IND vs ENG: ఆపద్బాంధవుడు
నాలుగో టెస్టులో ఓటమి ప్రమాదం నుంచి బయటపడ్డ టీమ్ఇండియా.. విజయం దిశగా సాగడంలో అశ్విన్, కుల్దీప్ కంటే కూడా ధ్రువ్ జురెల్కు ఎక్కువ ఘనత దక్కాల్సిందే. రాజ్కోట్లో గత టెస్టుతో అరంగేట్రం చేసి.. కేవలం రెండోసారి మాత్రమే బ్యాటింగ్కు వచ్చిన ఈ 23 ఏళ్ల వికెట్ కీపర్ నైపుణ్యాల గురించి ఎంత చెప్పినా తక్కువే.
నాలుగో టెస్టులో ఓటమి ప్రమాదం నుంచి బయటపడ్డ టీమ్ఇండియా.. విజయం దిశగా సాగడంలో అశ్విన్, కుల్దీప్ కంటే కూడా ధ్రువ్ జురెల్కు ఎక్కువ ఘనత దక్కాల్సిందే. రాజ్కోట్లో గత టెస్టుతో అరంగేట్రం చేసి.. కేవలం రెండోసారి మాత్రమే బ్యాటింగ్కు వచ్చిన ఈ 23 ఏళ్ల వికెట్ కీపర్ నైపుణ్యాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంగ్లాండ్ స్పిన్నర్ల ధాటికి నిలబడలేక ప్రధాన బ్యాటర్లు పెవిలియన్ చేరిన వేళ.. ధ్రువ్ పట్టుదలతో ఎదురు నిలిచాడు. 177/7తో ఉన్న జట్టును 307 పరుగులకు చేర్చాడు. ఈ క్రమంలో అత్యంత కీలకమైన 90 పరుగులు సాధించాడు. అతను శతకానికి 10 పరుగుల దూరంలో ఆగిపోయి ఉండొచ్చు కానీ అతని ఇన్నింగ్స్ సెంచరీ కంటే ఎంతో విలువైందే. 50 కంటే తక్కువ ఆధిక్యమే జట్టు కోల్పోయింది కాబట్టి మన స్పిన్నర్లు రెండో ఇన్నింగ్స్లో స్వేచ్ఛగా బౌలింగ్ చేసి ఇంగ్లాండ్ను కుప్పకూల్చారు. అదే ఆధిక్యం 100 కంటే ఎక్కువ ఉంటే అప్పుడు ఒత్తిడి ఉండేది. పరిస్థితులు మరింత కఠినంగా మారేవి. కానీ టెయిలెండర్లతో కలిసి 130 పరుగులు జత చేసిన ధ్రువ్ ఆ ఇబ్బంది లేకుండా చేశాడు. ఈ వయసులోనే గొప్ప పరిణతి ప్రదర్శించాడు. ఓపికతో ఆడటమే కాదు అలవోకగా బౌండరీలూ సాధించాడు. 211 నిమిషాలు క్రీజులో నిలబడి 149 బంతులాడాడు. అర్ధశతకం తర్వాత కార్గిల్ యుద్ధ వీరుడైన తండ్రి నీమ్ చంద్ కోసం ధ్రువ్ సెల్యూట్ చేశాడు. తండ్రి యుద్ధ వీరుడైతే.. తనయుడు మైదానంలో అదే పోరాట స్ఫూర్తితో యోధుడిగా నిలుస్తున్నాడు. అరంగేట్ర టెస్టు ఇన్నింగ్స్లోనూ జట్టు 331/7తో ఉన్న దశలో 46 పరుగులతో ఆదుకున్నాడు.
వికెట్ కీపింగ్ నైపుణ్యాలతోనూ ఆకట్టుకున్నాడు. తాజాగా అండర్సన్ క్యాచ్ను అందుకున్న తీరు గురించి చెప్పుకోవాలి. రివర్స్ స్వీప్ ఆడేందుకు అండర్సన్ ప్రయత్నించగా.. తొడకు, బ్యాట్కు తాకి వచ్చిన బంతిని మెరుపు వేగంతో స్పందించి ధ్రువ్ ఒంటిచేత్తో పట్టుకున్నాడు. 2022 డిసెంబర్ చివర్లో రోడ్డు ప్రమాదంతో పంత్ జట్టుకు దూరమైనప్పటి నుంచి టెస్టుల్లో వికెట్కీపర్ కోసం జట్టు వెతుకుతోంది. కేఎస్ భరత్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్లను ఆడించి చూసింది. ఇప్పుడు పంత్ పునరాగమనానికి సిద్ధమవుతున్న సమయంలో అతడికి దీటైన వికెట్కీపర్ బ్యాటర్గా ధ్రువ్ కనిపిస్తున్నాడు. ఈ టెస్టు సిరీస్కు ముందు రోజుకు 140 ఓవర్ల పాటు ధ్రువ్ బ్యాటింగ్ సాధన చేశాడు. వేర్వేరు స్పిన్ పిచ్లపై నాలుగు గంటలు ప్రాక్టీస్ కొనసాగించాడు. ఇప్పుడు ధ్రువ్ పేరు మార్మోగుతోంది కానీ అసలు ఈ సిరీస్లో ఆడతానని అతను కూడా ఊహించి ఉండడు. ఎందుకంటే టెస్టు జట్టులో వికెట్కీపర్గా కేఎస్ భరత్ ఉన్నాడు. ప్రత్యామ్నాయంగా ఇషాన్ కిషన్ ఉన్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఇషాన్ను పక్కన పెట్టి ధ్రువ్ను జట్టుకు ఎంపిక చేశారు. కానీ తొలి రెండు టెస్టుల్లో భరత్ ఆడాడు. అతను విఫలమవడంతో మూడో టెస్టులో ధ్రువ్కు అవకాశం వచ్చింది. అతను మరో ధోనీగా ఎదుగుతాడంటూ క్రికెట్ దిగ్గజం గావస్కర్ కితాబివ్వడం విశేషం. ‘‘అవును.. ధ్రువ్ గొప్పగా బ్యాటింగ్ చేశాడు. కానీ వికెట్ల వెనకాల అతని పనితనం కూడా గొప్పగా ఉంది. ఆటపై అతని అవగాహన చూస్తుంటే మరో ధోనీలా ఎదుగుతాడనిపిస్తోంది. మరో ధోని రాడని తెలుసు. కానీ ధోనీలాగే ధ్రువ్ ఆలోచనా విధానం ఉంది’’ అని గావస్కర్ చెప్పాడు.
ఈనాడు క్రీడావిభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే