Shreyas iyer: ఐపీఎల్ మొత్తానికి శ్రేయస్ దూరం
వెన్ను గాయంతో బాధపడుతున్న శ్రేయస్ అయ్యర్ విదేశాల్లో శస్త్రచికిత్స చేయించుకుంటాడని, ఫలితంగా ఐపీఎల్ మొత్తానికి దూరమవుతాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
దిల్లీ: వెన్ను గాయంతో బాధపడుతున్న శ్రేయస్ అయ్యర్ విదేశాల్లో శస్త్రచికిత్స చేయించుకుంటాడని, ఫలితంగా ఐపీఎల్ మొత్తానికి దూరమవుతాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. కోల్కతా నైట్రైడర్స్ కెప్టెనైన శ్రేయస్ కనీసం అయిదు నెలలు ఆటకు దూరమవుతాడని భావిస్తున్నారు. ‘‘శ్రేయస్కు విదేశాల్లో శస్త్రచికిత్స జరగనుంది. పూర్తిగా కోలుకోవడానికి అతడికి కనీసం అయిదు నెలలు పట్టొచ్చు’’ అని ఓ బీసీసీఐ అధికారి చెప్పాడు. జూన్ 7న ఆరంభమయ్యే డబ్ల్యూటీసీ ఫైనల్కు కూడా శ్రేయస్ దూరమవుతాడు. అతడు గాయం వల్ల బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ఆఖరి టెస్టులో ఆడలేకపోయాడు. ఆ తర్వాత వన్డే సిరీస్ నుంచి కూడా వైదొలిగాడు. శ్రేయస్ గైర్హాజరీలో ఐపీఎల్లో కోల్కతాకు నితీశ్ రాణా నాయకత్వం వహిస్తున్నాడు.
పటిదార్ కూడా..: బుమ్రా, శ్రేయస్ అయ్యర్, విలియమ్సన్ల బాటలోనే మరో ఆటగాడు ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. బెంగళూరు టాప్ఆర్డర్ బ్యాటర్ రజత్ పటిదార్.. కాలి మడమ గాయంతో ఐపీఎల్కు అందుబాటులో లేకుండా పోయాడు. గత సీజన్లో 8 మ్యాచ్ల్లో 50పైన సగటుతో 333 పరుగులు చేసిన రజత్.. క్వాలిఫయర్-1లో మెరుపు శతకం (112; 54 బంతుల్లో) బాదాడు. మరోవైపు గాయం నుంచి కోలుకుంటున్న ఆర్సీబీ ప్రధాన పేసర్ జోష్ హేజిల్వుడ్ ఏప్రిల్ చివరి వారం వరకు లీగ్కు అందుబాటులో ఉండనని చెప్పాడు. ఆర్సీబీకి ఇంకో షాక్ కూడా తగిలింది. ముంబయి ఇండియన్స్తో తొలి మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తుండగా కింద పడి భుజం స్థానభ్రంశం కావడంతో పేసర్ రీస్ టాప్లీ కొన్ని మ్యాచ్లకు దూరం కానున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
-
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు
-
వైకాపా నేతల సిఫార్సులతో పోస్టు.. మహిళా ఉద్యోగినులతో వెకిలి చేష్టలు