Sanju Samson - Gambhir: నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
ఆదివారం రాజస్థాన్తో కోల్కతా తన చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే ఇరు జట్లూ ప్లేఆఫ్స్నకు క్వాలిఫై అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సంజూ ఆటతీరుపై గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత జట్టులోకి వస్తానా? లేదా? అనే సందిగ్ధంలో ఉన్న సంజూ శాంసన్కు (Sanju Samson) ఇప్పుడు ఏకంగా వరల్డ్ కప్లోనే చోటు దక్కింది. రిషభ్ పంత్తో పాటు రెండో వికెట్ కీపర్గా సెలక్టర్లు ఎంపిక చేశారు. ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ను ప్లేఆఫ్స్నకు చేర్చడంలోనూ అతడు కీలక పాత్ర పోషించాడు. ఇప్పటి వరకు 13 మ్యాచులు ఆడిన సంజూ 504 పరుగులు సాధించాడు. అద్భుతమైన ఫామ్లో ఉన్న ఆర్ఆర్ కెప్టెన్ పొట్టి కప్లోనూ సత్తా చాటాల్సిన అవసరం ఉందని భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) సూచించాడు. కావాల్సినంత అనుభవం ఉందని.. దానిని మెగా టోర్నీలో ప్రదర్శించాలని పేర్కొన్నాడు.
‘‘ఇప్పుడు నువ్వు వరల్డ్ కప్ జట్టులోకి వచ్చావు. నీకు తుది టీమ్లో అవకాశం వస్తే.. భారత్ను గెలిపించేందుకు కీలక ఇన్నింగ్స్లు ఆడాలి. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో కావాల్సినంత అనుభవం సాధించావు. నువ్వు కొత్త ఆటగాడివి కాదు. ఐపీఎల్లోనూ అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించావు. అందుకే, నీకు వరల్డ్ కప్లో ఆడే ఛాన్స్ వచ్చింది. తప్పకుండా అతడి సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెబుతాడని ఆశిస్తున్నా.
సంజూ 2012లో కోల్కతా జట్టులోకి వచ్చాడు. అప్పుడు చాలా చిన్న కుర్రాడు. అతడి ఆటను చూసే అవకాశం అప్పుడు రాలేదు. అతడు ఎలాంటి ప్లేయర్ అని చెప్పేందుకు కేవలం ఐదు నిమిషాలు సరిపోతాయి. నైపుణ్యంపరంగా ఎంతో మెరుగు కావడంతోపాటు మానసికంగానూ బలంగా మారాడు. ఫిట్నెస్, పవర్ హిట్టింగ్, కీపింగ్, కెప్టెన్సీ.. ఇలా అన్నింట్లోనూ రాటుదేలాడు. ఎప్పుడూ తప్పుడు మార్గంలో అడుగులు వేయలేదు. ఇదే ఒరవడిని కొనసాగిస్తే పొట్టి కప్లోనూ అతడి బ్యాట్ నుంచి మంచి ఇన్నింగ్స్లు వస్తాయనే నమ్మకం ఉంది’’ అని గంభీర్ తెలిపాడు. ఆదివారం కోల్కతా - రాజస్థాన్ జట్ల మధ్య తమ చివరి లీగ్ మ్యాచ్ జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విండీస్ వచ్చేసింది
112/9.. 18 ఓవర్లకు విండీస్ స్కోరు ఇది. కానీ ఇన్నింగ్స్ ముగిసేసరికి 149. చివరి రెండు ఓవర్లలో రూథర్ఫర్డ్ విధ్వంసంతో 37 పరుగులు వచ్చాయి. ఆ ఆఖరి ఓవర్లలో రూథర్ఫర్డ్ చేసిన పరుగులే న్యూజిలాండ్ కొంపముంచాయి. -
షకిబ్ ధనాధన్
టీ20 ప్రపంచకప్లో బంగ్లాదేశ్కు కీలక విజయం. గురువారం గ్రూప్-డి మ్యాచ్లో ఆ జట్టు 25 పరుగుల తేడాతో నెదర్లాండ్స్పై గెలిచింది. షకిబ్ అల్ హసన్ (64 నాటౌట్; 46 బంతుల్లో 9×4) మెరవడంతో మొదట బంగ్లాదేశ్ 5 వికెట్లకు 159 పరుగులు చేసింది. -
సూపర్-8పై కన్నేసిన అఫ్గాన్, అమెరికా
సూపర్-8పై కన్నేసిన అఫ్గానిస్థాన్, అమెరికా జట్లు ముఖ్యమైన మ్యాచ్లకు సిద్ధమయ్యాయి. శుక్రవారం గ్రూప్-సిలో పాపువా న్యూగినీతో అఫ్గానిస్థాన్ తలపడుతుంది. ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ గెలిచిన అఫ్గాన్కు పాపువా నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురుకాకపోవచ్చు. -
కిక్కిచ్చే కిక్
ఫుట్బాల్ ప్రపంచాన్ని ఊపేసే మహా పోరుకు వేళైంది. ఫిఫా ప్రపంచకప్ తర్వాత అత్యధిక మంది వీక్షించే ప్రతిష్ఠాత్మక ఫుట్బాల్ టోర్నీకి సమయం ఆసన్నమైంది. నాలుగేళ్లకోసారి జరిగే యూరో కప్ భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి (శనివారం) 12.30 గంటలకు ఆరంభమవనుంది. -
ఆ స్టేడియం ఇక కనిపించదు
నాసా కౌంటీ అంతర్జాతీయ స్టేడియం.. గత కొన్ని నెలలుగా చర్చంతా దీని గురించే. టీ20 ప్రపంచకప్ కోసం దాదాపు 100 రోజుల్లో ఈ స్టేడియాన్ని ఏర్పాటు చేయడం దగ్గర నుంచి ఇక్కడి ప్రమాదకర పిచ్లపై విమర్శల వరకూ దీని గురించే మాట్లాడుకున్నారు. -
గుర్తుకొస్తున్నాయి..
ముంబయి ఆటగాళ్లు రోహిత్శర్మ, సూర్యకుమార్ యాదవ్లను చాన్నాళ్ల తర్వాత కలవడం సంతోషంగా ఉందని అమెరికా మీడియం పేసర్ సౌరభ్ నేత్రావల్కర్ అన్నాడు. ముఖ్యంగా సూర్యతో కలిసి నేత్రావల్కర్ ముంబయికి ఎక్కువ మ్యాచ్ల్లో ప్రాతినిథ్యం వహించాడు. -
ప్రపంచ జూనియర్ చెస్ విజేత దివ్య
భారత యువ చెస్ క్రీడాకారిణి దివ్య దేశ్ముఖ్ సత్తా చాటింది. ప్రపంచ జూనియర్ చెస్ టోర్నమెంట్లో మహిళల విభాగంలో ఆమె విజేతగా నిలిచింది. మొత్తం 11 రౌండ్లలో 10 పాయింట్లు సాధించిన దివ్య.. అగ్రస్థానంలో నిలిచింది. -
క్వార్టర్స్లో ప్రణయ్, సమీర్
ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో భారత ఆటగాళ్లు హెచ్.ఎస్.ప్రణయ్, సమీర్వర్మ క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టారు. గురువారం పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో ప్రణయ్ 21-17, 21-15తో మిషా జిల్బర్మన్ (ఇజ్రాయెల్)పై, సమీర్ 21-14, 14-21, 21-19తో ఎనిమిదో సీడ్ లో కీన్ యూ (సింగపూర్)పై గెలిచారు. -
వింబుల్డన్కు నాదల్ దూరం
ఫిట్నెస్ లేకుండానే ఫ్రెంచ్ ఓపెన్లో దిగి తొలి రౌండ్లోనే వెనుదిరిగిన స్పెయిన్ దిగ్గజ ఆటగాడు రఫెల్ నాదల్.. వింబుల్డన్ నుంచి తప్పుకున్నాడు. జులై 1న ఆరంభమయ్యే ఈ టోర్నీలో ఆడట్లేదని.. ఒలింపిక్స్ కోసం సిద్ధం అవుతున్నట్లు రఫా వెల్లడించాడు. -
ఒలింపిక్ కోటా బెర్తు దేశానిది: బింద్రా
ఒలింపిక్స్ కోటా బెర్తు దేశానికి చెందినదని.. క్రీడాకారులది కాదని భారత దిగ్గజ షూటర్ అభినవ్ బింద్రా అన్నాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రుద్రాంక్ష్ పాటిల్కు పారిస్ ఒలింపిక్స్ కోటా బెర్తు లభించింది. -
రోహిత్ శర్మది, నాది ఒకే స్కూల్: అమెరికా క్రికెటర్
అమెరికా జట్టులోని కొంతమంది భారత సంతతి ఆటగాళ్లు జూనియర్ లెవల్లో ఇండియా తరఫున బరిలోకి దిగారు. ప్రస్తుతం టీమ్ఇండియాలో కీలకంగా ఉన్న కొంతమంది ఆటగాళ్లతోనూ కలిసి ఆడారు.