Praggnanandhaa: అమ్మ దిద్దిన ప్రజ్ఞ
అజర్బైజాన్ రాజధాని బాకులో చెస్ ప్రపంచకప్ జరుగుతోంది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులు, ప్రతినిధులు, టోర్నీ నిర్వాహకులతో టోర్నీ ప్రాంగణం కళకళలాడుతోంది.
అజర్బైజాన్ రాజధాని బాకులో చెస్ ప్రపంచకప్ జరుగుతోంది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులు, ప్రతినిధులు, టోర్నీ నిర్వాహకులతో టోర్నీ ప్రాంగణం కళకళలాడుతోంది. వీళ్లంతా సూట్లు, అధునాతన దుస్తులేసుకుని మెరిసిపోతుంటే.. చీర కట్టుకుని మన ఊర్లలో మహిళల్లా కనిపించేలా ఒక నడివయస్కురాలు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అక్కడ అలాంటి ఆహార్యంలో ఒక మహిళ ఉండటం చూసే వారికి చాలా చిత్రంగా అనిపిస్తోంది. ప్రపంచకప్ సెమీస్ జరుగుతుండగా.. ఆమె ఒంటరిగా ఆ ప్రాంగణంలో తిరుగుతోంది. కాసేపటి తర్వాత ఆమె కుర్చీలో కూర్చుని కన్నీళ్లు పెట్టుకుని చీర కొంగుతో తుడుచుకుంటూ కనిపించింది. కొన్ని నిమిషాలకు సెమీస్లో గెలిచిన క్రీడాకారుడు వచ్చి మైకు ముందు మాట్లాడుతుంటే తన పక్కనే ఆ మహిళ నిలబడింది. తన గేమ్ గురించి మాట్లాడ్డం అయిపోయాక ఆ మహిళను పట్టుకుని.. తన వెనుక ఉండి నడిపించేది ఆమే అని ఉద్వేగంతో చెప్పాడా క్రీడాకారుడు. కరువానా లాంటి మేటి చెస్ ప్లేయర్ను ఓడించి ప్రపంచకప్ ఫైనల్ చేరిన ఆ క్రీడాకారుడి తల్లి ఆమె. భారత చెస్ పతాకాన్ని ప్రపంచ స్థాయిలో ఎగురవేస్తున్న ప్రజ్ఞానంద ఛాంపియన్గా ఎదగడంలో ఆమె పాత్ర కీలకం. తన పేరు.. నాగలక్ష్మి.
ఈనాడు క్రీడావిభాగం
మాగ్నస్ కార్ల్సన్.. దశాబ్ద కాలంగా అప్రతిహత విజయాలతో ప్రపంచ చెస్ను ఏలుతున్న మహారాజు! అతడి ధాటికి విశ్వనాథన్ ఆనంద్ సహా ఎందరో దిగ్గజాలు నిలవలేకపోయారు. ప్రపంచ ఛాంపియన్షిప్లో వరుసగా టైటిళ్లు గెలిచి గెలిచి మొహం మొత్తేసి.. ఇక ఆ టోర్నీ నేనాడను అంటూ పోటీ నుంచే వైదొలిగిన స్థాయి అతడిది. అలాంటి ఆటగాడిని ఏడాది వ్యవధిలో మూడుసార్లు ఓడించిన సంచలన క్రీడాకారుడు ప్రజ్ఞానంద(Praggnanandhaa). కేవలం 12 ఏళ్ల 10 నెలల వయసులోనే గ్రాండ్మాస్టర్ అయి భారత్ తరఫున ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలవడం మొదలు భారత చెస్లో అతను రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ కుర్రాడిని చెస్లోకి తీసుకొచ్చింది, ఇప్పటికీ తన వెంటే ఉండి నడిపిస్తున్నది తల్లి నాగలక్ష్మినే. ప్రజ్ఞానంద తండ్రి రమేశ్ బాబు బ్యాంకు ఉద్యోగి కాగా.. తల్లి గృహిణి. ప్రజ్ఞానంద సోదరి వైశాలి ప్రస్తుతం మహిళల ఇంటర్నేషనల్ మాస్టర్. ఆమె టీవీతోనే ఎక్కువ సమయం కాలక్షేపం చేస్తోందని తనకు చెస్ బోర్డు కొనిచ్చింది తల్లి. అదే సమయంలో ప్రజ్ఞానందకు కూడా ఈ ఆటపై ఆసక్తి కలిగింది. ఈ ఆటలోకి అడుగు పెట్టే సమయానికి తన వయసు నాలుగున్నరేళ్లే. అక్కతో కలిసి ఆడుతూ ఆటపై కాస్త పట్టు సాధించాక.. త్యాగరాజన్ అనే కోచ్ దగ్గర అతను శిక్షణకు చేరాడు. స్వీయ ప్రతిభకు శిక్షణ తోడవడంతో పిన్న వయసులోనే పెద్ద వాళ్ల మీద గెలుస్తూ ఆటలో ఎదిగాడు.
బాల మేధావిగా పేరు తెచ్చుకున్న ప్రజ్ఞానంద 10 ఏళ్ల 10 నెలలకే ఇంటర్నేషనల్ మాస్టర్ అయి ప్రపంచ చెస్ చరిత్రలోనే ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడయ్యాడు. ఇంకో రెండేళ్లకే గ్రాండ్మాస్టర్ ఘనతా సాధించాడు. ప్రజ్ఞానంద ప్రతిభకు ఆనంద్ సహా ఎందరో ముగ్ధులయ్యారు. ఏకంగా అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచి.. ప్రత్యర్థులకు కొరక రాని కొయ్యలా మారిన కార్ల్సన్ను 16 ఏళ్ల వయసులోనే ఓడించి సంచలనం రేపడమే కాక ఏడాది వ్యవధిలో ఇంకో రెండుసార్లు అతడిపై పైచేయి సాధించడంతో చెస్ ప్రపంచంలో తన పేరు మార్మోగింది. ఇప్పుడు చెస్ ప్రపంచకప్లో కరువానా లాంటి మేటి ఆటగాడిని ఓడించి కార్ల్సన్తో ఫైనల్ పోరుకు అర్హత సాధించాడు. ప్రపంచకప్లో ప్రజ్ఞానంద ప్రదర్శన దిగ్గజ క్రీడాకారుడు కాస్పరోవ్ను సైతం మెప్పించింది. చిన్నతనం నుంచి స్థానిక టోర్నీలైనా.. అంతర్జాతీయ స్థాయిలో తలపడ్డా.. తన వెంట తల్లి నాగలక్ష్మి ఉండాల్సిందే. నాగలక్ష్మి లాంటి మధ్య తరగతి మహిళలు పిల్లల వెంట విదేశాలకు వెళ్లి టోర్నీల కోసం తిరగాలంటే కంగారు పడతారు. కానీ ఆమె మాత్రం కొడుకు వెంటే ఉండి అతడికి భరోసానివ్వడానికే చూస్తుంది. కాస్పరోవ్ అంతటి వాడు ప్రజ్ఞానంద ఆటను ప్రశంసిస్తూనే.. అతడికి తల్లి ఇస్తున్న ప్రోత్సాహాన్ని కొనియాడాడు.
డ్రాతో మొదలు.. కార్ల్సన్తో ఫైనల్
బాకు: ఫిడె చెస్ ప్రపంచకప్లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరిన భారత యువ సంచలనం ప్రజ్ఞానంద.. ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్తో తుదిపోరును డ్రాతో ఆరంభించాడు. మంగళవారం ఫైనల్ తొలి రౌండ్లో వీళ్లిద్దరూ పాయింట్లు పంచుకున్నారు. ఇప్పటికే మూడుసార్లు కార్ల్సన్ను ఓడించడమే కాక.. సెమీస్లో కరువానా లాంటి మేటి క్రీడాకారుడిపై విజయం సాధించిన ప్రజ్ఞానంద.. తుది పోరులో ఉత్తమ ప్రదర్శన చేశాడు. కార్ల్సన్ను నిలువరించి 35 ఎత్తుల్లో గేమ్ను డ్రాగా ముగించాడు. తెల్లపావులతో ఆడిన ప్రజ్ఞానందకు కార్ల్సనేడ్రా ప్రతిపాదన చేయడం విశేషం. రెండో గేమ్ బుధవారం జరుగుతుంది. అది కూడా డ్రా అయితే విజేతను నిర్ణయించడానికి టైబ్రేక్ నిర్వహిస్తారు. ‘‘గేమ్లో నేనెక్కడా ఇబ్బంది పడలేదు. రెండో గేమ్లో కూడా హోరాహోరీగా ఉంటుందనుకుంటున్నా. నా ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తా. ఇప్పుడిక విశ్రాంతి తీసుకుని రెండో గేమ్కు తాజాగా వస్తా’’ అని తొలి గేమ్ అనంతరం ప్రజ్ఞానంద వ్యాఖ్యానించాడు. కలుషిత ఆహారం తన ఆరోగ్యంపై ప్రభావం చూపడంతో తొలి గేమ్కు తాను ఉత్తమ స్థితిలో లేనని కార్ల్సన్ వెల్లడించాడు. ‘‘ప్రజ్ఞానంద ముందు రోజే టైబ్రేక్ ఆడాడు. నాకు తనకంటే ఒక రోజు ఎక్కువ విశ్రాంతి లభించడం కలిసొచ్చే విషయమే. కానీ అబసోవ్తో గేమ్ తర్వాత కలుషిత ఆహారం వల్ల ఇబ్బంది పడ్డా. రెండు రోజుల పాటు సరిగా తినలేదు. నాకు తగినంత శక్తి లేదు’’ అని అతనన్నాడు.
వాళ్లింట్లో తెలుగు
ప్రజ్ఞానంద కుటుంబంలో తెలుగు మూలాలుండటం విశేషం. అతడి తండ్రి రమేశ్ బాబు తెలుగువారే. వీరిది చెన్నైలో స్థిరపడ్డ తెలుగు కుటుంబం. రమేశ్తో పాటు ఆయన భార్య నాగలక్ష్మి కూడా తెలుగు మాట్లాడుతుంది. ఇంట్లో పెద్ద వాళ్లు తెలుగులోనే సంభాషించుకుంటారట. అయితే ప్రజ్ఞానందకు, అతడి సోదరి వైశాలికి తెలుగు అర్థమవుతుంది కానీ.. మాట్లాడలేరట. ఒక ఇంటర్వ్యూలో నాగలక్ష్మే స్వయంగా ఈ విషయం వెల్లడించింది. తమ ఇంట్లో తెలుగు సినిమాలు కూడా చూస్తుంటామని ఆమె చెప్పింది.
‘‘ప్రజ్ఞానంద ఎదుగుదల తాలూకు ఘనతంతా నా భార్యకే కట్టబెడతా. ఆమె చిన్నతనం నుంచి అతడికి ఎంతగానో మద్దతుగా నిలుస్తోంది. తనే అతణ్ని టోర్నీలకు తీసుకెళ్తుంటుంది. ఇద్దరు పిల్లల్ని ఎంతో గొప్పగా తీర్చిదిద్దింది. టీవీ వీక్షణం నుంచి దృష్టి మళ్లించడానికి చెస్ నేర్పిస్తే ఇద్దరికీ ఆ ఆట బాగా నచ్చేసింది’’
రమేశ్ బాబు, ప్రజ్ఞానంద తండ్రి
‘‘ప్రజ్ఞానందతో పాటు ఆమె తల్లికి కూడా శుభాకాంక్షలు. ప్రతి టోర్నీలోనూ తన వెంటే ఉంటూ ప్రత్యేకమైన మద్దతునిచ్చే ఆమె ఇప్పుడు గర్విస్తూ ఉంటుంది. ఈ చెన్నై ఆటగాడు న్యూయార్క్ కౌబాయ్లను ఓడించాడు. ప్రతికూల పరిస్థితుల్లో అతను గొప్ప పట్టుదలను ప్రదర్శించాడు’’
కాస్పరోవ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దంచికొట్టిన డుప్లెసిస్, కోహ్లీ.. గుజరాత్పై బెంగళూరు విజయం
ఐపీఎల్-2024లో బెంగళూరు జట్టుకు హ్యాట్రిక్ విన్. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. -
మహీభాయ్ ఇంకా ఆడాలి... క్రికెట్లో నాకు తండ్రిలాంటివారు: పతిరన
‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ మద్దతుతో ఐపీఎల్లో శ్రీలంక పేసర్ పతిరన అదరగొట్టేస్తున్నాడు. యువ ‘మలింగ’గా పేరొందిన అతడు చెన్నై తరఫున ఆడుతూ రాటుదేలాడు. -
MS Dhoni: 103 ఏళ్ల అభిమానికి ఎమ్ఎస్ ధోనీ అపురూపమైన కానుక.. వీడియో
తన 103 ఏళ్ల అభిమానికి ఎమ్ఎస్ ధోనీ ఓ అపురూపమైన కానుక అందించారు. తాను స్వయంగా ఆటోగ్రాఫ్ పెట్టిన చెన్నై జెర్సీని.. ఆయనకు బహుమతిగా ఇచ్చారు. ఆ జెర్సీని అందుకున్న రాందాస్ ఎంతగానో మురిసిపోయారు. వీడియో మీరూ చూడండి.
-
ముంబయి ఘోర ప్రదర్శన.. అత్యంత కన్ఫ్యూజ్డ్ టీమ్ ఇదేనేమో : గ్రేమ్ స్మిత్
ముంబయి వరుస పరాజయాలతో ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించింది. చివరి మూడు మ్యాచుల్లో గెలిచినా నాకౌట్ దశకు చేరుకోవడం కష్టమే. గెలుస్తామనుకున్న మ్యాచుల్లోనే ఓటమిపాలై అభిమానులను నిరాశకు గురి చేసింది. -
టీ20ల్లో ‘యాంకర్’ పదానికి చోటే లేదు.. కోహ్లీ బ్యాటింగ్లో గేర్లు ఎక్కువే: మూడీ
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) మళ్లీ పొట్టి కప్ బరిలోకి దిగబోతున్నాడు. ఈసారైనా తన ప్రపంచ కప్ కలను నెరవేర్చుకోవాలంటే కీలకమైన మూడో స్థానంలో అద్భుత ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. -
డేవిడ్ వార్నర్.. 70 శాతం ఇండియన్ - 30 శాతం ఆస్ట్రేలియన్: జేక్ ఫ్రేజర్
డేవిడ్ వార్నర్ మైదానంలో దూకుడుగా ఆడేస్తాడు. సోషల్ మీడియాలో వీడియోలతో అభిమానులను అలరిస్తాడు. భారత క్రికెట్ అభిమానులకు చాలా దగ్గరైన ఆటగాళ్లలో వార్నర్ ఒకడు. -
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
టీ20 ప్రపంచ కప్ కోసం ప్రకటించిన జట్టు గురించి భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. సరైన జట్టును ఎంపిక చేశారని సెలక్టర్లను అభినందించాడు. -
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు
భారీగా పరుగులు చేస్తున్నా.. విరాట్ కోహ్లీపై విమర్శలు మాత్రం ఆగడం లేదు. వాటిని భారత మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్, కైఫ్ కొట్టిపడేశారు. -
రోహిత్కు ఏమైంది? ఇంపాక్ట్ ప్లేయర్గా రావడానికి కారణమిదే!
ముంబయి స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ కోల్కతాతో జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్కు రాలేదు. అతడిని ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్గా వెల్లడించడం గమనార్హం. -
టోర్నీ నుంచి ఔట్.. చాలా ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేం: హార్దిక్
ఐపీఎల్ 2024 సీజన్ ముంబయికి కలిసిరాలేదు. ఆరంభం నుంచే ఓటములతో సతమతమవుతున్న ఆ జట్టు.. ప్లేఆఫ్స్ అవకాశాలను కోల్పోయింది. -
హైబ్రిడ్ పిచ్ల మీద ఐపీఎల్ మ్యాచ్లు... సరికొత్త ప్రయోగం ఫలిస్తుందా?
SisGrass Hybrid Pitch: ధర్మశాల వేదికగా జరగబోయే ఐపీఎల్ మ్యాచుల్లో హైబ్రిడ్ పిచ్లను వాడనున్నారు. ఏంటా పిచ్లు, ఎందుకు వాడుతున్నారు? -
అమెరికా జట్టులో మనోళ్లదే జోరు
టీ20 ప్రపంచకప్ కోసం శుక్రవారం ప్రకటించిన అమెరికా జట్టులో భారత సంతతి ఆటగాళ్లే ఎక్కువగా ఉన్నారు. 15 మంది ఆటగాళ్ల జాబితాలో ఏడుగురికి భారత మూలాలుండటం విశేషం. -
ముంబయి కథ ముగిసె!
ఐపీఎల్-17లో ఇక ముంబయి ఇండియన్స్ అభిమానులకు ఫలితాల గురించి బెంగ లేదు! ప్లేఆఫ్స్ సమీకరణాల గురించి వాళ్లు బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు! ఈ సీజన్లో ముంబయి కథ ముగిసినట్లే. -
వన్డేలు, టీ20ల్లో భారత్ నం.1
ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత జట్టు వన్డేలు, టీ20ల్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. కానీ టెస్టుల్లో మాత్రం నంబర్వన్ ర్యాంకు టీమ్ఇండియా చేజారింది. ఆస్ట్రేలియా తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. -
రెండో టైటిల్ ఎవరికో?
గతేడాది సెప్టెంబర్లో ఆరంభం.. ఆరు నెలలకు పైగా ఫుట్బాల్ వినోదం.. 12 జట్లు.. అలరించిన 138 మ్యాచ్లు. ఇంత సుదీర్ఘంగా సాగిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) పదో సీజన్లో ఆఖరి సమరానికి సమయం ఆసన్నమైంది. -
విదేశాల్లో పోటీలకు జ్యోతి
పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించే దిశగా విదేశాల్లో పోటీల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ సంచలన స్ప్రింటర్ జ్యోతి యర్రాజికి అనుమతి లభించింది. జ్యోతితో పాటు లాంగ్జంప్ అథ్లెట్ శైలి సింగ్ ప్రతిపాదనలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. -
ఐపీఎల్లో అదే నా పాత్ర
ఆరంభంలో వికెట్లు కోల్పోయిన జట్టు ఇన్నింగ్స్ను నిర్మించడమే తన పాత్ర కర్తవ్యమని సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి చెప్పాడు. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో 35/2తో కష్టాల్లో పడ్డ జట్టును 76 పరుగుల అజేయ ఇన్నింగ్స్తో నితీశ్ ఆదుకున్న సంగతి తెలిసిందే. -
ఇష్టమైన ఆటగాడిగా నితీశ్
తనకు ఇష్టమైన క్రికెటర్లలో ఒకడిగా సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆటగాడు నితీశ్ రెడ్డి మారుతున్నాడని ఆస్ట్రేలియా దిగ్గజ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ పేర్కొన్నాడు. ‘‘కచ్చితంగా చూడగలిగే నాకిష్టమైన ఆటగాళ్లలో ఒకడిగా నితీశ్ మారుతున్నాడు. -
ప్రపంచ రిలే బరిలో ‘లక్ష్య’ జ్యోతిక
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే టోర్నీలో భారత జట్టు తన అదృష్టం పరీక్షించుకోనుంది. శనివారం ప్రారంభమయ్యే ఈ పోటీల్లో పారిస్ ఒలింపిక్స్ బెర్తే లక్ష్యంగా భారత బృందం బరిలో దిగుతుంది. -
రింకుకు ఇది ఆరంభమే: గంగూలీ
టీ20 ప్రపంచకప్కు ఎంపిక కానంత మాత్రాన బాధపడక్కర్లేదని రింకు సింగ్కు ఇది ఆరంభం మాత్రమేనని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. ‘‘టీ20 ప్రపంచకప్లో ఎక్కువ మ్యాచ్లు జరిగేది వెస్టిండీస్లో. -
బంగ్లాదే తొలి టీ20
తంజిద్ హసన్ (67 నాటౌట్; 47 బంతుల్లో 8×4, 2×6) సత్తా చాటడంతో జింబాబ్వేతో టీ20 సిరీస్లో బంగ్లాదేశ్ బోణీ కొట్టింది. శుక్రవారం తొలి టీ20లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.