Mohammed Siraj: సిరాజసం!
శ్రీలంకతో ఫైనల్లో అసాధారణ ప్రదర్శన చేసిన సిరాజ్ను తిట్టుకున్న అభిమానులూ లేకపోలేదు! అదేంటీ.. సంచలన బౌలింగ్తో జట్టుకు ఆసియా కప్ను అందించిన సిరాజ్ను తిట్టుకోవడం ఏమిటీ? అనుకుంటున్నారా! ఆదివారం రోజు చక్కగా ఈ తుదిపోరును ఆస్వాదిద్దామని, మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందని అభిమానులు ఆశించారు.
శ్రీలంకతో ఫైనల్లో అసాధారణ ప్రదర్శన చేసిన సిరాజ్ను తిట్టుకున్న అభిమానులూ లేకపోలేదు! అదేంటీ.. సంచలన బౌలింగ్తో జట్టుకు ఆసియా కప్ను అందించిన సిరాజ్ను తిట్టుకోవడం ఏమిటీ? అనుకుంటున్నారా! ఆదివారం రోజు చక్కగా ఈ తుదిపోరును ఆస్వాదిద్దామని, మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందని అభిమానులు ఆశించారు. కానీ సిరాజ్ మాత్రం టపటపా వికెట్లు పడగొట్టి.. ప్రణాళికలను మార్చేశాడు. మ్యాచ్ ఏకపక్షమైనందుకు సిరాజ్ను తిట్టుకున్నా.. అతడి ప్రదర్శనకు అబ్బురపడని అభిమాని లేడు. పరుగులు ఇచ్చేస్తున్నాడు.. వికెట్లు తీయడం లేదంటూ విమర్శలు ఎదుర్కొన్న స్థాయి నుంచి ఇప్పుడు జట్టులో కీలక పేసర్గా సిరాజ్ ఎదిగిన తీరు అసాధారణం.
ఈనాడు క్రీడావిభాగం
మహమ్మద్ సిరాజ్.. ప్రతిభ, నైపుణ్యాలకు కొదవలేని పేసర్. మంచి పేస్, సీమ్, స్వింగ్ రాబట్టగల బౌలర్. అతణ్ని సరైన విధంగా వాడుకుంటే ఎలాంటి సంచలనాలు సృష్టించగలడో శ్రీలంకతో మ్యాచ్లో ఈ హైదరాబాదీ పేసర్ చూపించాడు. ఆటో డ్రైవర్ తనయుడిగా మొదలై.. గల్లీల్లో క్రికెట్ ఆడి.. ఇప్పుడు టీమ్ఇండియాలో ప్రధాన పేసర్లలో ఒకడిగా అతను ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకం. అతనిలోని నైపుణ్యాలను జాగ్రత్తగా సానబెడుతూ సరైన దిశగా ఉపయోగించుకుంటున్న టీమ్ఇండియా మేనేజ్మెంట్నూ ఈ విషయంలో అభినందించాల్సిందే. నాణ్యమైన ముడి సరుకు సిరాజ్ లోపల చాలానే ఉంది. ఆరంభంలో దీన్ని బయటకు తేలేక, నియంత్రణ లేక బౌలింగ్లో అతను తడబడ్డాడు. 2017 ఐపీఎల్ అరంగేట్రంలోనే సిరాజ్ సన్రైజర్స్ తరపున 6 మ్యాచ్ల్లో 10 వికెట్లతో సత్తాచాటాడు. కానీ ఆ తర్వాత నిలకడ కోల్పోయాడు. టీమ్ఇండియాలో అడుగుపెట్టిన కొత్తలోనూ అంచనాలు అందుకోవడంలో విఫలమయ్యాడు. అయినప్పటికీ మెరుగుపడాలనే ప్రయత్నాన్ని వదల్లేదు. పట్టుదలగా ముందుకు సాగాడు. ఈ విషయంలో కోహ్లి.. సిరాజ్కు అండగా నిలిచాడు. అటు ఐపీఎల్లో 2018 నుంచి ఆర్సీబీ తరపున, ఇటు టీమ్ఇండియా తరపున సిరాజ్ను కోహ్లి ప్రోత్సహిస్తూనే వస్తున్నాడు. ఇప్పుడు మూడు ఫార్మాట్లలోనూ జట్టుకు కీలక బౌలర్గా సిరాజ్ మారాడు.
ఈ ఏడాది జోరు..: ఈ ఏడాదిలో సిరాజ్ జోరు మామూలుగా లేదు. 2023 ఐపీఎల్లో 14 మ్యాచ్ల్లో 19 వికెట్లతో అదరగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్లోనూ అత్యుత్తమ ప్రదర్శనతో సాగుతున్నాడు. 2019లో వన్డేల్లో అడుగుపెట్టిన అతను.. ఈ ఏడాది ఇప్పటివరకూ 13 వన్డేల్లో 12.86 సగటుతో 29 వికెట్లు పడగొట్టడం విశేషం. ఓవరాల్గా 29 వన్డేల్లో 19.11 సగటుతో 53 వికెట్లు సాధించాడు. బంతుల పరంగా అత్యధిక వేగంగా వన్డేలో 50 వికెట్లు తీసిన తొలి పేసర్ సిరాజే. సీనియర్ పేసర్ షమిని కాదని ప్రపంచకప్ నేపథ్యంలో సిరాజ్కే ప్రాధాన్యత ఇవ్వడానికి ఈ గణాంకాలే రుజువు. ఆఫ్స్టంప్ ఆవల బంతిని వేస్తూ బయటకు, లోపలికి స్వింగ్ చేయడంలో సిరాజ్ పట్టు సాధించాడు. బ్యాటర్ల కాళ్ల కదలికలను పసిగడుతూ స్టంప్స్కు గురిపెడుతూ వికెట్ల వేటలో సాగుతున్నాడు. ఇప్పుడు వన్డేల్లో శ్రీలంకపై అత్యుత్తమ గణంకాలు నమోదు చేసిన బౌలర్గా సిరాజ్ నిలిచాడు. తండ్రి మరణాన్ని విని తన్నుకొస్తున్న దుఃఖాన్ని తట్టుకుని ఆస్ట్రేలియాలో బోర్డర్ గావస్కర్ సిరీస్లో జట్టు బౌలింగ్ దాడిని కొనసాగించిన అతని ఆత్మస్థైర్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడదే ఆత్మవిశ్వాసంతో ప్రపంచకప్లో రాణించి జట్టును విజేతగా నిలపాలనే లక్ష్యంతో సాగుతున్నాడు.
శ్రీలంకతో మ్యాచ్లో బౌలింగ్లో చెలరేగిన సిరాజ్.. ఆట ముగిశాక గొప్ప మనసు చాటుకున్నాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కింద వచ్చిన రూ.4.15 లక్షలను గ్రౌండ్స్మెన్కు ఇచ్చేశాడు.
1
అంతర్జాతీయ క్రికెట్లో ఓ ఓవర్లో 4 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్ సిరాజ్. వన్డేల్లో వాస్ (2003), సమి (2003), ఆదిల్ రషీద్ (2019)ల తర్వాత ఘనత సాధించింది సిరాజే.
6/21
శ్రీలంకపై సిరాజ్ గణాంకాలు. అతనికిదే అత్యుత్తమ ప్రదర్శన. ఇది వన్డేల్లో భారత్ తరపున నాలుగో అత్యుత్తమ ప్రదర్శన.
129
ఫైనల్లో పడ్డ బంతులు. తక్కువ బంతుల్లో ముగిసిన మూడో పూర్తి స్థాయి వన్డే ఇది. మిగిలిన బంతుల (263) పరంగా వన్డేల్లో భారత్కిదే అతిపెద్ద విజయం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెలరేగిన సంజు, జురెల్.. లఖ్నవూపై రాజస్థాన్ విజయం
ఐపీఎల్-2024లో రాజస్థాన్ ఎనిమిదో విజయాన్ని నమోదు చేసింది. -
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
ఐపీఎల్-17లో దిల్లీ ఐదో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ముంబయితో జరిగిన మ్యాచ్లో 10 పరుగుల తేడాతో గెలుపొందింది. -
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
టీ20 ప్రపంచ కప్ జట్టులో స్థానం కోసం తీవ్ర పోటీ ఉంది. సీనియర్లతోపాటు యువ క్రికెటర్లు బరిలో నిలిచారు. -
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
భారత ఆర్చరీ బృందం అద్భుత ప్రదర్శన చేసింది. ఆర్చరీ వరల్డ్ కప్లో మూడు కేటగిరీల్లో స్వర్ణాలను గెలుచుకుంది. -
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
చెలరేగిన సంజు, జురెల్.. లఖ్నవూపై రాజస్థాన్ విజయం
-
మందుగుండు సామగ్రి పేలి.. 20 మంది సైనికులు మృతి!
-
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం రూ.11,672 కోట్లు.. ఒక్కో షేరుకు ₹10 డివిడెండ్
-
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య కలచివేసింది: సీవీ ఆనంద్
-
డ్రగ్ తయారీ మాఫియా గుట్టురట్టు.. 300 కేజీలు స్వాధీనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM