Rohit Sharma: మేమూ తప్పులు చేయొచ్చు
వన్డే ప్రపంచకప్ అంటే ఒత్తిడి తప్పక ఉంటుంది. సొంతగడ్డపై అయితే ఇక చెప్పక్కర్లేదు. అయితే తాను మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ప్రశాంతంగా ఉంటానని అంటున్నాడు టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ.
వన్డే ప్రపంచకప్ అంటే ఒత్తిడి తప్పక ఉంటుంది. సొంతగడ్డపై అయితే ఇక చెప్పక్కర్లేదు. అయితే తాను మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ప్రశాంతంగా ఉంటానని అంటున్నాడు టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ. బెంగళూరులో ఆసియాకప్ శిబిరంలో చేరడానికి ముందు పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించి, జట్టు గురించి, ప్రపంచకప్ గురించి రోహిత్ ఎన్నో విషయాలు చెప్పాడు. ఆ విశేషాలు అతడి మాటల్లోనే..
బెంగళూరు: అనుకూలమైనవైనా, ప్రతికూలమైనవైనా.. బయటి అంశాలు పోషించే పాత్ర గురించి ఆలోచించకోకుండా నన్ను నేను ప్రశాంతంగా ఉంచుకోవడం నాకు ముఖ్యం. వాటిని పూర్తిగా విస్మరించాలనుకుంటున్నా. 2019 ప్రపంచకప్కు ముందు ఉన్న దశలోకి వెళ్లాలనుకుంటున్నా. ఆ టోర్నీ (అయిదు శతకాల సహాయంతో 648 చేశాడు) సమయంలో నేను మానసికంగా గొప్ప స్థితిలో ఉన్నా. బాగా సన్నద్ధమయ్యా. ఇప్పుడూ అలాంటి స్థితిలోనే ఉండాలనుకుంటున్నా. అందుకు నాకు తగినంత సమయం ఉంది. 2019 ప్రపంచకప్కు ముందు క్రికెటర్గా, వ్యక్తిగా నేను చేసిన సరైన పనులేంటో గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా.
వాళ్ల స్థానంలో ఉండి ఆలోచిస్తా..: అత్యుత్తమ కూర్పును ఎంచుకునే సమయంలో వివిధ కారణాల వల్ల కొందరు జట్టులో చోటు కోల్పోతారు. రాహుల్ భాయ్ (ద్రవిడ్), నేను వాళ్లెందుకు జట్టులో లేరో వివరించడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తాం. ప్రతి సెలక్షన్ తర్వాత, తుది జట్టును ప్రకటించాక మేం ఆటగాళ్లతో మాట్లాడతాం. ఒక్కొక్కరితో ముఖాముఖితో మాట్లాడి, వాళ్లనెందుకు తీసుకోలేదో చెబుతాం. కొన్నిసార్లు నేను వాళ్ల స్థానంలో ఉండి ఆలోచిస్తా. 2011 ప్రపంచకప్కు ఎంపిక కానప్పుడు నా గుండె బద్ధలైంది. ప్రపంచకప్ జట్టు నుంచి తప్పించాక ఇంకేం మిగిలుంది అనిపించింది. నేను, కోచ్లు, సెలక్టర్లు కలిసి.. ప్రత్యర్థి, పిచ్లు, మా బలాలు, వాళ్ల బలహీనతలు లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఒక ఉమ్మడి అభిప్రాయానికి వస్తాం. అయితే మా నిర్ణయాలు తప్పయ్యే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ఏదేమైనా కొందరు వ్యక్తులు నిర్ణయాలు తీసుకోవాలి. మనుషులన్నాక తప్పులు చేస్తారు. మేం అన్నిసార్లూ సరైన నిర్ణయాలు తీసుకోకపోవచ్చు. నా వ్యక్తిగత ఇష్టాయిష్టాల ఆధారంగా ఆటగాళ్లను తీసుకోకపోవడం, తీసుకోవడమనేది ఉండదు. ఎవరికైనా అవకాశం రాలేదంటే దానికి కారణం ఉంటుంది.
అప్పుడు యువీ ఓదార్చాడు: 2011 ప్రపంచకప్ జట్టును ప్రకటించాక నేను నా గదిలో విచారంగా కూర్చుని ఉన్నా. ఏం చేయాలో తెలియలేదు. అప్పుడు యువరాజ్ నన్ను తన గదికి పిలిచాడు. డిన్నర్కు తీసుకెళ్లాడు. జట్టుకు ఎంపిక కానప్పుడు ఎంత బాధగా ఉంటుందో చెప్పాడు. ‘‘నువ్వు ఇంకా చాలా ఏళ్లు క్రికెట్ ఆడగలవు. బాగా కష్టపడు. నైపుణ్యాలను పెంచుకుని తిరిగి జట్టులోకి రా. నువ్వు మళ్లీ భారత్కు ఆడకుండా ఉండే అవకాశం లేదు. నీకు ప్రపంచకప్లో ఆడే అవకాశం తప్పక వస్తుంది’’ అని చెప్పాడు. ఓసారి ప్రపంచకప్ జట్టులో స్థానం కోల్పోయిన నాకు ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
శ్రీలంకతో టీమ్ ఇండియా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ రెండు ఫార్మాట్లకు శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్గా ఎంపికైన విషయం తెలిసిందే. -
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
గాయం కారణంగా టీమ్కు దూరమైన స్టార్ పేసర్ షమీ.. తిరిగి జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. -
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు