IND vs AUS: ముగింపు అదిరింది
ఆస్ట్రేలియాతో అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్ను టీమ్ఇండియా 4-1తో సొంతం చేసుకుంది. ఆదివారం అయిదో మ్యాచ్లో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. మందకొడి పిచ్పై మొదట భారత్ 8 వికెట్లకు 160 పరుగులే చేయగలిగింది.
160 పరుగులను కాపాడుకున్న భారత్
4-1తో సిరీస్ భారత్ వశం
మెరిసిన అక్షర్, ముకేశ్, అర్ష్దీప్
ఆఖరి టీ20లో ఆసీస్ ఓటమి
టీమ్ఇండియా అదుర్స్.ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ కంగారూలతో పొట్టి పోరును ఘనంగా ముగించింది. తక్కువ స్కోరే చేసినా, బౌలర్లు సమష్టిగా రాణించిన వేళ.. ఆసక్తికర ఆఖరి మ్యాచ్లో గెలిచి భారత్ 4-1తో టీ20 సిరీస్ను చేజిక్కించుకుంది. బ్యాటుతో శ్రేయస్ రాణిస్తే.. అక్షర్, బిష్ణోయ్, ముకేశ్, అర్ష్దీప్ గొప్పగా బౌలింగ్ చేశారు. ఆఖరి ఓవర్లో పది పరుగులు చేయాల్సిన ఆస్ట్రేలియాను అర్ష్దీప్ అడ్డుకున్న తీరు అద్భుతం.
బెంగళూరు : ఆస్ట్రేలియాతో అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్ను టీమ్ఇండియా 4-1తో సొంతం చేసుకుంది. ఆదివారం అయిదో మ్యాచ్లో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. మందకొడి పిచ్పై మొదట భారత్ 8 వికెట్లకు 160 పరుగులే చేయగలిగింది. శ్రేయస్ అయ్యర్ (53; 37 బంతుల్లో 5×4, 2×6) టాప్ స్కోరర్. అక్షర్ పటేల్ (31; 21 బంతుల్లో 2×4, 1×6) రాణించాడు. డ్వార్షిస్ (2/30), బెరెండార్ఫ్ (2/38), తన్వీర్ సంఘా (1/26) భారత్ను కట్టడి చేశారు. ఛేదనలో ఆస్ట్రేలియా 8 వికెట్లకు 154 పరుగులే చేయగలిగింది. మెక్డెర్మట్ (54; 36 బంతుల్లో 5×6) టాప్ స్కోరర్. ముకేశ్ కుమార్ (3/32), రవి బిష్ణోయ్ (2/29), అర్ష్దీప్ సింగ్ (2/40), అక్షర్ పటేల్ (1/14) చక్కని బౌలింగ్తో ఆసీస్ను దెబ్బతీశారు. ఆల్రౌండ్ ప్రదర్శన చేసిన అక్షర్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. బిష్ణోయ్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా ఎంపికయ్యాడు.
బౌలర్లు సమష్టిగా..: నిర్దేశించిన లక్ష్యం చిన్నదే అయినా.. బౌలర్లు సమష్టిగా రాణించడంతో టీమ్ఇండియా పైచేయి సాధించింది. స్పిన్నర్లు మరోసారి అద్భుతంగా రాణించగా.. పేసర్లూ ఆకట్టుకున్నారు. అయితే ఛేదన ఆరంభంలో ఆసీస్ బాగానే ఉంది. ఫిలిప్ (4)ను బౌల్డ్ చేయడం ద్వారా ఆసీస్ పతనాన్ని ముకేశ్ త్వరగానే ఆరంభించినా.. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (28; 18 బంతుల్లో 5×4, 1×6) అలవాటైన రీతిలో ధాటిగా ఆడడంతో ఆసీస్ అయిదో ఓవర్లో 47/1తో నిలిచింది. కానీ బిష్ణోయ్ వరుస ఓవర్లలో హెడ్, హార్డీ (6)లను ఔట్ చేసి భారత్లో ఉత్సాహం నింపాడు. ఆ దశలో మెక్డెర్మట్ నిలబడి ఆసీస్ను నడిపించాడు. కానీ బ్యాట్ ఝుళిపించలేకపోయాడు. అక్షర్, బిష్ణోయ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు అంత తేలిగ్గా రాలేదు. టిమ్ డేవిడ్ (17) కూడా ధాటిగా ఆడలేకపోయాడు. 8 నుంచి 10 ఓవర్ల మధ్య ఆసీస్కు 15 పరుగులే వచ్చాయి. కానీ ఆ తర్వాత బిష్ణోయ్, అర్ష్దీప్ బౌలింగ్లో మెక్డెర్మట్ ఒక్కో సిక్స్ దంచాడు. అయితే ఎట్టకేలకు ఓ సిక్స్తో గాడినపడ్డట్లు కనిపించిన డేవిడ్ను 14వ ఓవర్లో అక్షర్ ఔట్ చేశాడు. అప్పటికి స్కోరు 102. చివరి ఆరు ఓవర్లలో ఆసీస్కు 57 పరుగులు అవసరమయ్యాయి. 15వ ఓవర్లో అర్ష్దీప్ 12 పరుగులిచ్చినా.. మెక్డెర్మట్ను ఔట్ చేశాడు.
ఆ మలుపు.. ఆ ఓవర్..: 24 బంతుల్లో 37 పరుగులు.. 17వ ఓవర్ ఆరంభానికి ముందు ఆసీస్ లక్ష్యమిది. క్రీజులో వేడ్, షార్ట్ (16) ఉన్నారు. ఇంకో 5 వికెట్లు ఉండటంతో ఆసీస్ సులభంగానే గెలుస్తుందనిపించింది. అయితే.. ముకేశ్ వరుస బంతుల్లో షార్ట్, డ్వార్షిస్ను ఔట్ చేసి మ్యాచ్ను మలుపు తిప్పాడు. ఆ ఓవర్లో 5 పరుగులు మాత్రమే వచ్చాయి. 18వ ఓవర్లో అవేశ్ ఖాన్ 15 పరుగులు సమర్పించుకున్నా.. మరోసారి ముకేశ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 19వ ఓవర్లో 7 పరుగులే ఇచ్చి ఆసీస్పై ఒత్తిడి పెంచాడు. ఇక ఆఖరి ఓవర్లో ఆసీస్కు 10 పరుగులు అవసరమయ్యాయి. వేడ్ (22) క్రీజులో ఉండడంతో ఆ జట్టుకు మంచి అవకాశాలే ఉన్నాయి. కానీ అర్ష్దీప్ కట్టుదిట్టమైన బౌలింగ్తో కంగారూలను కట్టిపడేశాడు. తొలి రెండు బంతుల్లో ఒక్క పరుగూ ఇవ్వని అతడు.. మూడో బంతికి వేడ్ను ఔట్ చేసి భారత శిబిరాన్ని సంతోషంలో ముంచెత్తాడు. మిగతా మూడు బంతుల్లో మరో మూడు సింగిల్సే ఇచ్చి ఆసీస్ ఆశలపై నీళ్లు చల్లాడు.
రాణించిన శ్రేయస్: అంతకుముందు టీమ్ఇండియా బ్యాటుతో తడబడింది. ఏ దశలోనూ ఇన్నింగ్స్ పెద్దగా జోరందుకోలేదు. భారత్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. శ్రేయస్ నిలబడడంతో ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. మందకొడి పిచ్పై స్పిన్నర్ తన్వీర్ సంఘా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. పేసర్ హార్డీ కూడా బ్యాటర్లను స్వేచ్ఛగా ఆడనివ్వలేదు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు మంచి ఆరంభం దక్కలేదు. రుతురాజ్తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన యశస్వి జైస్వాల్ (21) బ్యాట్ ఝుళిపించడానికి కొంత సమయం తీసుకున్నాడు. మూడో ఓవర్లో హార్డీ బౌలింగ్లో సిక్స్తో గేర్ మార్చిన అతడు.. బెరెండార్ఫ్ బౌలింగ్లో మరో సిక్స్ కొట్టాడు. కానీ అతడి జోరు ఎంతోసేపు సాగలేదు. బెరెండార్ఫ్ బౌలింగ్లోనే ఎలిస్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. నాలుగో ఓవర్లో అతడు నిష్క్రమించేటప్పటికి స్కోరు 33. ఆ తర్వాత భారత్ చకచకా మరో మూడు వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. డ్వార్షిస్ బౌలింగ్లో రుతురాజ్ (10).. బెరెండార్ఫ్కు చిక్కాడు. సూర్య (5) వరుసగా రెండో మ్యాచ్లో విఫలమయ్యాడు. ఆఫ్స్టంప్ ఆవల డ్వార్షిస్ షార్ట్ లెంగ్త్ బంతిని నేరుగా పాయింట్లో మెక్డెర్మట్ చేతుల్లోకి కట్ చేశాడు. ఫామ్లో ఉన్న రింకు సింగ్ (6) కూడా త్వరగా పెవిలియన్ బాట పట్టాడు. అతడు పదో ఓవర్లో సంఘా బౌలింగ్లో డేవిడ్కు తేలికైన క్యాచ్ ఇవ్వడంతో భారత్ 55/4తో నిలిచింది. కానీ వికెట్కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ (24; 16 బంతుల్లో 3×4, 1×6) బ్యాట్ ఝుళిపించాడు. శ్రేయస్ కూడా డ్వార్షిస్ బౌలింగ్లో వరుసగా 6, 4 బాదడంతో స్కోరు వేగం పెరిగింది. 13 ఓవర్లలో 97/4తో నిలిచింది భారత్. కానీ ఊపు మీదున్న దశలో జితేశ్ ఔటయ్యాడు. ఆ తర్వాత అక్షర్తో కలిసి శ్రేయస్ ఇన్నింగ్స్ను నడిపించాడు. కానీ 14 నుంచి 17 ఓవర్ల మధ్య 18 పరుగులు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత ఎలిస్ బౌలింగ్లో ఓ ఫోర్, బెరెండార్ఫ్ బౌలింగ్లో సిక్స్ కొట్టి అక్షర్ ఔటయ్యాడు. అతడు శ్రేయస్తో ఆరో వికెట్కు 46 పరుగులు జోడించాడు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో శ్రేయస్ ఓ ఫోర్, సిక్స్ కొట్టి నిష్క్రమించాడు.
భారత్ ఇన్నింగ్స్: యశస్వి జైస్వాల్ (సి) ఎలిస్ (బి) బెరెండార్ఫ్ 21; రుతురాజ్ (సి) బెరెండార్ఫ్ (బి) డ్వార్షిస్ 10; శ్రేయస్ అయ్యర్ (బి) ఎలిస్ 53; సూర్యకుమార్ యాదవ్ (సి) మెక్డెర్మట్ (బి) డ్వార్షిస్ 5; రింకు సింగ్ (సి) డేవిడ్ (బి) సంఘా 6; జితేశ్ శర్మ (సి) షార్ట్ (బి) హార్డీ 24; అక్షర్ పటేల్ (సి) హార్డీ (భి) బెరెండార్ఫ్ 31; రవి బిష్ణోయ్ రనౌట్ 2; అర్ష్దీప్ సింగ్ నాటౌట్ 2; ఎక్స్ట్రాలు 6 మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 160; వికెట్ల పతనం: 1-33, 2-33, 3-46, 4-55, 5-97, 6-143, 7-156, 8-160; బౌలింగ్: హార్డీ 4-0-21-1; బెరెండార్ఫ్ 4-0-38-2; డ్వార్షిస్ 4-0-30-2; నాథన్ ఎలిస్ 4-0-42-1; తన్వీర్ సంఘా 4-0-26-1
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: ట్రావిస్ హెడ్ (బి) బిష్ణోయ్ 28; ఫిలిప్ (బి) ముకేశ్ 4; మెక్డెర్మట్ (సి) రింకు (భి) అర్ష్దీప్ 54; హార్డీ (సి) శ్రేయస్ (బి) బిష్ణోయ్ 6; టిమ్ డేవిడ్ (సి) అవేష్ (బి) అక్షర్ 17; షార్ట్ (సి) రుతురాజ్ (బి) ముకేశ్ 16; వేడ్ (సి) శ్రేయస్ (బి) అర్ష్దీప్ 22; డ్వార్షిస్ (బి) ముకేశ్ 0; ఎలిస్ నాటౌట్ 4; బెరెండార్ఫ్ నాటౌట్ 2; ఎక్స్ట్రాలు 1 మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 154; వికెట్ల పతనం: 1-22, 2-47, 3-55, 4-102, 5-116, 6-129, 7-129, 8-151; బౌలింగ్: అర్ష్దీప్ సింగ్ 4-0-40-2; అవేష్ ఖాన్ 4-0-39-0; ముకేశ్ కుమార్ 4-0-32-3; రవి బిష్ణోయ్ 4-0-29-2; అక్షర్ పటేల్ 4-0-14-1
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్