Gautam Gambhir: ‘వారికి ఇప్పటికీ శ్రీకృష్ణుడే రథసారథి’.. వైరలవుతోన్న గంభీర్ పోస్ట్!
Gautam Gambhir: ఐపీఎల్ 2024 ట్రోఫీని కోల్కతా కైవసం చేసుకుంది. ఈ విజయంలో జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్ది కీలక పాత్ర. ఈ సందర్భంగా ఆయన చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరలవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2024 ట్రోఫీని కోల్కతా నైట్రైడర్స్ గెలుచుకోవడంలో జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్ది (Gautam Gambhir) కీలక పాత్ర. ఆటగాళ్లతో పాటు క్రీడా ప్రముఖులూ అదే చెబుతున్నారు. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ మైదానంలో తన ప్రణాళికలను అమలుపర్చినప్పటికీ.. తెర వెనక వ్యూహ రచన మాత్రం గంభీర్దే. అతడొచ్చిన తర్వాత జట్టు తీరే మారిపోయింది. ప్రతి మ్యాచ్లో జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. తద్వారా పదేళ్ల కల సాకారంలో తనదైన బాధ్యతను నిర్వర్తించాడు.
ఈ సందర్భంగా గంభీర్ (Gautam Gambhir) ఎక్స్లో చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్లో తెగ వైరలవుతోంది. ‘‘ఎవరి ఆలోచనలు, చర్యలు సత్యంపై ఆధారపడి ఉంటాయో వారికి ఇప్పటికీ శ్రీకృష్ణుడే రథసారథి’’ అంటూ హిందీలో చేసిన తాత్వికతతో కూడిన పోస్ట్ ఇప్పుడు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. దీని వెనక ఆయన ఉద్దేశం ఏంటనేది మాత్రం తెలియాల్సి ఉంది.
ఫస్ట్ బౌలింగ్ చేయడమే లక్కీ.. ఎస్ఆర్హెచ్కు థ్యాంక్స్: శ్రేయస్
గతంలో కెప్టెన్గా కోల్కతా ఫ్రాంచైజీకి గంభీర్ రెండు ట్రోఫీలను (2012, 2014) అందించారు. ఈసారి తిరిగి మెంటార్గా జట్టు గూటికి చేరారు. తద్వారా పదేళ్ల నిరీక్షణకు తెరదించారు. ఈ సందర్భంగా గెలుపులో గంభీర్ పాత్రను జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, వైస్ కెప్టెన్ నితీశ్ రాణా కొనియాడారు. ‘‘గంభీర్ను మెంటార్గా ప్రకటించినప్పుడు సంతోషం వ్యక్తం చేస్తూ ఆయనకు సుదీర్ఘ సందేశం పంపా. దానికి ధన్యవాదాలు తెలుపుతూనే.. చేతిలో ట్రోఫీతో పోడియంపై నిలబడితే మరింత సంతోషిస్తా అన్నారు. ఆరోజు రానే వచ్చింది’’ అని రాణా గుర్తుచేసుకున్నారు.
మరో కేకేఆర్ స్టార్ ఆటగాడు రింకూ సింగ్ సైతం గంభీర్ పాత్రను కొనియాడాడు. తన ఏడేళ్ల కల నెరవేరిందంటూ మొత్తం టీమ్తో పాటు ప్రత్యేకంగా గంభీర్కు కృతజ్ఞతలు తెలియజేశాడు. సునీల్ నరైన్ సైతం మెంటార్ నుంచి లభించిన సహకారం అద్భుతమని తెలియజేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట