MS Dhoni: మహి అధ్యాయంలో మరో పేజీ?
ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ అయిపోయింది. ఎక్కువమంది కోరుకున్నట్లే చెన్నై సూపర్కింగ్స్ విజేతగా నిలిచింది. ఫైనల్ జరిగింది అహ్మదాబాద్లో అయినా.. స్టేడియంలో ఎటు చూసినా పసుపుమయం.
ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ అయిపోయింది. ఎక్కువమంది కోరుకున్నట్లే చెన్నై సూపర్కింగ్స్ విజేతగా నిలిచింది. ఫైనల్ జరిగింది అహ్మదాబాద్లో అయినా.. స్టేడియంలో ఎటు చూసినా పసుపుమయం. స్టేడియంలోని అభిమానులే కాదు.. దేశవ్యాప్తంగా కోట్లాది మంది సంబరాల్లో మునిగిపోయారు. సోమవారం అర్ధరాత్రి 1.30 వరకు చెన్నై గెలుస్తుందా లేదా అన్నదే ఉత్కంఠ! ఆ ఉత్కంఠ తీరిపోగానే కొత్త సందిగ్ధత మొదలైంది. సీఎస్కేకు అయిదో ట్రోఫీ అందించిన మహేంద్రసింగ్ ధోని.. ఇంతటితో నిష్క్రమిస్తాడా.. ఇంకో సీజన్ ఆడతాడా.. అన్నదే ఆ సందిగ్ధత!
ఈనాడు క్రీడావిభాగం
ధోని అంతర్జాతీయ క్రికెట్కు దూరమై నాలుగేళ్లు కావస్తోంది. ఇంకో అయిదు వారాల్లో అతడికి 42 ఏళ్లు నిండుతాయి. మోకాలి గాయం బాగా ఇబ్బంది పెడుతోంది. ఈ వయసులో, ఇలాంటి ఇబ్బందితో.. ఏడాదిలో పది నెలలు పోటీ క్రికెట్కు దూరంగా ఉంటూ ఫిట్నెస్, లయను కాపాడుకోవడం.. ప్రపంచ మేటి క్రికెటర్లు తలపడే ఐపీఎల్లో నెగ్గుకు రావడం అంటే మాటలు కాదు. అంతర్జాతీయ క్రికెట్ వదిలేశాక తర్వాతి ఐపీఎల్ సీజన్లోనే ధోని బ్యాటింగ్, ఫిట్నెస్ దెబ్బ తిన్నట్లుగా కనిపించడంతో అప్పట్నుంచే తన రిటైర్మెంట్ గురించి చర్చ మొదలైంది. అయితే జాతీయ జట్టులో అయితే ప్రదర్శన బాగా లేకుంటే.. యువ ఆటగాళ్లకు అవకాశం రాకుండా అడ్డు పడుతున్నాడనే విమర్శలు వస్తాయి. ఫ్రాంఛైజీ క్రికెట్లో అలాంటి సమస్య లేదు. ధోనీతో సీఎస్కే యాజమాన్యానికి ఎలాంటి ఇబ్బందీ లేకపోవడంతో వయసు మళ్లినా.. ఒకప్పటితో పోలిస్తే ప్రదర్శన తగ్గినా.. ధోని లీగ్లో కొనసాగుతున్నాడు. ఇక అభిమానుల ఆదరణ గురించైతే చెప్పాల్సిన పనే లేదు. ముఖ్యంగా చెన్నై వాసులు అతడినెలా ఆరాధిస్తారో తెలిసిందే. కరోనా కారణంగా మూడేళ్ల పాటు చెన్నైలో మ్యాచ్లు లేకపోవడంతో మళ్లీ అక్కడ ఐపీఎల్ మ్యాచ్ ఆడి కానీ రిటైర్ కానని ధోని గత సీజన్లోనే తేల్చి చెప్పేశాడు. ఈ సీజన్తో ఐపీఎల్ తిరిగి చెన్నైకి వచ్చింది. చెపాక్లో ఆడిన ఏడు మ్యాచ్లతో తమిళ అభిమానులను అలరించాడు ధోని. మహికి ఇదే చివరి సీజన్ కావచ్చన్న అంచనాతో.. అతను దేశంలో ఎక్కడికి వెళ్లినా అభిమానులు పోటెత్తారు. అతను బ్యాటు పట్టుకుని మైదానంలో అడుగు పెడితే చాలు స్టేడియాలు హోరెత్తిపోయాయి. బౌండరీ కొట్టినా.. క్యాచ్ పట్టినా.. స్టంపింగ్ చేసినా కేరింతలు మిన్నంటాయి. ధోని కనిపించిన ప్రతి క్షణాన్నీ అభిమానులు ఆస్వాదించారు. ధోని టాస్ కోసం వచ్చినపుడు, బహుమతి ప్రదానోత్సవంలో మైక్ అందుకున్నపుడు స్టేడియాల్లో అభిమానులు ఎంత హెచ్చు స్థాయిలో శబ్దాలు చేశారో ఫైనల్ సందర్భంగా ప్రసారదారు డెసిబల్స్లో కొలిచి మరీ చూపించడం తనకున్న క్రేజ్కు నిదర్శనం. ఇలా ఈ సీజన్ అంతా తన ఉనికితోనే అభిమానులను అలరిస్తూ వచ్చిన మహి.. మరోవైపు ఏమంత బలంగా కనిపించని సీఎస్కేను తన నాయకత్వ పటిమతో మరోమారు విజేతగా నిలిపి సంబరాలు మిన్నంటేలా చేశాడు. కెరీర్కు తెరదించాలనుకుంటే.. ధోనీకి ఇంతకంటే మంచి ముగింపు మళ్లీ దక్కకపోవచ్చేమో! కానీ ఫైనల్ అనంతరం ధోని రిటైర్మెంట్ ప్రకటన చేయకుండా ఉత్కంఠను కొనసాగించాడు.
ఔనంటే కాదనిలే.. కాదంటే ఔననిలే..: ధోని రిటైర్మెంట్ గురించి ఈ సీజన్ అంతా చర్చ జరగడానికి అతను చేసిన వ్యాఖ్యలు కూడా ఓ కారణం. ఈడెన్ గార్డెన్స్లో జరిగిన ఓ మ్యాచ్కు పెద్ద ఎత్తున అభిమానులు పసుపు జెర్సీలతో హాజరై తన నామస్మరణ చేయడం గురించి బహుమతి ప్రదానోత్సవంలో మాట్లాడుతూ.. బహుశా తనకు వీడ్కోలు పలకడానికి వచ్చారేమో అన్నాడు మహి. మరో సందర్భంలో తాను కెరీర్ చివరి దశలో ఉన్నట్లు చెప్పాడు. కానీ మరో మ్యాచ్ ఆరంభానికి ముందు ఇదే తన చివరి సీజన్ అన్నట్లుగా వ్యాఖ్యాత మోరిసన్ మాట్లాడితే.. ‘‘ఇదే చివరిదని మీరు నిర్ణయించేశారా’’ అంటూ నవ్వేశాడు. దీంతో మహి మరో సీజన్ ఆడతాడంటూ మోరిసన్ అభిమానుల కేరింతల మధ్య ప్రకటించాడు. ఇలా తన రిటైర్మెంట్పై సందిగ్ధతను కొనసాగిస్తూ వచ్చిన మహి.. ఫైనల్ మ్యాచ్ అయ్యాక ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన మీద ఇంత ప్రేమ కురిపిస్తున్న అభిమానులకు.. మరో సీజన్ ఆడటం ద్వారా బహుమతి ఇవ్వాలని ఉందని.. కానీ అది అంత తేలిక కాదని.. అందుకోసం తన వంతుగా చేయాల్సిందంతా చేస్తానని అన్నాడు కెప్టెన్ కూల్. ఇది అభిమానులకు గొప్ప ఉపశమనాన్ని ఇచ్చింది. ధోని ఇంకో సీజన్ కొనసాగుతాడనే ధీమాతో ఉన్నారిప్పుడు అభిమానులు. కానీ ధోని ఆలోచన తీరు అంచనాలకు అందనిది. అతను అవునంటే అవునని.. కాదంటే కాదని కాదు! రాబోయే రోజుల్లో అతడి నిర్ణయం ఎలా ఉంటుందో చెప్పలేం!
తన ఉనికే చాలు..: ఒక ఆటగాడు జట్టుకు భారం అయినప్పుడే రిటైర్మెంట్ గురించి ఆలోచించాల్సి ఉంటుంది. మరి ధోని ఆ స్థితిలో ఉన్నాడా అన్నది ప్రశ్న. నిజానికి మహి లాంటి ఆటగాళ్లు కొనసాగడానికి ఆటతీరుతో సంబంధమే లేదు. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే సచిన్ తర్వాత కేవలం తన ఉనికితో అభిమానులను ఉర్రూతలూగించే అరుదైన ఆటగాడు ధోనీ! మహి బ్యాటింగ్ సత్తా తగ్గి ఉండొచ్చు కానీ.. ఆ విషయంలో చెన్నై ఇప్పుడు తనపై ఆధారపడట్లేదు. కెప్టెన్గా అతడిలో చేవ తగ్గలేదనడానికి తాజా టైటిల్ విజయం రుజువు. వికెట్ కీపింగ్లో మహి చురుకుదనానికి ఫైనల్లో శుభ్మన్ స్టంపింగే నిదర్శనం. ఇప్పటికీ ఒక ఆటగాడిగా చెన్నై జట్టులో కొనసాగడానికి మహికి ఎలాంటి ఇబ్బందీ లేదు. వీటన్నింటికీ మించి చెన్నై ఫ్రాంఛైజీకి ధోని తెచ్చి పెడుతున్న విలువ ఏ స్థాయిదో అందరికీ తెలుసు. సీఎస్కే ఆకర్షణ అంతా ధోనీతోనే ముడిపడి ఉంది. కేవలం ధోని ఉనికే లక్షల మందిని స్టేడియాలకు రప్పిస్తుంది. అంతకు వందల రెట్లలో టీవీల ముందు కూర్చోబెడుతుంది. అతను ఆడడంటే ఇక క్రికెట్టే చూడం, చెన్నై ఫ్రాంఛైజీని అనుసరించని అభిమానుల సంఖ్య పెద్దదే! ఇక ఫ్రాంఛైజీకి, స్పాన్సర్లకు, ఐపీఎల్కు అతను చేకూర్చే ఆర్థిక ప్రయోజనం గురించీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాబట్టి ధోని నిష్క్రమణ ఎవ్వరికీ రుచించే విషయం కాదు. ధోని ఆడతానంటే చెన్నై ఫ్రాంఛైజీ ఎన్నేళ్లయినా అతణ్ని కొనసాగిస్తుంది. ఆటతీరుతో సంబంధం లేకుండా అభిమానులూ తనపై ఇంతే అభిమానం చూపిస్తారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని మహి ఇంకొక్క సీజన్ కొనసాగితే 2024 ఐపీఎల్ కూడా కళకళలాడనున్నట్లే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన