనైనా.. నా అనుబంధం ఒకేలా ఉంటుంది. మా మధ్య ఏదైనా వివాదం చోటుచేసుకుంటే.. అది మైదానం వరకు మాత్రమే పరిమితం. వ్యక్తిగతంగా ఏమీ ఉండదు. నాలాగే వాళ్లు కూడా గెలవాలని కోరుకుంటాను’ అంటూ ఈ వివాదంపై ముగింపు పలికాడు గంభీర్.
ఇదీ చదవండి : విరాట్.. గంభీర్ మధ్య వాగ్వాదానికి కారణమేంటి?
‘క్రికెట్ మైదానంలో నేను చాలా పోరాటాలు చేశాను. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వివాదం.. మైదానం వరకు మాత్రమే పరిమితం కావాలి. చాలా మంది చాలా రకాలుగా చెబుతారు. టీఆర్పీ రేటింగ్ల కోసం ఈ వివాదంపై స్పష్టత ఇవ్వాలని చాలా మంది అడిగాడు. ఇద్దరి మధ్య ఏం జరిగిందన్న విషయంపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు’ అంటూ గంభీర్ వివరించాడు.
ఇక అప్పటి ఘటనను వివరిస్తూ.. ‘నేను ఒక్కటే చెబుతాను. ఆ సమయంలో నేను చేసినదాన్ని సమర్థించుకుంటున్నా. నవీనుల్ తప్పు చేయలేదని భావిస్తే.. అతడి వెంట నిలబడటం నా బాధ్యత. అక్కడ నవీనుల్ ఉన్నా.. ఇతర వ్యక్తి ఉన్నా.. నా చివరి శ్వాస వరకూ అదే చేస్తా. మీరు సరైనవారని నేను భావిస్తే.. నేను మీవైపే ఉంటా. నేను ఇదే నేర్చుకున్నా.. దీన్నే కొనసాగిస్తా.. ఈ విధంగానే జీవిస్తా. మీరు అతడికి మద్దతిస్తున్నారు.. అతడు మన సొంత ఆటగాడు కాదు కదా.. అని చాలా మంది చాలా రకాలుగా అంటున్నారు. ఇక్కడ అతడు మనవాడా కాదా అన్నది కాదు.. ఒకవేళ నా జట్టు సభ్యుడు తప్పు చేస్తే.. అతడికి ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వను’ అంటూ వివరణ ఇచ్చాడు.
ఆరోజు ఏం జరిగిందంటే..
లఖ్నవూ సూపర్ జెయింట్స్(Lucknow Supergiants)తో ఆర్సీబీ(RCB) మ్యాచ్ అనంతరం కరచాలనం చేసుకునే సమయంలో కోహ్లీ-గంభీర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు దూసుకెళ్లేంత పని చేశారు. అంతకుముందు మ్యాచ్లో లఖ్నవూ బౌలర్ నవీనుల్, విరాట్ మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన బీసీసీఐ విరాట్, గంభీర్కు భారీ జరిమానా విధించిన విషయం తెలిసిందే. ఈ వివాదంపై పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు కూడా. తాజాగా గంభీర్ ఈ ఘటనపై వివరణ ఇచ్చాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నీ డెబ్యూ నాటికి నేనింకా చెడ్డీలతోనే ఉండుంటా: మిశ్రాతో రోహిత్
భారత మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రాతో కెప్టెన్ రోహిత్ శర్మ సరదా సంభాషణ నెట్టింట వైరల్గా మారింది. లఖ్నవూ - ముంబయి మ్యాచ్ సందర్భంగా వారిద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. -
‘హార్దిక్ దృఢంగా ఉండు.. విమర్శించిన వాళ్లే నిన్ను ప్రశంసించే రోజు వస్తుంది’
హార్దిక్ పాండ్య (Hardik Pandya)ను సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా ట్రోల్ చేయడంపై భారత మాజీ క్రికెటర్ వసీమ్ జాఫర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అదేవిధంగా లఖ్నవూతో మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్కు రూ.24 లక్షలు జరిమానా పడింది. -
‘హార్దిక్ను ఎంచుకోవడం తప్పిదమా?’.. విమర్శలకు గావస్కర్ స్ట్రాంగ్ ఆన్సర్!
టీ20 ప్రపంచ కప్ బరిలోకి దిగే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. పెద్దగా ఫామ్లో లేనివారికి అవకాశం ఇచ్చారనే విమర్శలూ వస్తున్నాయి. -
ప్రపంచకప్కి రింకూని విస్మరించడమా? ఇదో చెత్త సెలక్షన్!
రింకూ సింగ్ను టీ20 ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేయకపోవడంపై సీనియర్లు మండిపడుతున్నారు. 176 స్ట్రైక్రేట్ 86 సగటు ఉన్న ఆటగాడిని ఎలా విస్మరిస్తారని ప్రశ్నిస్తున్నారు. -
వరల్డ్ కప్ జట్టులోకి ఎంట్రీ.. సంజూ శాంసన్ ‘మలయాళం’ ట్వీట్ వైరల్
భారత జట్టు తరఫున వరల్డ్ కప్ ఆడే అవకాశం సంజూ శాంసన్కు దక్కింది. పొట్టి కప్ కోసం ప్రకటించిన 15 మంది సభ్యుల జాబితాలో అతడి పేరుంది. -
బరిలో వాళ్లు.. బయట వీళ్లు... ఐపీఎల్లో ఈ కోచ్లు కి‘రాక్’
మైదానంలో దిగి ఆడే ప్లేయర్లే కాదు... డగౌట్లో కూర్చుని జట్టు వ్యూహాలను రచించే కోచ్లూ ముఖ్యమే. ఐపీఎల్లో అలా కీలకంగా నిలుస్తూ.. ఇంపాక్ట్ చూపిస్తున్న కోచ్లు వీరే. -
పంత్ 4 నెలల్లో 16 కేజీలు తగ్గాడు.. కేవలం 5ml ఆలివ్ ఆయిల్ వాడేవాడు!
ఘోర రోడ్డు ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత రిషభ్ పంత్ కోలుకొనేందుకు చాలా కష్టపడ్డాడు. మ్యాచ్ ఆడే ఫిట్నెస్ను సాధించి బరిలోకి దిగాడు. -
కెప్టెన్గా మార్ష్.. యంగ్ సెన్సేషన్కు నో ఛాన్స్.. ఆసీస్ జట్టు ఇదే!
టీ20 ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ను సారథిగా నియమించింది. -
చెన్నై ‘విన్నింగ్’ ట్రెండ్ను కొనసాగిస్తుందా.. ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకుంటుందా?
ఐపీఎల్లో ఇవాళ పంజాబ్తో సొంతమైదానం చెపాక్ వేదికగా చెన్నై తలపడనుంది. ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకోవాలంటే ఇక నుంచి ప్రతి మ్యాచ్ విజయమూ కీలకమే. -
ఆర్సీబీకి ఇదేం శాపమో..? ఆ జట్టులోకొస్తే వైఫల్యం.. వేరే జట్లలో అదరహో!
పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న నిలిచిన బెంగళూరు జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు లేనట్లే. స్టార్లు ఉన్నా జట్టుగా ఆడి విజయం సాధించడంలో విఫలం కావడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. -
అతడికి పెద్దగా అవకాశాలు ఇవ్వలేకపోయాం..: హార్దిక్ పాండ్య
తమ ఓటమికి ప్రధాన కారణం టాప్ ఆర్డర్లో త్వరగా వికెట్లను కోల్పోవడమేనని ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య వ్యాఖ్యానించాడు. -
పంత్కు ఓటు.. సంజుకు చోటు
రిషబ్ పంత్ పోరాటం ఫలించింది.. శాంసన్ నిరీక్షణకు తెరపడింది.. యువకెరటం యశస్వి జైస్వాల్ కోరిక తీరనుంది..! వెస్టిండీస్-అమెరికా ఆతిథ్యమిచ్చే టీ20 ప్రపంచకప్ కోసం వీరంతా విమానమెక్కనున్నారు. -
కప్పు కొట్టే జట్టేనా..?
టీ20 ఫార్మాట్ అంటే కుర్రాళ్లదే.. చాలామంది సిద్ధాంతం ఇదే. రెండేళ్ల కిందట బీసీసీఐ ప్రణాళిక ఇలానే సాగింది. 2022 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో టీమ్ఇండియా ఘోర పరాజయం చవిచూడటంతో... స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్లో భారమే అనుకున్న జట్టు మేనేజ్మెంట్ వారిద్దరిని పక్కనబెట్టింది. -
లఖ్నవూ సిక్సర్
ముంబయి ప్లేఆఫ్స్ ఆశలు ఇక కనుమరుగైనట్లే! స్లో పిచ్పై ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయడం.. ఆపై కుదురుగా ఆడి లక్ష్యాన్ని ఛేదించడం అలవాటుగా మార్చుకున్న లఖ్నవూ సూపర్ జెయింట్స్.. ఈసారి ముంబయిని దెబ్బతీసింది. -
భారత అమ్మాయిలదే రెండో టీ20
బంగ్లాదేశ్లో భారత అమ్మాయిల జోరు కొనసాగుతోంది. అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. -
చైనా చేతిలో భారత్ ఓటమి
ఉబెర్కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఇప్పటికే క్వార్టర్ఫైనల్స్ చేరిన భారత అమ్మాయిల జట్టు.. చివరి గ్రూప్ మ్యాచ్లో చిత్తుగా ఓడింది. -
బట్లర్ సారథ్యంలో ఇంగ్లాండ్..
లండన్: 2022 టీ20 ప్రపంచకప్ను దేశానికి అందించిన జోస్ బట్లర్ సారథ్యంలో మరోసారి ఇంగ్లాండ్ అదృష్టం పరీక్షించుకోనుంది. -
పృథ్వీషాకి సమన్లు
యువ బ్యాటర్ పృథ్వీషాకి ముంబయి సెషన్స్ కోర్టు సమన్లు జారీ చేసింది. సామాజిక మాధ్యమ ప్రభావశీలి స్వప్న గిల్ దాఖలు చేసిన రివ్యూ పిటీషన్ను విచారించిన న్యాయస్థానం ఈ ఉత్తర్వులు వెలువరించింది.
తాజా వార్తలు (Latest News)
-
అనిల్ రావిపూడిని కొడితే రూ. 10 వేలు ఇస్తా: రాజమౌళి
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
ప్రపంచంలోనే అత్యంత ధనిక ‘ఖైదీ’.. సంపద విలువ రూ. 3.60 లక్షల కోట్లు?
-
130 స్కూళ్లకు బెదిరింపు మెయిల్.. ఎన్నికల వేళ ఉగ్ర కుట్రేనా?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM