Gambhir - Jay Shah: గంభీర్ను కలిసిన జై షా.. ‘ప్రధాన కోచ్’ పదవిపై మళ్లీ చర్చ!
ఐపీఎల్ 17వ సీజన్ విజయవంతంగా ముగిసింది. కోల్కతా ఛాంపియన్గా నిలిచి మూడోసారి టైటిల్ను ఎగరేసుకుపోయింది. అయితే, ఇప్పుడు సోషల్ మీడియాలో ఇద్దరి కలియిక మాత్రం చర్చకు దారితీసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్లో గత రెండేళ్లు మెంటార్గా లఖ్నవూను ప్లేఆఫ్స్కు చేర్చడం.. ఇప్పుడు కోల్కతాను ఛాంపియన్గా మార్చడం వెనుక భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) కీలక పాత్ర పోషించాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో కేకేఆర్ విజయం సాధించి మూడోసారి కప్ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ అనంతరం గౌతమ్ గంభీర్తో బీసీసీఐ కార్యదర్శి జై షా మాట్లాడుతూ కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. టీమ్ఇండియా ప్రధాన కోచ్ పదవి ఖాళీ అవుతున్న క్రమంలో వీరిద్దరిని ఇలా చూడటంతో చర్చకు దారితీసింది. ఇవాళే కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి రోజు కావడం గమనార్హం. ఇప్పటికే గంభీర్ను ఒప్పించడానికి బీసీసీఐ ప్రయత్నాలు చేసిందనే ప్రచారం సాగుతోంది. సోషల్ మీడియాలో జైషాకు అభిమానుల నుంచి వినతులు వస్తున్నాయి. కొందరు విభిన్నంగానూ స్పందించారు.
‘‘జైషా సార్ మీరు ఒకే ఒక పనిచేయండి. గౌతమ్ గంభీర్ను భారత జట్టు ప్రధాన కోచ్గా నియమించండి’’
‘‘గంభీర్తో జైషా సీరియస్గా చర్చిస్తున్నారు. విషయం ఒకటే. అది కన్ఫార్మ్ అయినట్లు ఉంది’’
‘‘ప్రధాన కోచ్ పదవిని ఇవ్వడానికి ఎందుకీ ఆలస్యం? ముందు టీ20 వరల్డ్ కప్ కోసం అతడిని మెంటార్గా పెట్టండి. గతంలో ధోనీ సేవలను వినియోగించుకున్నట్లు ఈసారి గౌతీకి అవకాశం ఇస్తే బాగుంటుంది’’
‘‘కోల్కతా జట్టుతో పోలిస్తే టీమ్ఇండియాలో విభిన్నమైన సంస్కృతి ఉంటుంది. ఇక్కడి సీనియర్లు గంభీర్ను గౌరవించకపోవచ్చు. అందుకే, అతడికి కోచ్ పదవి కష్టంగా మారే అవకాశం ఉంది’’
‘‘గౌతమ్ గంభీర్ను ప్రధాన కోచ్గా నియమిస్తే మాత్రం.. అతడికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి. లేకపోతే విఫలమయ్యాడనే వ్యాఖ్యలు వినిపిస్తాయి’’
గ్రౌండ్ స్టాఫ్కు నజరానా
రెండు నెలలకుపైగా సాగిన ఐపీఎల్ 17వ సీజన్ విజయవంతం కావడంలో గ్రౌండ్ సిబ్బంది విశేష కృషి ఉంది. సమయానికి అద్భుతమైన పిచ్లు, వర్షం పడినా మైదానాన్ని త్వరగా సిద్ధం చేయడంలో కీలక పాత్ర పోషించారు. దీంతో వారికి మద్దతుగా నిలిచేందుకు బీసీసీఐ కార్యదర్శి జైషా నజరానా ప్రకటించారు. ‘‘టీ20 సీజన్ సక్సెస్ కావడంలో గ్రౌండ్ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. మా హీరోలకు ప్రశంసలు కురిపించడంతోపాటు వారికి నజరానా ఇవ్వాలని నిర్ణయించాం. 10 రెగ్యులర్ మైదానాల్లో ఒక్కోదానికి రూ. 25 లక్షలు, అదనంగా మరో మూడు వేదికలకు పదేసి లక్షలను ఇస్తున్నాం. సిబ్బంది, క్యురేటర్ నిబద్ధతకు, కష్టానికి ధన్యవాదాలు’’ అని జై షా పోస్టు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..