Aryan Dutt: విరాట్ భుజాలపై సచిన్ను చూసి..
అది 2011 వన్డే ప్రపంచకప్.. శ్రీలంక, భారత్ ఫైనల్. దిల్లీలోని ఇంట్లో టీవీ ముందు కూర్చుని ఆ ఎనిమిదేళ్ల బాలుడు మ్యాచ్ చూస్తున్నాడు.
ధర్మశాల
అది 2011 వన్డే ప్రపంచకప్.. శ్రీలంక, భారత్ ఫైనల్. దిల్లీలోని ఇంట్లో టీవీ ముందు కూర్చుని ఆ ఎనిమిదేళ్ల బాలుడు మ్యాచ్ చూస్తున్నాడు. ధోని సిక్సర్తో జట్టు గెలవడంతో ఆనందంలో మునిగిపోయిన అతను.. క్రికెట్ ఆడతానని తండ్రితో చెప్పాడు. అనంతరం విరాట్ కోహ్లి భుజాల మీద సచిన్ ఊరేగుతుంటే చూసిన ఆ బాలుడు.. వెంటనే బ్యాట్ కొనివ్వమని తండ్రిని కోరాడు. ధోని సిక్సర్, కోహ్లి భుజాలపై సచిన్ను చూసి క్రికెట్పై ప్రేమ పెంచుకున్న ఆ బాలుడు ఎవరో కాదు.. ఇప్పుడు నెదర్లాండ్స్ జట్టులో ఆల్రౌండర్గా రాణిస్తున్న ఆర్యన్ దత్.
20 ఏళ్ల ఈ కుర్రాడు ఇప్పుడు ప్రపంచకప్లో ఆడతుండటమే కాకుండా దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్స్ సంచలన విజయంలో తనదైన పాత్ర పోషించాడు. దిల్లీలో క్రికెట్ ప్రయాణం మొదలెట్టినా.. వలస వెళ్లిన నెదర్లాండ్స్లో అది కొనసాగించడం ఆర్యన్కు కష్టంగా మారింది. అతని కుటుంబం ఉండే డెన్ హాగ్లో క్రికెట్కు ఆదరణే లేదు. అందుకే దగ్గరలోని బాస్కెట్బాల్ కోర్టులో తండ్రి బంతులు విసురుతుంటే ఆర్యన్ బ్యాటింగ్ చేసేవాడు. కానీ ఒకరోజు మాజీ క్రికెటర్ టిమ్ డీ లీడ్ (బాస్ డీ లీడ్ తండ్రి) ఆర్యన్ను చూసి వూర్బర్గ్ క్రికెట్ క్లబ్ అకాడమీకి తీసుకురమ్మని చెప్పాడు. కానీ ఆ దేశంలో మార్చి నుంచి సెప్టెంబర్ వరకే క్రికెట్ సీజన్ ఉండేది.
దీంతో విక్రమ్జీత్ (మరో నెదర్లాండ్స్ ఆటగాడు)తో కలిసి 2015 నుంచి 2019-20 వరకు ప్రతి ఏడాది ఆరు నెలల పాటు శిక్షణ కోసం ఆర్యన్ చండీగఢ్కు వచ్చేవాడు. తక్కువ సమయంలోనే ఎక్కువ ఎత్తు పెరగడంతో ఆర్యన్ కోసం కొత్త బూట్లు కొనడం కష్టమయ్యేది. పాత బూట్లతోనే ఆడుతుంటే సరిగ్గా పరుగెత్తలేకపోయాడు. దీంతో తక్కువ దూరం నుంచి పరుగెత్తుకుంటూ వచ్చి ఆఫ్స్పిన్ వేయడం మొదలెట్టాడు. హర్భజన్, అశ్విన్, లైయన్ వీడియోలు చూసి స్పిన్ బౌలింగ్ మెరుగుపర్చుకున్నాడు. ధోని, సీఎస్కే జట్టుకు ఆర్యన్ వీరాభిమాని. మరోవైపు ఆర్యన్కు బౌలింగ్ కోచ్ తండ్రి రాకేష్ కావడం విశేషం. మంచి హిట్టర్ కూడా అయిన ఆర్యన్.. రబాడ, ఎంగిడి, కోయెట్జీ బౌలింగ్లో సిక్సర్లు కొట్టాడు.
కిర్స్టన్ బాటలో: దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్స్ విజయం వెనుక మైదానంలోని ఆటగాళ్ల కష్టం ఎంత ఉందో బయట కోచ్ కృషి కూడా అంతే ఉంది. టీమ్ఇండియాకు 2011లో ప్రపంచకప్ అందించిన కోచ్ గ్యారీ కిర్స్టన్ బాటలో సాగుతూ నెదర్లాండ్స్ను సంచలన విజయాల దిశగా నడిపిస్తున్నాడు ర్యాన్ కుక్. 2022లో ర్యాన్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి మ్యాచ్లో నెదర్లాండ్స్పై ఇంగ్లాండ్ దాదాపు 500 (498/4) పరుగులు చేసింది. కానీ ఆ దెబ్బ నుంచి కోలుకుని, కిర్స్టన్ లాగే వ్యూహాలను అమలు చేస్తూ నెదర్లాండ్స్ను బలంగా మారుస్తున్నాడు. నిరుడు టీ20 ప్రపంచకప్లో జింబాబ్వే, దక్షిణాఫ్రికాలపై విజయాలు, అనంతరం వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో ఉత్కంఠ మ్యాచ్లో విండీస్పై గెలుపు, ఇప్పుడు ప్రపంచకప్లో సఫారీ సేనపై పైచేయి. ర్యాన్ 2013లో దక్షిణాఫ్రికా అండర్-19 కోచ్గా భారత్కు వచ్చాడు. అప్పుడు ఇక్కడి పరిస్థితులపై అవగాహన కోసం కిర్స్టన్ సాయం తీసుకున్నాడు. కేప్టౌన్లోని కిర్స్టన్ అకాడమీలో అతనితో కలిసి ర్యాన్ పనిచేశాడు. ఇప్పుడు జట్టులోని ఆటగాళ్లను సానబెడుతూ అత్యుత్తమ ప్రదర్శన రాబడుతున్నాడు. నెదర్లాండ్స్ జట్టును అందరూ పసికూన అంటున్నారని, కానీ పెద్ద జట్లతో తలపడే క్రికెట్ దేశంగా భావిస్తూ ఈ ప్రపంచకప్లో మూణ్నాలుగు విజయాలు సాధించడమే తమ లక్ష్యమని ర్యాన్ చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81