ODI WC 2023: తేల్చుకోవాలిక..
వన్డే ప్రపంచకప్కు ఇంకో రెండు వారాలే సమయం ఉంది. ఇంకా ఈ మెగా టోర్నీలో ఆడే భారత జట్టుపై కచ్చితంగా ఓ అంచనాకు రాలేని పరిస్థితి! సొంతగడ్డపై భారీ అంచనాలతో బరిలోకి దిగుతున్న రోహిత్ సేన..
క్రికెట్ ప్రపంచకప్ మరో 15 రోజుల్లో
వన్డే ప్రపంచకప్కు ఇంకో రెండు వారాలే సమయం ఉంది. ఇంకా ఈ మెగా టోర్నీలో ఆడే భారత జట్టుపై కచ్చితంగా ఓ అంచనాకు రాలేని పరిస్థితి! సొంతగడ్డపై భారీ అంచనాలతో బరిలోకి దిగుతున్న రోహిత్ సేన.. వీలైనంత త్వరగా జట్టుపై తేల్చుకోకుంటే అది టోర్నీలో మన అవకాశాలనే దెబ్బ తీసే ప్రమాదముంది.
ఈనాడు క్రీడావిభాగం
ప్రపంచకప్ లాంటి పెద్ద టోర్నీల్లో విజేతగా నిలవాలంటే ముందు సరైన జట్టును ఎంచుకోవడం కీలకం. టోర్నీకి కొన్ని నెలల ముందే ప్రపంచకప్ ఆడే ఆటగాళ్లపై ఒక అంచనాతో ఉండటం.. కనీసం నెల ముందే జట్టును ప్రకటించి ఆ ఆటగాళ్లతోనే ముందుకు సాగడం అవసరం. అయితే టీమ్ఇండియా మాత్రం సొంతగడ్డపై జరిగే మెగా టోర్నీకి జట్టును ఎంపిక చేసే విషయంలో మల్లగుల్లాలు పడుతూనే వచ్చింది. నెల ముందు జట్టునైతే ప్రకటించారు కానీ.. రెండు స్థానాల విషయంలో సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. గాయాల నుంచి కోలుకుని ఆసియా కప్ జట్టులోకి ఎంపికైన శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ల విషయంలో అనేక సందేహాలు నెలకొన్నాయి. వీరిలో కేఎల్ రాహల్ సూపర్-4 దశ నుంచి జట్టులోకి వచ్చాడు. ఫిట్నెస్ పరంగా అతడికి ఏ ఇబ్బందులూ కనిపించలేదు. ఫామ్ కూడా చాటుకున్నాడు. రాహుల్ విషయంలో ఆందోళన తీరిపోయింది.
కానీ టోర్నీ తొలి రెండు మ్యాచ్ల్లో ఆడిన శ్రేయస్ అయ్యర్ విషయంలో తర్వాత సందిగ్ధత తప్పలేదు. వెన్నునొప్పి తిరగబెట్టడంతో అతను టోర్నీలో తర్వాతి మ్యాచ్లకు అందుబాటులో లేకుండా పోయాడు. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్కు అతను జట్టులో చోటు సంపాదించినప్పటికీ.. ఫిట్నెస్ సాధిస్తాడా, తుది జట్టులో ఉంటాడా అన్నది అనుమానంగానే ఉంది. శ్రేయస్ ఫామ్ చాటుకుని తుది జట్టులో స్థానాన్ని ఖాయం చేసుకుంటాడని అనుకుంటే.. రెండు మ్యాచ్లకే బెంచ్ మీదికి వెళ్లిపోవడం అనూహ్యం. ప్రపంచకప్కు రెండు వారాల ముందు ఈ స్థితిలో ఉన్న ఆటగాడు ఆ టోర్నీలో ఆడి జట్టుకు ఉపయోగపడతాడని ఎలా ఆశించగలం? శ్రేయస్ విషయంలో సందిగ్ధత కొనసాగుతుండగానే.. అక్షర్ పటేల్ గాయపడ్డాడు. అతను మూడు రకాల గాయాలతో ఇబ్బంది పడుతున్నాడు. అవేవీ తీవ్రమైనవి కాకపోయినా.. ప్రపంచకప్ ముంగిట అక్షర్ ఇలా జట్టుకు దూరం కావడంతో ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో అశ్విన్, సుందర్ జట్టులోకి వచ్చారు. ప్రపంచకప్ ఫేవరెట్లలో ఒకటైన జట్టు ఇంకా జట్టు విషయంలో ఇలా అయోమయంలో ఉండటం శుభ సూచకం కాదు. కనీసం ఆస్ట్రేలియా సిరీస్ ముగిసే సమయానికైనా.. మిగతా రెండు స్థానాల విషయంలో స్పష్టత వస్తుందా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకం. శ్రేయస్, అక్షర్ల విషయంలో వీలైనంత త్వరగా స్పష్టత తెచ్చుకుంటే.. ఆస్ట్రేలియాతో సిరీస్లో తిలక్ వర్మ, అశ్విన్, సుందర్ల ప్రదర్శనను బట్టి వారిలో ఇద్దరికి ప్రపంచకప్ జట్టులో అవకాశం కల్పించొచ్చు. ఏదైనా వీలైనంత త్వరగా టీమ్ఇండియా ఈ విషయాన్ని తేల్చేయాల్సిన అవసరముంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
166.. 58 బంతుల్లో ఉఫ్
47 నిమిషాలు.. 58 బంతులు.. 167 పరుగులు.. 0 వికెట్లు! బుధవారం ఉప్పల్ స్టేడియంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో సన్రైజర్స్ బ్యాటింగ్ విధ్వంసమిది. ఇన్నింగ్స్ విరామంలో అభిమానులు స్నాక్స్ తెచ్చుకునేలోపే.. టీవీ సెట్ల ముందున్న ప్రేక్షకులు కాస్త బ్రేక్ తీసుకునేలోపే సన్రైజర్స్ లక్ష్య ఛేదన పూర్తయింది. -
ముంబయి తప్ప..
ఐపీఎల్-17 లీగ్ దశలో ఇంకా 13 మ్యాచ్లే మిగిలాయి. కానీ ఇప్పటికీ ఏ జట్టూ అధికారికంగా ప్లేఆఫ్స్ చేరలేదు. లఖ్నవూపై సన్రైజర్స్ విజయంతో ముంబయి అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. -
సంగీతం వింటూ.. సిరీస్లు చూస్తూ
ఒలింపిక్స్ పతకం నెగ్గాలన్నది ప్రతి అథ్లెట్ కల. అందుకోసం ఒక్కో అథ్లెట్ ఒక్కోలా సాగుతారు. తీవ్రమైన సాధన చేస్తూనే మెదడును ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం ఇతర వ్యాపకాల్లోనూ మునిగిపోతారు. -
మూడేళ్లలో తొలిసారి..
ఒలింపిక్, ప్రపంచ ఛాంపియన్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మూడేళ్లలో తొలిసారి స్వదేశంలో పోటీపడనున్నాడు. భువనేశ్వర్లో ఈ నెల 12 నుంచి 15 వరకు జరిగే జాతీయ ఫెడరేషన్ కప్లో అతడు ఆడనున్నాడు. -
ఓడలో ఫ్రాన్స్కు ఒలింపిక్ జ్యోతి
1896లో తొలిసారి ఉపయోగించిన మూడు వరుసల తెరచాపలతో కూడిన పురాతన ఓడ.. మధ్యధరా సముద్రంలో 12 రోజుల పాటు ప్రయాణం.. చివరగా గమ్యాన్ని చేరుకుని ఫ్రాన్స్లో ఒలింపిక్ జ్యోతి వెలుగులు నింపింది. -
నా రికార్డులను జైస్వాల్ బద్దలు కొడతాడు
టీమ్ఇండియా యువ ఓపెనర్, ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహించే యశస్వి జైస్వాల్కు గొప్ప భవిష్యత్తు ఉందని వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ బ్రయాన్ లారా కొనియాడాడు. -
శాంసన్.. మాస్టర్ బ్లాస్టర్!
ఈ ఐపీఎల్లో భీకర ఫామ్తో సాగిపోతున్న రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్పై ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతణ్ని మాస్టర్బ్లాస్టర్గా అభివర్ణించాడు. -
అమన్పై ఆశలు
ప్రపంచ రెజ్లింగ్ క్వాలిఫయర్స్ గురువారం ఆరంభం కానున్నాయి. పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల కోసం ఇదే చివరి అర్హత ఈవెంట్. భారత ఫ్రీస్టైల్ రెజ్లర్లలో అమన్ శెరావత్, దీపక్ పునియాలపై పెద్ద ఆశలే ఉన్నాయి. -
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
సొంత గడ్డపై హైదరాబాద్ ఎప్పటికీ మరిచిపోలేని అద్భుతమైన విజయాన్ని అందుకుంది. లఖ్నవూను 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి ప్లే ఆఫ్స్కు మరింత చేరువైంది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ పలు రికార్డులు నమోదు చేసింది. -
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్
ఒకే ఒక్క క్యాచ్ రాజస్థాన్ను ఓటమి వైపు నడిపించగా.. గెలుస్తామనే ఆశలు లేని సమయంలో దిల్లీకి ఊపిరి పోసింది. దీంతో ఆ జట్టు విజయం సాధించి ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది. -
నా ‘400’ రికార్డును కొట్టే సత్తా ఈ భారత కుర్రాడి సొంతం: బ్రియాన్ లారా
టీమ్ఇండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్పై బ్రియాన్ లారా అభినందనల వర్షం కురిపించాడు. భవిష్యత్తులో ఎన్నో రికార్డులను కొల్లగొడతాడని పేర్కొన్నాడు.
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్