IND w Vs ENG w: సివర్, వ్యాట్ ధనాధన్
ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో భారత మహిళలకు పేలవ ఆరంభం. బుధవారం జరిగిన తొలి టీ20లో ఆతిథ్య జట్టు 38 పరుగుల తేడాతో ఓడిపోయింది. అన్ని విభాగాల్లోనూ ఇంగ్లాండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.
తొలి టీ20 ఇంగ్లాండ్దే
భారత మహిళల పరాజయం
ముంబయి: ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో భారత మహిళలకు పేలవ ఆరంభం. బుధవారం జరిగిన తొలి టీ20లో ఆతిథ్య జట్టు 38 పరుగుల తేడాతో ఓడిపోయింది. అన్ని విభాగాల్లోనూ ఇంగ్లాండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. నాట్ సివర్ (77; 53 బంతుల్లో 13×4), డానీ వ్యాట్ (75; 47 బంతుల్లో 8×4, 2×6) చెలరేగడంతో మొదట ఇంగ్లాండ్ 6 వికెట్లకు 197 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఛేదనలో తడబడ్డ భారత్ 6 వికెట్లకు 159 పరుగులే చేయగలిగింది. షెఫాలి వర్మ (52; 42 బంతుల్లో 9×4) టాప్ స్కోరర్. సోఫీ ఎకిల్స్టోన్ (3/15) భారత్ను దెబ్బతీసింది.
షెఫాలి రాణించినా..: భారీ లక్ష్య ఛేదనలో భారత్ ఏ దశలో బలంగా ఉన్నట్లు కనపడలేదు. షెఫాలి నిలిచినా.. ఆమెకు మరోవైపు నుంచి పెద్దగా సహకారం లభించలేదు. స్మృతి మంధాన (6), జెమీమా (4) త్వరగానే ఔటైనా.. షెఫాలి మెరుపులతో భారత్ 6 ఓవర్లలో 53/2తో నిలిచింది. షెఫాలితో పాటు కెప్టెన్ హర్మన్ప్రీత్ నిలవడంతో పది ఓవర్లకు స్కోరు 82/2. అప్పటికే సాధించాల్సిన రన్రేట్ పెరిగింది. హర్మన్ప్రీత్ ఔటైనా.. షెఫాలి, రిచా కాస్త బ్యాట్ ఝళిపించారు. కానీ లక్ష్యం పెద్దది కావడంతో సాధించాల్సిన రన్రేట్ ఇంకా పెరిగిపోయింది. చివరి ఆరు ఓవర్లలో 79 పరుగులు చేయాల్సిన పరిస్థితి. కష్టమైన పనే. ఆ దశలో రిచాను సారా గ్లెన్, షెఫాలిని ఎకిల్స్టోన్ ఔట్ చేయడంతో భారత్కు చిన్న ఆశ కూడా లేకుండా పోయింది. చివరి మూడు ఓవర్లలో 58 పరుగులు చేయాల్సిన స్థితిలో ఓటమి ఖాయమైపోయింది. 17, 19వ ఓవర్లలో కలిపి సోఫీ 8 పరుగులే ఇచ్చింది.
దంచేసిన ఆ ఇద్దరు: ఇంగ్లాండ్ అంత భారీ స్కోరు చేయడం ఊహించనిదే. ఇన్నింగ్స్ను ఆ జట్టు అంత పేలవంగా ఆరంభించింది. 2/2... తొలి ఓవరైనా పూర్తి కాకముందే ఇంగ్లాండ్ పరిస్థితిది. కానీ ఆ జట్టును కట్టడి చేసే అద్భుత అవకాశాన్ని భారత్ చేజార్చుకుంది. వ్యాట్, సివర్ జంట విధ్వంసక బ్యాటింగ్తో ఇంగ్లాండ్కు భారీ స్కోరును అందించింది. టాస్ గెలిచి భారత్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. రేణుక తొలి ఓవర్లోనే ఇంగ్లాండ్ను గట్టి దెబ్బతీసింది. వరుస బంతుల్లో డంక్లీ (1), క్యాప్సీ (0)లను బౌల్డ్ చేసి భారత్కు అదిరే ఆరంభాన్నిచ్చింది. కానీ సంబరాలు తాత్కాలికమే. ఓపెనర్ వ్యాట్కు తోడైన నాట్ సివర్ ధనాధన్ బ్యాటింగ్తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ బ్యాటర్లిద్దరూ అలవోకగా బౌండరీలు కొట్టారు. పది ఓవర్లలో ఇంగ్లాండ్ 89/2తో పటిష్ట స్థితిలో నిలిచింది. తర్వాత కూడా జోరు కొనసాగించిన సివర్.. రేణుక బౌలింగ్లో వరుసగా రెండు ఫోర్లు బాదింది. శ్రేయాంక బౌలింగ్లో ముందుకొచ్చి లాంగాఫ్లో సిక్స్ కొట్టిన వ్యాట్ అర్ధశతకం పూర్తి చేసుకుంది. తర్వాతి ఓవర్లో బౌండరీతో సివర్ అర్ధసెంచరీ సాధించింది. 15వ ఓవర్లలో ఇంగ్లాండ్ 140/2తో నిలిచింది. జోరుమీదున్న వ్యాట్ను తర్వాతి ఓవర్లో ఔట్ చేయడం ద్వారా 138 పరుగుల భాగస్వామ్యాన్ని ఇషాక్ విడదీసినా భారత్కు పెద్దగా ఉపశమనం లేకపోయింది. సివర్ ధాటైన బ్యాటింగ్ను కొనసాగించింది. వస్త్రాకర్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టేసింది. ఆమె కన్నా ముందు నైట్ కూడా ఓ ఫోర్ కొట్టడంతో ఆ ఓవర్లో ఏకంగా 19 పరుగులు వచ్చాయి. ఇంగ్లాండ్ చివరి మూడు ఓవర్లలో సివర్ వికెట్ సహా 3 వికెట్లు కోల్పోయి మరో 33 పరుగులు సాధించింది. అమీ జోన్స్ (23; 9 బంతుల్లో 3×4, 1×6) బ్యాట్ ఝళిపించింది.
ఇంగ్లాండ్ మహిళల ఇన్నింగ్స్: డంక్లీ (బి) రేణుక సింగ్ 1; డానీ వ్యాట్ (స్టంప్డ్) రిచా (బి) ఇషాక్ 75; క్యాప్సీ (బి) రేణుక సింగ్ 0; నాట్ సివర్ (సి) రిచా (బి) రేణుక సింగ్ 77; హెదర్ నైట్ (బి) శ్రేయాంక 6; అమీ జోన్స్ (సి) జెమీమా (బి) శ్రేయాంక 23; ఫ్రెయా కెంప్ నాటౌట్ 5; ఎక్స్ట్రాలు 10
మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 197;
వికెట్ల పతనం: 1-2, 2-2, 3-140, 4-165, 5-177, 6-197;
బౌలింగ్: రేణుక సింగ్ 4-0-27-3; పూజ వస్త్రాకర్ 4-0-44-0; సైకా ఇషాక్ 4-0-38-1; దీప్తి శర్మ 3-0-28-0; శ్రేయాంక పాటిల్ 4-0-44-2; కనిక ఆహుజా 1-0-12-0
భారత మహిళల ఇన్నింగ్స్: షెఫాలి వర్మ (సి) సారా గ్లెన్ (బి) ఎకిల్స్టోన్ 52; స్మృతి మంధాన (బి) నాట్ సివర్ 6; జెమీమా (సి) జోన్స్ (బి) ఫ్రెయా కెంప్ 4; హర్మన్ప్రీత్ (బి) ఎకిల్స్టోన్ 26; రిచా ఘోష్ (సి) క్యాప్సీ (బి) సారా గ్లెన్ 21; కనిక (సి) నాట్ సివర్ (బి) ఎకిల్స్టోన్ 15; పూజ వస్త్రాకర్ నాటౌట్ 11; దీప్తి శర్మ నాటౌట్ 3; ఎక్స్ట్రాలు 21
మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 159;
వికెట్ల పతనం: 1-20, 2-41, 3-82, 4-122, 5-134, 6-151;
బౌలింగ్: మహిక గౌర్ 2-0-18-0; లారెన్ బెల్ 4-0-35-0; నాట్ సివర్ 4-0-35-1; ఫ్రెయా కెంప్ 2-0-30-1; సోఫీ ఎకిల్స్టోన్ 4-0-15-3; సారా గ్లెన్ 4-0-25-1
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
గాయం కారణంగా టీమ్కు దూరమైన స్టార్ పేసర్ షమీ.. తిరిగి జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. -
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి