KKR-Shreyas Iyer: ఫస్ట్ బౌలింగ్ చేయడమే లక్కీ.. ఎస్ఆర్హెచ్కు థ్యాంక్స్: శ్రేయస్
మూడోసారి ఐపీఎల్ విజేతగా నిలవడంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉందని కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వ్యాఖ్యానించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్ టైటిల్ను కోల్కతా నైట్రైడర్స్ ఒడిసి పట్టింది. తుది పోరులో సన్రైజర్స్ను చిత్తు చేసింది. టోర్నీ ఆసాంతం నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్న కేకేఆర్ ప్లేయర్లు ఫైనల్లోనూ ఇదే ఆటతీరుతో రాణించారు. చెపాక్ వేదికగా జరిగిన ఫైనల్లో ప్రత్యర్థి ఎస్ఆర్హెచ్కు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. తమ జట్టు విజయం వెనుక ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉందని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వ్యాఖ్యానించాడు.
‘‘జట్టుగా మేం సాధించాలని కోరుకున్నదిదే. కీలక సమయంలో ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి నిలబడ్డారు. మాటల్లో వర్ణించలేని ఆనందం. చాన్నాళ్లు వేచి చూస్తున్నా. ఈ సీజన్ మొత్తం మేం అద్భుత ఆటతీరును ప్రదర్శించాం. తొలి మ్యాచ్ను ఎలాంటి నిబద్ధతతో ఆడామో.. ఇప్పుడే అదే స్ఫూర్తితో పోరాడాం. సన్రైజర్స్ క్రికెటర్లు ఈసారి చాలా దూకుడుగా ఆడారు. అద్భుతంగా ఆడినందుకు ధన్యవాదాలు. పోటీ ఉన్నప్పుడే మనలోని సత్తా బయటికొస్తుంది. ఈ మ్యాచ్లో మేం తొలుత బౌలింగ్ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. చివరి వరకూ మా చేతుల్లోనే మ్యాచ్ను ఉంచుకోగలిగాం. భారీ ఒత్తిడి కలిగిన ఇలాంటి మ్యాచుల్లో స్టార్క్ వంటి స్టార్ ప్లేయర్లు నాణ్యమైన ప్రదర్శన చేస్తే జట్టుకు చాలా ప్రయోజనం ఉంటుంది. రస్సెల్, సునీల్ నరైన్, హర్షిత్, వెంకటేశ్.. ఇలా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అందించారు’’ అని శ్రేయస్ తెలిపాడు. టాస్ నెగ్గిన హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే.
స్టార్క్ దెబ్బ కొట్టాడు: పాట్ కమిన్స్
‘‘కోల్కతా బౌలర్లు చాలా అద్భుతంగా బౌలింగ్ వేశారు. మరీ ముఖ్యంగా నా సహచరుడు స్టార్క్ మళ్లీ విజృంభించాడు. ఈసారి మేం అనుకున్న విధంగా ఆడలేకపోయాం. కొన్ని బౌండరీలను కొట్టి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది. మాకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అడ్డుకున్నారు. ఒకవేళ మేం 160 పరుగులు చేసి ఉంటే మ్యాచ్ రేసులో ఉండేవాళ్లం. ఇదేమీ 200+ వికెట్ కాదు. ఈ సీజన్లో మాకు చాలా సానుకూలాంశాలను చూశాం. కుర్రాళ్లు తమ సత్తాను నిరూపించుకొనేందుకు ఉత్సాహం చూపారు. 250+ స్కోర్లను మేం మూడుసార్లు సాధించామంటే మా బ్యాటర్ల ఆటతీరు ఆ స్థాయిలో ఉంది. తీవ్ర ఒత్తిడిలోనూ పోరాటపటిమ చూపించాం. భువనేశ్వర్, నటరాజన్, జయ్దేవ్ వంటి బౌలర్లతో పని చేయడం బాగుంది. ఇలాంటి భారీ టోర్నీలో ఆడటం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ప్రతి సంవత్సరం మరింత మెరుగ్గా లీగ్ జరుగుతుంది’’ అని కమిన్స్ వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు