MS Dhoni: విజయవంతంగా ధోని మోకాలికి శస్త్రచికిత్స

ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ను అయిదోసారి విజేతగా నిలబెట్టిన కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని మోకాలికి విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది.

Updated : 02 Jun 2023 07:59 IST

దిల్లీ: ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ను అయిదోసారి విజేతగా నిలబెట్టిన కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని మోకాలికి విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. ముంబయిలో ప్రముఖ వైద్యుడు, బీసీసీఐ వైద్య ప్యానల్‌ సభ్యుడైన దిన్షా పర్దీవాలా నేతృత్వంలో గురువారం ఈ ఆపరేషన్‌ను నిర్వహించారు. ‘‘ముంబయిలోని కోకిలాబెన్‌ ఆసుపత్రిలో ధోని మోకాలికి శస్త్ర చికిత్స జరిగింది. ఒకటి రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి బయటకు వస్తాడు. వచ్చే ఏడాది ఐపీఎల్‌ వరకు కోలుకోవడానికి అతడికి చాలా సమయం ఉంది’’ అని సీఎస్కే మేనేజ్‌మెంట్‌ చెప్పింది. ఈ ఐపీఎల్‌ సీజన్లో మోకాలికి భారీ బ్యాండేజ్‌ వేసుకునే ధోని దాదాపు అన్ని మ్యాచ్‌లు ఆడాడు. కీపింగ్‌లో సమస్య లేకపోయినా.. బ్యాటింగ్‌లో వికెట్ల మధ్య పరుగెత్తడానికి ఇబ్బందిపడ్డాడు. శరీరం సహకరిస్తే మరో సీజన్‌ ఆడతానని.. కొన్ని నెలల్లో దీనిపై నిర్ణయం తీసుకుంటానని ఐపీఎల్‌ ఫైనల్‌ అనంతరం మహి చెప్పిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని