Chennai Vs Bengaluru: చెన్నైతో మ్యాచ్.. బెంగళూరువి వ్యూహాత్మక తప్పిదాలే: సునీల్ గావస్కర్
చెన్నైతో మ్యాచ్లో బెంగళూరు సరైన ప్రణాళికలతో ఆడలేకపోయిందని మాజీ క్రికెటర్లు వ్యాఖ్యానించారు. ఓటమికి అవే కారణమని విశ్లేషించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్ను బెంగళూరు ఓటమితో ప్రారంభించింది. చెన్నై చేతిలో ఆరు వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఒక దశలో 78/5 స్కోరుతో కష్టాల్లో పడిన జట్టును దినేశ్ కార్తిక్, అనుజ్రావత్ కాపాడారు. చివరికి చెన్నై ముందు బెంగళూరు 174 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. అయితే, బౌలింగ్లో విఫలమై ఓటమిని కొనితెచ్చుకుందని.. వ్యూహాత్మక తప్పిదాల వల్లే ఇలా జరిగినట్లు భారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ విశ్లేషించాడు.
‘‘షార్ట్ బంతులతో ప్రత్యర్థిని ఇబ్బంది పెడదామని చూశారు. కానీ, అది వర్కౌట్ కాలేదు. అలాగే కేవలం 2 ఓవర్లు వేసి 6 పరుగులే ఇచ్చిన బౌలర్తో పూర్తి కోటా వేయించలేదు. మరోవైపు జోసెఫ్, సిరాజ్, గ్రీన్ భారీగా పరుగులు సమర్పించారు. వీరందరూ బౌన్సర్లు వేసి ఫలితం రాబట్టాలని చూశారు. కానీ, అవి వైడ్లుగా మారిపోయాయి. దీంతో అదనంగా పరుగులు ఇచ్చినట్లైంది. ఒకే కోణంలో ఇలాంటి వ్యూహంతో ఆడితే నిరుత్సాహానికి గురి కావాల్సి వస్తోంది’’ అని గావస్కర్ తెలిపాడు.
టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోవాల్సింది: కెవిన్ పీటర్సెన్
‘‘నేను బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ స్థానంలో ఉండుంటే.. ఛేజింగ్కు వెళ్లేవాడిని. చెపాక్ పిచ్ అలాంటిది. గత గణాంకాలు విభిన్నంగా ఉన్ననప్పటికీ.. వాటిని ఒక్కోసారి పట్టించుకోనక్కర్లేదు. స్పిన్నర్లకు కాస్త మాత్రమే సహకరించే పిచ్.. పేసర్లకు చాలా క్లిష్టమైంది. అందుకే, బెంగళూరు టాస్ నెగ్గి బౌలింగ్ తీసుకొని ఉండే బాగుండేది’’ అని ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సెన్ పేర్కొన్నాడు.
అక్కడ చెన్నై చాలా స్ట్రాంగ్: స్టీవ్ స్మిత్
‘‘చెపాక్ పిచ్ చెన్నై జట్టుకు కొట్టిన పిండి. అక్కడ బెంగళూరు నెగ్గడం చాలా కష్టం. ఇది ఇప్పటికే నిరూపితమైంది. మిడిల్ ఓవర్లలో కాస్త పట్టు సడలించినట్లు అనిపించినా.. చివరికి బెంగళూరును కట్టడి చేశారు. ముస్తాఫిజర్ అద్భుతమైన స్పెల్తో ఆకట్టుకున్నాడు. బెంగళూరు నిర్దేశించిన లక్ష్య ఛేదన సులువేం కాదు. ఎందుకంటే చెన్నై జట్టులో అత్యధిక స్కోరు 37 పరుగులే. ప్రతి ఒక్కరూ కాస్త సమయం తీసుకుని ఆడారు. చెన్నైకు వారు అనుకున్న విధంగానే ఆరంభం దక్కింది’’ అని ఆసీస్ స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ విశ్లేషించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం