Gautam Gambhir: అతడొచ్చాడు.. కోల్‘కథ’ మార్చాడు!
ఐపీఎల్-17లో కోల్కతా నైట్రైడర్స్ (Kolkata Knight Riders) ఫైనల్కు చేరింది. మైదానంలో ఆ జట్టును ముందుండి నడిపించింది శ్రేయస్ అయ్యరే కానీ.. వెనకుండి ఆ జట్టును ముందుకు నడిపిన శక్తి గౌతమ్ గంభీర్దే (Gautam Gambhir)! ఓటమిని ఒప్పుకోని తత్వం.. రాజీపడని మనస్తత్వంతో గౌతి తనకు మరో ఇళ్లు అయిన కోల్కతా జట్టులో వెలుగులు నింపాడు.
ఐపీఎల్లో కోల్కతా (Kolkata Knight Riders) పేరు చెప్పగానే పేరు గొప్ప..! అనే మాట గుర్తుకు రాక మానదు. ఎందుకంటే స్టార్ ఆటగాళ్లు, భారీ కోచింగ్ సిబ్బంది.. షారుక్ లాంటి ఓ స్ఫూర్తినిచ్చే యజమాని! ఇన్ని ఉన్నా కూడా ఆ జట్టు కనీసం ప్లేఆఫ్స్కు కూడా రాలేకపోతుంది. చివరిగా 2014లో కప్పు కొట్టింది. గత రెండేళ్లలో చెత్త ప్రదర్శన చేసి ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. కేకేఆర్ను చూస్తే ఇంకా పైకి లేచేలా కనిపించలేదు. అలాంటిది ఏడాదిలోనే ఆ జట్టులో ఎంతో మార్పు! ఆటలో మరెంతో తేడా! కొట్టొచ్చినట్టు కనబడుతున్న ఆత్మవిశ్వాసం! ఫలితం ఐపీఎల్-17లో ఫైనల్లో ప్రవేశం! మైదానంలో ఆ జట్టును ముందుండి నడిపించింది శ్రేయస్ అయ్యరే కానీ.. వెనకుండి ఆ జట్టును ముందుకునడిపిన శక్తి గౌతమ్ గంభీర్దే (Gautam Gambhir)! ఓటమిని ఒప్పుకోని తత్వం.. రాజీపడని మనస్తత్వంతో గౌతి తనకు మరో ఇళ్లు అయిన కోల్కతా జట్టులో వెలుగులు నింపాడు. 2012, 2014లో కోల్కతా సారథిగా ఐపీఎల్ టైటిల్ అందించిన గంభీర్ ఇప్పుడు మార్గనిర్దేశకుడిగా మరో టైటిల్ అందించేందుకు రంగం సిద్ధం చేశాడు.
అక్కడ నుంచి వచ్చి..
2023 ఐపీఎల్లో లఖ్నవూ జట్టుకు కోచ్గా ఉన్న సమయంలో గంభీర్ వివాదాల్లో చిక్కుకున్నాడు. లఖ్నవూ-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లో కోహ్లితో వాగ్వాదానికి దిగి వార్తల్లో నిలిచాడు. కోహ్లి అభిమానుల ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు. ముక్కోపిగా పేరు పొందాడు. దీంతో లఖ్నవూ జట్టుకు కూడా దూరం కావాల్సివచ్చింది. కానీ ఇది అతడికి మంచే చేసింది. తన కెరీర్ను మరో దశకు తీసుకెళ్లిన కోల్కతాతో తిరిగి చేతులు కలిపాడు. మార్గనిర్దేశకుడిగా జట్టుకు స్ఫూర్తినిచ్చాడు. పేరుకే చంద్రకాంత్ కోచ్ కానీ.. అన్నీ తానై చూసుకున్నాడు. పెద్దగా ఫామ్లో లేని సునీల్ నరైన్ను ఓపెనర్గా తెచ్చి సక్సెస్ చేయించడం.. వెంకటేశ్ అయ్యర్, హర్షిత్ రాణాలను సరిగ్గా ఉపయోగించుకోవడం గౌతి ప్రణాళికల వల్లే సాధ్యమైంది. ఒకప్పుడు కీలక ఆటగాళ్లుగా ఉండి గత రెండు సీజన్లుగా పెద్దగా రాణించలేకపోయిన రసెల్, నరైన్లు తిరిగి ట్రాక్లోకి రావడం వెనక గంభీర పాత్ర ఎంతో ఉంది. ఎక్కువ అవకాశాలు దక్కించుకోలేకపోయిన ఫిల్ సాల్ట్ లాంటి హిట్టర్ని ఓపెనర్గా దింపి విజయవంతం అయ్యేలా చేశాడు. ఆరంభంలో సాల్ట్, నరైన్ చెలరేగి శుభారంభాలు ఇస్తే.. మిడిల్ ఓవర్లలో శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్ ఇన్నింగ్స్కు ఆ ఊపు తగ్గకుండా చూశారు. చివర్లో రింకు సింగ్, రసెల్, రమణ్దీప్ భారీ షాట్లతో విరుచుకుపడి మెరుపు ఫినిషింగ్ ఇచ్చారు. ఇక స్పిన్ ద్వయం నరైన్, వరుణ్ చక్రవర్తి గొప్పగా బంతులేసి బ్యాటర్లను కట్టడి చేశారు. వైభవ్ అరోరా లాంటి కుర్రాడిని కొత్త బంతితో బౌలింగ్ చేయడం కూడా గౌతి వ్యూహమే.
ఇప్పుడూ సాధిస్తుందా?
గంభీర్ కెప్టెన్గా ఉన్నప్పుడు 2012, 14 టోర్నీల్లో కోల్కతా ఐపీఎల్ ట్రోఫీని సాధించింది. కానీ ఆ తర్వాత చివరిగా 2021లో బ్రెండన్ మెక్కలమ్ కోచ్గా ఉన్నప్పుడు తుదిపోరుకు అర్హత సాధించింది. కానీ చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడి రన్నరప్గా నిలిచింది. గత రెండేళ్లుగా కేకేఆర్ది తిరోగమనమే. బ్యాటింగ్, బౌలింగ్లలో దారుణంగా విఫలమైన కోల్కతా ఏడో స్థానంలో మాత్రమే నిలవగలిగింది. 2022లో శ్రేయస్ అయ్యర్ కేకేఆర్ కెప్టెన్గా ఎంపికైనా జట్టును ప్లేఆఫ్స్కు చేర్చలేకపోయాడు. 2023లో శ్రేయస్ అయ్యర్కు గాయం కావడంతో నితీశ్ రాణా జట్టుకు సారథిగా వ్యవహరించాడు. అతడు కూడా కేకేఆర్ రాతను మార్చలేకపోయాడు. ఐపీఎల్-17లో తిరిగి జట్టు పగ్గాలు చేపట్టిన శ్రేయస్.. ఈసారి గంభీర్ మార్గనిర్దేశకత్వంలో భిన్నంగా కనిపించాడు. దూకుడుగా జట్టును నడిపించాడు. వనరులను సద్వినియోగం చేసుకోవడం దగ్గర నుంచి.. భిన్నమైన ప్రణాళికలను రూపొందించి మైదానంలో అమలుచేయడం వరకు శ్రేయస్ కొత్త శైలిలో పయనించాడు. ఇదే కోల్కతాకు ప్లస్ అయింది. బలమైన జట్లను మట్టికరిపించి ఫైనల్కు దూసుకెళ్లింది. క్వాలిఫయర్-1లో పటిష్టమైన సన్రైజర్ హైదరాబాద్.. కోల్కతా ధాటికి ఏమాత్రం నిలవలేకపోయింది. 2018 నుంచి క్వాలిఫయర్స్-1లో గెలిచిన జట్టే ఐపీఎల్ విజేతగా నిలుస్తోంది.. మరి ఈసారి శ్రేయస్ సేన కప్ సాధిస్తుందా అనేది ఆసక్తికరం.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
-
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం
-
రివ్యూ: ‘రాయన్’.. ధనుష్ 50వ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా?