8 జట్లతోనే వచ్చే ఐపీఎల్!
చ్చే ఏడాది ఐపీఎల్ను 8 జట్లతోనే నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. 2021 ఐపీఎల్కు మూడున్నర నెలల సమయమే ఉండటంతో కొత్త జట్లను చేర్చడం హడావుడి నిర్ణయమే అవుతుందని బీసీసీఐ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. కొత్తగా చేర్చే ఒకటి లేదా రెండు జట్లను 2022 నుంచి ఆడించాలని నిర్ణయించింది.
ముంబయి: వచ్చే ఏడాది ఐపీఎల్ను 8 జట్లతోనే నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. 2021 ఐపీఎల్కు మూడున్నర నెలల సమయమే ఉండటంతో కొత్త జట్లను చేర్చడం హడావుడి నిర్ణయమే అవుతుందని బీసీసీఐ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. కొత్తగా చేర్చే ఒకటి లేదా రెండు జట్లను 2022 నుంచి ఆడించాలని నిర్ణయించింది. ఈనెల 24న అహ్మదాబాద్లో జరిగే వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో ఈ ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలపనుంది. మూడు వారాల క్రితం బీసీసీఐ ఇచ్చిన ఏజీఎం నోటీసు అజెండాలో రెండు కొత్త జట్ల ఎంపికను చేర్చింది. ఈ ప్రతిపాదనకు ఏజీఎం ఆమోదం తెలిపినా వెంటనే టెండర్లు ఆహ్వానించొద్దని బోర్డు భావిస్తోంది. ‘‘కొత్త ఫ్రాంచైజీల కోసం ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ లేదా సరైన సమయం అనుకున్నప్పుడు బీసీసీఐ టెండర్లు పిలవొచ్చు. 2021 ఐపీఎల్లోనే కొత్త జట్లను చేర్చితే నిర్వహణ కష్టమవుతుంది’’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!