Sanju Samson - Gambhir: నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
ఆదివారం రాజస్థాన్తో కోల్కతా తన చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే ఇరు జట్లూ ప్లేఆఫ్స్నకు క్వాలిఫై అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సంజూ ఆటతీరుపై గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత జట్టులోకి వస్తానా? లేదా? అనే సందిగ్ధంలో ఉన్న సంజూ శాంసన్కు (Sanju Samson) ఇప్పుడు ఏకంగా వరల్డ్ కప్లోనే చోటు దక్కింది. రిషభ్ పంత్తో పాటు రెండో వికెట్ కీపర్గా సెలక్టర్లు ఎంపిక చేశారు. ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ను ప్లేఆఫ్స్నకు చేర్చడంలోనూ అతడు కీలక పాత్ర పోషించాడు. ఇప్పటి వరకు 13 మ్యాచులు ఆడిన సంజూ 504 పరుగులు సాధించాడు. అద్భుతమైన ఫామ్లో ఉన్న ఆర్ఆర్ కెప్టెన్ పొట్టి కప్లోనూ సత్తా చాటాల్సిన అవసరం ఉందని భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) సూచించాడు. కావాల్సినంత అనుభవం ఉందని.. దానిని మెగా టోర్నీలో ప్రదర్శించాలని పేర్కొన్నాడు.
‘‘ఇప్పుడు నువ్వు వరల్డ్ కప్ జట్టులోకి వచ్చావు. నీకు తుది టీమ్లో అవకాశం వస్తే.. భారత్ను గెలిపించేందుకు కీలక ఇన్నింగ్స్లు ఆడాలి. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో కావాల్సినంత అనుభవం సాధించావు. నువ్వు కొత్త ఆటగాడివి కాదు. ఐపీఎల్లోనూ అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించావు. అందుకే, నీకు వరల్డ్ కప్లో ఆడే ఛాన్స్ వచ్చింది. తప్పకుండా అతడి సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెబుతాడని ఆశిస్తున్నా.
సంజూ 2012లో కోల్కతా జట్టులోకి వచ్చాడు. అప్పుడు చాలా చిన్న కుర్రాడు. అతడి ఆటను చూసే అవకాశం అప్పుడు రాలేదు. అతడు ఎలాంటి ప్లేయర్ అని చెప్పేందుకు కేవలం ఐదు నిమిషాలు సరిపోతాయి. నైపుణ్యంపరంగా ఎంతో మెరుగు కావడంతోపాటు మానసికంగానూ బలంగా మారాడు. ఫిట్నెస్, పవర్ హిట్టింగ్, కీపింగ్, కెప్టెన్సీ.. ఇలా అన్నింట్లోనూ రాటుదేలాడు. ఎప్పుడూ తప్పుడు మార్గంలో అడుగులు వేయలేదు. ఇదే ఒరవడిని కొనసాగిస్తే పొట్టి కప్లోనూ అతడి బ్యాట్ నుంచి మంచి ఇన్నింగ్స్లు వస్తాయనే నమ్మకం ఉంది’’ అని గంభీర్ తెలిపాడు. ఆదివారం కోల్కతా - రాజస్థాన్ జట్ల మధ్య తమ చివరి లీగ్ మ్యాచ్ జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం